నమ్మకం…మూఢనమ్మకం…
మొన్న పోస్ట్ లో పొలతలలో దెయ్యం వదిలించడమనే విషయం గురించి చదివారు…అంతే కాదు అప్పుడప్పుడూ టీవీల్లో కొన్ని వార్తా విశేషాలు చూస్తుంటాము..పాతబస్తీలో ఓ వైద్యుడు బ్లేడుతో గాట్లు పెట్టడం, మరొకచోట వేపమండలతో వీపు మీద బాదటం… ఇంకొకచోటా తలపైన గుడ్లు పగలగొట్టడం లాంటివి fast forward techinique లో చూపిస్తుంటే పగలబడి వారి మూఢత్వానికి నవ్వుకుంటాం….
మనమే నాగరీకులం అయినట్టు… కానీ మనం చేసే పనులో!?
అక్కడ పొలతల లాంటిచోట్ల వాళ్లు చదివే మంత్రాలకు అర్ధం చదివేవాడికి, వైద్యం చేయించుకునేవాడికి తెలియదు…. మన పూజగదుల్లో, గుళ్లలో చదివేవాటి అర్ధాలు మనకూ తెలియదు…
అక్కడ దయ్యాలు వదిలాక కోనేటి మురికినీళ్ల స్నానానికి నవ్వుకుంటాము… ఇక్కడ మనమూ పొర్లుదండాలు పెడతాము…
ఇక అక్కడి జంతుబలులను నిరసిస్తాము…. మన పూజా సమయాల్లో కట్టుకునే పట్టు వస్త్రాలకు ఎన్ని వందల, వేల పట్టుపురుగులు చస్తాయో చూసుకోము….
ఆ బలులకు సింబాలిక్ గా మనం కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టడం లేదా? ఏదైనా కొత్త వాహనం కొంటే వాటి చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి కసక్కున తొక్కించడం లేదా?
అంతెందుకు.. ఇంటికి కొత్తసభ్యులొస్తే రక్తానికి ప్రతీకగా ఎర్రనీళ్ల దిష్టి తీయడం లేదా???
ఇక అక్కడ మంత్రగాళ్లు అక్కదేవతల పేర అక్కమహాదేవి ఫోటో పెట్టి భారీగా డబ్బు గుంజుతూ మోసాలు చేస్తే మన ప్రభుత్వాలే మోసాలు చేసి దోచుకుంటుంటే చూస్తూ ఉంటాము…
ఎలాగంటారా?
మనిషి చచ్చాక ఎవడూ వచ్చి ఇదిగో ఇలా జరుగుతుందని చెప్పలేదు….
అయితేనేం చచ్చాక పెద్దదినం చేస్తాము… కొన్ని వర్ణాలోళ్లు తద్దినాలు, మరికొందరు మహాలయ అమావాస్య అని చేస్తారు…
ఇక అస్థినిమజ్జనం అంటూ గంగ దగ్గరొక క్రతువు… గయలో పిండం పెడితే ఆ తర్వాత పెట్టే అవసరం ఉండదని మరొక నమ్మకం….
ఇన్ని చేసినా పాపం ప్రేతాత్మల ఆకలి తీరదు…. మళ్లీ పుష్కరాలంటూ గోల….
ఈ పుష్కరాలకూ “మహా” అనే మాటొకటి తగిలించడం… 2015 గోదావరి పుష్కరాలు మహా పుష్కరాలు 144 ఏళ్లకొకసారొచ్చేవన్నారు… అంటే ఇంతకుముందు 1871 లో జరిగుంటాయి… మరి 1883 లో జరిగుంటాయి కదా.. అప్పుడు వచ్చే 2027 వి మహా పుష్కరాలు కావా?
మరి కృష్ణావి మహా కాదా?
అసలు మొన్న గోదావరి పుష్కరాల్లో లక్షలాది జనం రాజమండ్రిలో చేసిన స్నానాలు గోదావరి జలాల్లోనేనా?
పుష్కరాల పేర కోట్లాది రూపాయలు దోచుకోవడం చూడటం లేదా? మీరిప్పుడు పుష్కరాలు జరుగుతున్న జిల్లా ఎడిషన్లు చదివితే ప్రతీ చోటా 50% పనులకంటే జరగని విషయం గ్రహిస్తారు…. వేలాది కోట్లు తేరగా మింగటం మళ్ళీ వచ్చే పుష్కరాలకు తిరిగి మేయటం….
మొన్న కృష్నా కే వరద రాకుంటే చూడండి… మా సంగమేశ్వరంలో భవనాశిని అన్న సెలఏటిని త్రెంచులు తవ్వి ఘాట్ల దగ్గరికి తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి…. ఇక శ్రీశైలం లో ఫంగస్ చేరిన నీళ్లు నిలివున్నాయి… మరి దీన్లో స్నానాలు చేసి బావుకునేదేముందో…
ఒక ప్రాంత ప్రయోజనాలు దెబ్బతీసి పుష్కరాలకంటూ నీళ్లు దోచుకుపోయేదే పుణ్య కార్యమో మీకే తెలియాలి….
ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడీ పొలతల మంత్రగాళ్ల దోపిడీని మించినది కాదా?
ఇంతకూ నమ్మకం…మూఢనమ్మకానికి తేడా ఎంతంటారు??
మొన్న పోస్ట్ లో పొలతలలో దెయ్యం వదిలించడమనే విషయం గురించి చదివారు…అంతే కాదు అప్పుడప్పుడూ టీవీల్లో కొన్ని వార్తా విశేషాలు చూస్తుంటాము..పాతబస్తీలో ఓ వైద్యుడు బ్లేడుతో గాట్లు పెట్టడం, మరొకచోట వేపమండలతో వీపు మీద బాదటం… ఇంకొకచోటా తలపైన గుడ్లు పగలగొట్టడం లాంటివి fast forward techinique లో చూపిస్తుంటే పగలబడి వారి మూఢత్వానికి నవ్వుకుంటాం….
మనమే నాగరీకులం అయినట్టు… కానీ మనం చేసే పనులో!?
అక్కడ పొలతల లాంటిచోట్ల వాళ్లు చదివే మంత్రాలకు అర్ధం చదివేవాడికి, వైద్యం చేయించుకునేవాడికి తెలియదు…. మన పూజగదుల్లో, గుళ్లలో చదివేవాటి అర్ధాలు మనకూ తెలియదు…
అక్కడ దయ్యాలు వదిలాక కోనేటి మురికినీళ్ల స్నానానికి నవ్వుకుంటాము… ఇక్కడ మనమూ పొర్లుదండాలు పెడతాము…
ఇక అక్కడి జంతుబలులను నిరసిస్తాము…. మన పూజా సమయాల్లో కట్టుకునే పట్టు వస్త్రాలకు ఎన్ని వందల, వేల పట్టుపురుగులు చస్తాయో చూసుకోము….
ఆ బలులకు సింబాలిక్ గా మనం కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టడం లేదా? ఏదైనా కొత్త వాహనం కొంటే వాటి చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి కసక్కున తొక్కించడం లేదా?
అంతెందుకు.. ఇంటికి కొత్తసభ్యులొస్తే రక్తానికి ప్రతీకగా ఎర్రనీళ్ల దిష్టి తీయడం లేదా???
ఇక అక్కడ మంత్రగాళ్లు అక్కదేవతల పేర అక్కమహాదేవి ఫోటో పెట్టి భారీగా డబ్బు గుంజుతూ మోసాలు చేస్తే మన ప్రభుత్వాలే మోసాలు చేసి దోచుకుంటుంటే చూస్తూ ఉంటాము…
ఎలాగంటారా?
మనిషి చచ్చాక ఎవడూ వచ్చి ఇదిగో ఇలా జరుగుతుందని చెప్పలేదు….
అయితేనేం చచ్చాక పెద్దదినం చేస్తాము… కొన్ని వర్ణాలోళ్లు తద్దినాలు, మరికొందరు మహాలయ అమావాస్య అని చేస్తారు…
ఇక అస్థినిమజ్జనం అంటూ గంగ దగ్గరొక క్రతువు… గయలో పిండం పెడితే ఆ తర్వాత పెట్టే అవసరం ఉండదని మరొక నమ్మకం….
ఇన్ని చేసినా పాపం ప్రేతాత్మల ఆకలి తీరదు…. మళ్లీ పుష్కరాలంటూ గోల….
ఈ పుష్కరాలకూ “మహా” అనే మాటొకటి తగిలించడం… 2015 గోదావరి పుష్కరాలు మహా పుష్కరాలు 144 ఏళ్లకొకసారొచ్చేవన్నారు… అంటే ఇంతకుముందు 1871 లో జరిగుంటాయి… మరి 1883 లో జరిగుంటాయి కదా.. అప్పుడు వచ్చే 2027 వి మహా పుష్కరాలు కావా?
మరి కృష్ణావి మహా కాదా?
అసలు మొన్న గోదావరి పుష్కరాల్లో లక్షలాది జనం రాజమండ్రిలో చేసిన స్నానాలు గోదావరి జలాల్లోనేనా?
పుష్కరాల పేర కోట్లాది రూపాయలు దోచుకోవడం చూడటం లేదా? మీరిప్పుడు పుష్కరాలు జరుగుతున్న జిల్లా ఎడిషన్లు చదివితే ప్రతీ చోటా 50% పనులకంటే జరగని విషయం గ్రహిస్తారు…. వేలాది కోట్లు తేరగా మింగటం మళ్ళీ వచ్చే పుష్కరాలకు తిరిగి మేయటం….
మొన్న కృష్నా కే వరద రాకుంటే చూడండి… మా సంగమేశ్వరంలో భవనాశిని అన్న సెలఏటిని త్రెంచులు తవ్వి ఘాట్ల దగ్గరికి తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి…. ఇక శ్రీశైలం లో ఫంగస్ చేరిన నీళ్లు నిలివున్నాయి… మరి దీన్లో స్నానాలు చేసి బావుకునేదేముందో…
ఒక ప్రాంత ప్రయోజనాలు దెబ్బతీసి పుష్కరాలకంటూ నీళ్లు దోచుకుపోయేదే పుణ్య కార్యమో మీకే తెలియాలి….
ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడీ పొలతల మంత్రగాళ్ల దోపిడీని మించినది కాదా?
ఇంతకూ నమ్మకం…మూఢనమ్మకానికి తేడా ఎంతంటారు??