Karnamrutham: వేదాలను పరిష్కరించడంతో పాటు పద్దెనిమిది పురాణాలు, భారతం రాశాక…వ్యాసుడిలో ఇంకా ఏదో వెలితి ఉంది. ఆ వెలితి ఏమిటో తనకు తాను కనుక్కోలేకపోయాడు. నారదుడు వ్యాసుడి బాధను అర్థం చేసుకుని…భాగవతం రాయి…నీ వెలితి మాయమై…నీ రచన పూర్ణమై…నీ రాతలకు సిద్ధి దశ వస్తుంది అంటాడు. అప్పుడు వ్యాసుడు భాగవతం రాశాడు. భాగవతంలో వ్యాసుడు కృష్ణుడి గురించి గొప్పగానే చెప్పాడు. కానీ మన పోతన తెలుగు అనువాదంలో ఆ కృష్ణుడు మధుర బృందావన ద్వారకలను వదిలి మన తెలుగు పల్లెల్లోకి వచ్చేశాడు. మన పెరట్లో […]