Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హైడ్రా రంగనాథ్ చదవాల్సిన ఓ పాత రేడియో నాటిక… కూల్చివేతలే కాదు..!!

August 27, 2024 by M S R

తమ చెరువులను ఆక్రమించారని అనేక ఆరోపణలు వస్తున్న క్రమంలో ఓ ముప్ఫై ఏండ్ల కింద రేడియోలో వచ్చిన నాటిక యాదికి వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి రేడియో శ్రోతను… అది అలా వుంచితే .. ఆ నాటిక సారాంశం ఏమంటే…

ఒక వూళ్ళో ఒక రైతు బావి తవ్వడం కోసం బ్యాంకు లోను కావాలని వెళ్ళాడు. ఇప్పుడున్న చాలామంది అధికారుల మాదిరిగా నాకేంటి అని పేచీ పెట్టారు.. ఇప్పటిలా సోషల్ మీడియా సహా మరేవీ లేవు కదా అప్పట్లో.. రుణమొత్తం ప్రాతిపదికన ఎంతో కొంత లంచం ముట్టచెప్పాడు. బావి తవ్వకం, సిమెంట్ రింగులు (మన దగ్గర ఓడలు, ఒరలు అంటారు) పోయడం, విద్యుత్ మోటర్ కొనుగోలు తదితరాల ఏర్పాటుకు విడతలవారీగా రుణ వాయిదాలు రైతుకు చెల్లించారు…

ఎలాగూ లంచాలు ఇచ్చాడు, బావి తవ్వుకుంటున్నాడు అనుకుని బ్యాంక్ అధికారులు ఇక ఏనాడూ రైతు తవ్వే బావి వైపు వెళ్లకుండా టీయ్యేలు క్లెయిమ్ చేసారు… బావిలో నీళ్ళు పడ్డాయని, మోటర్ నడుస్తుందని, పంట చేతికి వస్తుందని చెబుతూ రైతు ఒకటి రెండు వాయిదాలు కట్టాడు.

Ads

ఒకనాడు ఆ రైతు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన బావిని దొంగలు ఎత్తుకెళ్ళారని ఫిర్యాదు చేశాడు. దొంగలు బావిని ఎత్తుకొని పోవడం ఏంటని మొదట తేలిగ్గా తీసేసినా, రైతు ఒత్తిడి తగ్గకపోవంతో ఇక తప్పనిసరై ఆ ఎస్సై రైతు పొలం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఏమీ లేదు. సారూ, ఈ సర్వే నెంబర్, ఈ మడిలోనే బావి తవ్వించాను, మోటర్ కూడా పెట్టానని రైతు చెప్పాడు.

nagarjuna

విస్తుపోవడం ఎస్సై వంతు అయ్యింది… లాఠీ ఎత్తేసరికి… అయ్యా, నా మాట అబద్దమైతే మా బ్యాంకు మేనేజర్ ను అడగండి అన్నాడు… వెనక్కి తగ్గిన ఆ ఎస్సై ఆ రైతుని తీసుకొని బ్యాంక్ కు వెళ్ళాడు. బ్యాంక్ మేనేజర్ కూడా ఈ రైతు లోన్ తీసుకున్నాడని, బావి తవ్వాడని, దశల వారీగా రుణం ఇచ్చానని, రైతు రెండు రుణవాయిదాలు కూడా కట్టాడని బయానా (సాక్ష్యం) చెప్పాడు … మొదటి పంట వడ్లు మాకు ఉచితంగా ఇచ్చాడని కూడా చెప్పాడు.

well

బ్యాంక్ లోన్ కాగితాలు కూడా ఆధారాలుగా చూపాడు. తలతిరిగిన ఎస్సై రైతుని పక్కకు పిలిచి, అసలు బావి ఏంటి, లోన్ ఏంటి, దొంగలు దోచుకోవడం ఏంటని గట్టిగా అడిగేసరికి సదరు రైతు సవివరంగా ఆ బ్యాంకు వారి లంచాల కథ చెప్పాడు. అప్పుడు ఎస్సై నేరుగా బ్యాంక్ సిబ్బందిని పిలిపించి, లంచం పీకల మీదకు వచ్చిందని, కేస్ పెట్టాల్సిందే అని చెప్పాడు.

hydra

బ్యాంకు సిబ్బంది ఠారుమన్నారు… రైతుని ప్రాధేయపడ్డారు ఆ కేసు వాపస్ తీసుకోవాలని… అబ్బే, నాకేం తెల్వదు సర్.. నా బావి నాకు కావాలి. బావి తవ్వడానికి ఆరు కంతులు (తడవలు, విడతలు) పైసలు ఇచ్చిండ్రు కదా.. మీరే స్వయంగా వచ్చి చూశారు కదా,. ఆ బాకీ తీరక ముందే దొంగలు పడ్డారు అని ఠలాయించాడు… సీన్ అర్థమైంది బ్యాంక్ అధికారులకు…

విషయం పై అధికారులకు తెలిస్తే తమ ఉద్యోగాలు పోవడం సహా జైలుపాలు అవుతామని భయపడి,. తిన్న లంచాలకు పది రెట్లు ఖర్చు భరించి, కొత్త బావి తవ్వించి, మోటార్ బిగించి, రైతుకు దండం పెట్టుకొని ఇంకోసారి లంచాల జోలికి వెళ్ళలేదు… అలాగే ఇలా లంచాలకు మరిగిన అధికారులను గుర్తించి, చెవులు పిండితే తప్ప ఆ మాయమైన చెరువులు మళ్లీ కనిపించవు కదా…. (వుప్పల రమేశ్ శర్మ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions