Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చూస్తూ ఉండండి… జియో ఆయిల్ పాలిటిక్సులో… పాకిస్థాన్ 4 ముక్కలు…

February 17, 2026 by M S R

.

Pardha Saradhi Potluri ….. భారత్ అమెరికా ద్వైపాక్షిక – స్వేచ్చా వాణిజ్య ఒప్పందం తాలూకు పరిణామాలు!
ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలలో రెండు రకాల ఒప్పందాలు కలిసి ఉన్నాయి
1.ద్వైపాక్షిక ఒప్పందాలు – Bilateral అగ్రిమెంట్స్
2.స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు – Free Trade Agreements
*******

గుర్తు తెలియని దేశాలు రష్యా నుండి ఆయిల్ కొంటున్నాయి!
గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి టెర్రరిస్టులని కాల్చి చంపి పారిపోతున్నారు పాకిస్థాన్ లో!
ఒకసారి బ్లూమ్ బెర్గ్ ప్రచురించిన చార్ట్ చూడండి!

Ads

oil

ఆ చార్ట్ లో ఆసియా ఖండానికి రష్యా నుండి ఆయిల్ ఎంత మొత్తంలో రవాణా అవుతున్నదో వివరంగా ఉంది.
గత డిసెంబర్ నెల 26 న భారత్, చైనా దేశాలకి రష్యా నుండి సరఫరా అయిన ఆయిల్ మొత్తం కలిపి 3.68 మిలియన్ బారేల్స్ ఆయిల్ సరఫరా అయినట్లుగా వేసెల్ ట్రాకింగ్ డాటా వల్ల తెలుస్తున్నది. ఇందులో గుర్తు తెలియని దేశాలకి వెళ్తున్న ఆయిల్ 0.36 మిలియన్ బ్యారెల్స్ ఉంది!

అమెరికా ఎప్పుడైతే ఒక్క భారత్ మీదనే కాదు రష్యా నుండి ఆయిల్ కొంటున్న ఏ దేశం మీదనైనా సరే 25% టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించడంతో యూరోపు కూడా కొంటున్న ఆ కాస్త ఇందనం కూడా కొనడం మానేసింది!
కానీ యూరోపులో ఇందనం లేక ఏ ఒక్క వాహనం కూడా నడవడం ఆగలేదు!
అమెరికాకి ఆయిల్ ధరలు పెరగడం ఇష్టం లేదు!
అంతా లోపాయకారి ఒప్పందాలు మాత్రమే! రష్యా నుండి ఆయిల్ కొనవద్దు అని శాసిస్తే భారత్ ఒప్పుకోదు! చైనా కూడా డిటో!
అమెరికా టారిఫ్ బెదిరింపులు కాగితాలకే పరిమితం!

ఆయిల్ ధరలు పెరిగితే బిట్ కాయిన్, బంగారం, వెండి, రాగి, అల్యూమినియం మీద పెట్టుబడులు ఆగిపోతాయి!
అమెరికా అప్పులు తీర్చాలంటే కృత్రిమంగా బంగారం, వెండి, రాగి, బిట్ కాయిన్ ధరలు పెరిగేట్టుగా చేసి ఒక్కసారిగా మార్కెట్ కుప్పకూల్చి, వాటి లాభాలని తన ఖాతాలోకి వేసుకుంటున్నది!
ఇప్పటికే బిట్ కాయిన్ ధరని, బంగారం, వెండి ధరలని కూల్చడం ద్వారా కనీసం 3 ట్రిలియన్ డాలర్లని తన ఖాతాలో వేసుకున్నది అమెరికా! నష్టపోయింది అమెరికాతో పాటు ఇతర ప్రపంచదేశాల పెట్టుబడిదారులు!

ఇది ఇక్కడితో ఆగదు! మళ్ళీ బిట్ కాయిన్, బంగారం, వెండి, రాగి, అల్యూమినియం ధరలు పెరిగేట్లుగా చేసి వచ్చే ఆరునెలల దాకా ఆగి సెప్టెంబర్ లేదా డిసెంబర్ నెలలలో మళ్ళీ ధరలు కూల్చి లాభాలని జేబులో వేసుకుంటుంది!

అంచేత… క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అమెరికాకే ఉంది!
రష్యా నుండి ఆయిల్ సరఫరా ఆగిపోతే గల్ఫ్ దేశాలు ధరలు పెంచుతాయి! అమెరికాకి అది నష్టాన్ని కలిగిస్తుంది.

అమెరికన్ లైట్ ఆయిల్, వెనిజులా హెవీ ఆయిల్ ని భారత్ కి సరఫరా చేసి, భారత్ లో శుద్ధి చేసి దానిని యూరోపుకి అమ్మడం ద్వారా ఇటు భారత్ తో పాటు అటు అమెరికా కూడా లాభపడవచ్చు!
బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన చార్ట్ లో జనవరి 26, 2026 న రష్యా నుండి ఆసియా ఖండానికి సరఫరా అయిన ఆయిల్ మొత్తం 2.98 మిలియన్ బారేల్స్ ఉండగా అందులో ఆసియాలో గుర్తు తెలియని దేశాలకి వెళ్లిన ఆయిల్ మొత్తం 1.81 మిలియన్ బారెల్స్ ఉంది!

ఆసియా ఖండంలో కొత్తగా గుర్తు తెలియని భూభాగం హఠాత్తుగా ఎక్కడ నుండి పుట్టుకోచ్చి 1.81 మిలియన్ బారేల్స్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నది?

ఆయిల్
షాడో ఫ్లీట్?
Yes! ఆయిల్ టాంకర్లు రష్యాలో కాకుండా వేరే దేశాలలో రిజిస్టర్ అయి, చైనా ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఇన్సూరెన్స్ చేసుకొని యదేచ్చగా తిరుగుతున్నాయి అమెరికా కంపెనీల ట్రాకింగ్ నుండి తప్పించుకొని! కరెన్సీ కూడా డాలర్లు కాదు!

  • ట్రంప్ కి ఈ విషయం తెలియక కాదు!
    వెనిజులాలో దొరికే హెవీ క్రూడ్ భారీ మొత్తంలో శుద్ధి చేయగల సత్తా ఒక్క భారత్ కి మాత్రమే ఉంది!
    వెనిజులా నుండి, అమెరికా నుండి భారత్ ఆయిల్ కొని దానిని శుద్ధి చేసి యూరోపుకి అమ్ముకోవచ్చు, బదులుగా షాడో ఫ్లీట్ ద్వారా రష్యా నుండి ఆయిల్ కూడా కొనుక్కోవచ్చు భారత్! ఇది రహస్య ఒప్పందం!

కాగితాలు, అగ్రిమెంట్లు ఉండవు! కేవలం ప్రెస్ ప్రకటనలు మాత్రమే బయటికి కనపడతాయి!
గత నెలలో వెనిజులా సముద్రతీరంలో ఒక రష్యన్, ఒక చైనీస్ ఆయిల్ ట్యాంకర్స్ మీద అమెరికన్ నావీ దాడి చేసి సోదాలు చేయగా అవి ఖాళీ గా ఉన్నట్లు గుర్తించారు. కానీ అంతర్జాతీయ మీడియా దానికి విపరీతమైన కవరేజ్ ఇచ్చి అమెరికన్ నావీ కమాండోలు రష్యన్ టాంకర్ మీద హెలికాఫ్టర్ మీద నుండి దిగుతున్న వీడియోని ప్రసారం చేశాయి. అంతా డ్రామా! పాకిస్థాన్ భారత్ కంటే శక్తివంతమైనది అని కాంగ్రెస్ పాలనలో పెద్ద ఎలివేషన్ ఇచ్చింది. భారత్ పాకిస్థాన్ ని ఏమీ చేయలేదు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణు బాంబులు ఉన్నాయి కనుక!

ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు లేవా?
ఆపరేషన్ సిందూర్ జరిగిన తరువాత ఫెయిల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కి శ్వేత సౌధంలో మూడు రోజుల ఆతిధ్యం ఇస్తే, ఇకనేముంది పాకిస్తాన్ విపరీతంగా బలపడింది అని వ్యాఖ్యానించాయి పత్రికలు!
2025 అక్టోబర్ లో ఆసిమ్ మునీర్ గుజరాత్ లోని అతి పెద్ద రిలయన్స్ రిఫైనరి తన మొదటి టార్గెట్ అని ప్రకటించాడు!
కానీ జామ్ నగర్ లోని రిలయన్స్ రిఫైనరీ కి వెనిజులా నుండి నేరుగా క్రూడ్ ఆయిల్ కొనడానికి అనుమతి ఇచ్చాడు ట్రంప్.

గత వారం రోజుల క్రితం భారత అమెరికాల మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా విడుదల చేసిన ప్రకటనలో భారత దేశ మ్యాపుని జమ్మూ కాశ్మీర్, ఆక్సాయిచిన్ లని భారత్ లో భాగంగా ఉన్నట్లుగా చూపించిన సంగతి తెలిసిందే!

అయితే భారత దేశ మాప్ మీద పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులు అమెరికన్ అధికారులని కలిసి మాప్ లో కాశ్మీర్, ఆక్సయ్ చిన్ ప్రాంతాలు వివాదంలో ఉన్నాయని, కాబట్టి వాటిని తొలగించి జమ్మూని మాత్రమే భారత్ లో భాగంగా చూపాలని కోరితే అమెరికన్ అధికారులు ఆ మాప్ భారత అధికారులు ఇచ్చింది కాదు అమెరికా ఇచ్చిందే కాబట్టి మార్చడం కుదరదు అని తేల్చి చెప్పేశారు!

ఈ అంశం మీదనే పాకిస్తాన్ రక్షణ మంత్రి నేషనల్ అసెంబ్లీలో అమెరికా మనల్ని టాయిలెట్ పేపర్ గా వాడుకొని పారేసింది అని బాధపడ్డాడు!
వాస్తవానికి అమెరికన్ థింక్ టాంక్ అజెండా లో 2029 నాటికి పాకిస్తాన్ ని మూడు ముక్కలుగా విడగొట్టాలానే ప్లాన్ ఉంది.
2019 లోనే ఈ విషయం బయటికి వచ్చింది!

అమెరికాకి భారత్, రష్యాలతో ఇబ్బంది లేదు! చైనాతో ప్రమాదం ఉందని భావిస్తున్నది! ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ బలూచిస్తాన్ లో పుష్కలంగా ఉన్నాయి!

కాస్త వెనక్కి వెళితే….
1.పాకిస్తాన్ అధికారులు బలోచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న పశ్ని ( Pasni) అనే ప్రాంతంలో అరేబియా సముద్ర తీరంలో ఒక కమర్షియల్ పోర్ట్ కట్టడానికి అమెరికాకి ఆఫర్ ఇచ్చారు.
2. పశ్ని అనేది చైనా కట్టిన గ్వాదర్ పోర్ట్ కి దగ్గరగా సమాంతరంగా ఉంటుంది అరేబియా సముద్ర తీరంలో!
3. పాకిస్తాన్ ఇచ్చిన ఆఫర్ బాగానే తోచింది అమెరికన్ థింక్ టాంక్ కి!

4.పాకిస్థాన్ బలూచిస్తాన్ లో ఉన్న పశ్నిని మనకి ఇచ్చే బదులు మనం బాలూచిస్తాన్ ని విడగొట్టి ఒక దేశంగా మార్చి ఒప్పందం చేసుకుంటే మేలని పశ్ని పోర్టు ఆఫర్ ని పెండింగ్ లో ఉంచింది అమెరికా! చైనా బలూచ్ తిరుగుబాటు దారుల వల్ల గ్వదర్ పోర్ట్ ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక పోతున్నది! అదే బాలూచిస్తాన్ ని కనుక ఒక దేశంగా గుర్తిస్తే అమెరికాకి ఇబ్బందులు ఉండవు. బాలూచిస్తాన్ ని ఒక దేశంగా గుర్తిస్తే కొత్తగా ప్రశ్ని పోర్టుని కట్టాల్సిన అవసరం ఉండదు, గ్వాదర్ పోర్ట్ ని చైనా నుండి స్వాదీనం చేసుకొని వాడుకుంటుంది.

5.ప్రస్తుతం బలూచ్ రివల్యూషన్ దళాలు బాలూచ్ రాజధాని క్వేట్టా మీద ఆధిపత్యం సాధించాయి! బలూచ్ తిరుగుబాటు దళాలకి సహకరిస్తూ మోడరన్ వెపన్స్ ని అందిస్తున్నది CIA…!
6.బాలూచిస్తాన్ లో దొరికే సహజవాయువుని భారత్ కి సప్లై చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి కావాల్సింది అమెరికన్ టెక్నాలజి. అమెరికా ఇస్తుంది, బదులుగా రేర్ ఎర్త్ మినరల్స్ ని తవ్వి తీసి వాటిని ప్రాసెసింగ్ చేసి ఇచ్చే బాధ్యత భారత్ దే!

7. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మినరల్స్ ని ప్రాసెస్ చేసే దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది! కావాల్సినంత మానవవనరులు మన దేశంలో ఉన్నాయి.
8. బాలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్వా, పంజాబ్, సింధ్ ప్రాంతాలని విడగొట్టి బాలూచిస్తాన్ ఒక దేశంగా చేసి, ఖైబర్ ఫక్తున్వాని ఆఫ్ఘనిస్తాన్ లో కలిపేసి, సింధ్ ని భారత్ లో కలిపేస్తారు.

ఇవన్నీ 2029 లోగా ఒక్కోటి జరుగుతాయి! పాకిస్తాన్ అనేది పంజాబ్ గా మిగిలిపోతుంది!
పంజాబ్ అంటే సింధ్, బాలూచ్ ప్రజలకి పడదు అనేది సత్యం!
రాబోయే 5 ఏళ్లలో ఇవన్నీ జరగబోతుంటే రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడం తగ్గిస్తే వచ్చే లాభాలు. వీటిని ఒదులుకోవడం అవివేకం!

రిలయన్స్ తన జామ్ నగర్ రిఫైనరి ని విస్తరించడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తున్నది! నో డౌట్! రిఫైనరికి కావాల్సిన మెషినరి అమెరికా, యూరోపు నుండి కొనాల్సిందే!
So! ఆక్సాయి చిన్ కోసం చైనా దిగిరాక తప్పదు!

బాలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడితే ఆ దేశానికి కావాల్సినది గ్వాదర్ పోర్ట్! దాని కోసం చైనా దిగి రావాల్సిందే లేకపోతే అనుమతులు రద్దు చేసి అమెరికాకి అప్పచెప్తుంది.
సింధ్ భారత్ లో కలిస్తే పంజాబ్ లాండ్ లాక్డ్ దేశం అవుతుంది!
ఇవన్నీ జరగబోతున్నాయి! జరుగుతాయి కూడా!

ఒప్పందాలు రహస్యంగా జరుగుతాయి! ఒకందుకు ఇది కూడా మంచిదే!
ఇరాన్ లోని చాబహార్ పోర్టు మనతో ఉన్నా లేకపోయినా ఒకటే PoK మన అధీనంలోకి వచ్చాక! నేరుగా ఆఫ్ఘనిస్తాన్ నుండి మధ్య ఆసియాకి భారత్ భూమార్గం ద్వారానే ఎగుమతులు చేయగలుగుతుంది.

అఫ్కోర్స్! ఇరాన్ లో ఆయుతోల్లా అలీ ఖోమేని ఎన్నిరోజులు అధికారం నిలబెట్టుకోగలుగుతాడో తెలియదు. ఖోమేని దిగిపోయి పహ్లావి అధికారం చేపడితే చాబహార్ పోర్టుని యధాతధంగా వాడుకోవచ్చు!
ఆర్టికల్ 370 రద్దు అసాధ్యం అన్నారు కదా?
పాకిస్తాన్ నాలుగు ముక్కలు కావడం అసాధ్యం అని కూడా అనేసేయండి, ఒక పనైపోతుంది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోచమ్మ దయ..! పొడుగోడు కేటీయార్ కోరిక తీర్చిన పొట్టోడు రేవంత్..!!
  • చూస్తూ ఉండండి… జియో ఆయిల్ పాలిటిక్సులో… పాకిస్థాన్ 4 ముక్కలు…
  • ఈ చంద్రబాబు దోస్త్‌కు మన తెలంగాణ ఆడపిల్లలు జస్ట్ గినియా పిగ్స్..!!
  • ఓ బందిపోటు కథ కాదు… దేహమంతా లైంగిక దాడి గాయాల బాధితురాలి కథ …
  • ఇప్పుడంటే ఎర్రతనం క్షీణదశ కానీ… అప్పట్లో ఎర్రెర్ర సినిమాలు ఎక్కువే…
  • అత్తరు కాదు అది… ఆడదాని నెత్తురు, కొవ్వు… ఓ సైకో ఫాంటసీ…
  • ఇండియా ఎలా గెలిచింది..? పాకిస్థాన్ ఎందుకు మట్టికరిచింది..?
  • ఆపరేషన్ సిందూర్ కంటిన్యూస్… ఇషాన్ కిషన్ బాంబింగ్‌తో పాకిస్థాన్ బెంబేలు…
  • నిజంగానే ఆ నరవాణేపై చర్య తీసుకునే దమ్ముందా ప్రభుత్వానికి..?
  • థర్మోబారిక్..! ఈ ఆయుధ ప్రయోగంతో మనుషులు ఆవిరైపోతారా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions