Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

#అసలు_వాస్తవం_ఏంటో_తెలుసుకుందాం… పోస్టులో అన్నీ అవాస్తవాలే…

November 19, 2021 by M S R

మొన్నటి నుంచి తెలుగు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది ఒక పోస్టు… ఎవరు రాశారో తెలియదు కానీ పైపైన చదివితేనే, అది రాసిన రచయితకు వరి గురించి ఏమీ తెలియదని మాత్రం మనకు తెలుస్తుంది… బహుశా వాట్సప్ యూనివర్శిటీలో కొత్త అడ్మిషన్ కావచ్చు… ఐనా ప్రభుత్వాలే అడ్డగోలు అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు, ప్రజల కళ్లకు గంతలు కట్టే ఆందోళనలకు దిగుతుంటే ఆఫ్టరాల్ సోషల్ యాక్టివిస్టుల తప్పేముంది..? కాస్త సబ్జెక్టు తెలిసిన నిపుణులు, అధికారుల నుంచి జ్ఞానబోధ పొంది, సరైన రీతిలో సమస్యను వివరించాల్సిన మెయిన్ స్ట్రీమ్ మీడియాకే అసలు సమస్య ఏమిటో తెలియదు… చాలామంది జర్నలిస్టులకే ధాన్యం, బియ్యం నడుమ తేడా తెలియదు, ఇక వాళ్లకు రా రైస్, బాయిల్డ్ రైస్ నడుమ తేడా ఏం తెలుస్తుంది..? సరే, ఒకసారి ఆ పోస్టు చదవండి…

paddy

#అసలు_వాస్తవం_ఏంటో_తెలుసుకుందాం…

Ads

👉మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి, కేంద్రానికి ఇవ్వాలి, అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది, అప్పుడు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చెయ్యలి. ఇది జరగాల్సిన ప్రక్రియ, జరుగుతున్న ప్రక్రియ.
అయితే
👉వడ్ల నుండి డైరెక్ట్ బియ్యం తీస్తే వాటిని Raw Rice అంటారు. (పంట చేతికి రాగానే మనం ఇంటి దగ్గర గిండ్రి లో పట్టించుకున్నట్లు) ఇందులో నూకల శాతం ఎక్కువ మరియు మెత్తగా అవుతుంది అన్నం
👉వడ్లను మిషన్ లో త్వరగా ఆరబెట్టి బియ్యం చేస్తే Streaming Rice అంటారు ( బియ్యం దుకాణాలలో Packing చేసి అమ్మే బియ్యం మనం ఫంక్షన్స్ లో వాడే బియ్యం) ఈ బియ్యం లో నూకల శాతం తక్కువ బియ్యం చాలా బాగా ఉంటాయి
👉వడ్లను ఉడకబెట్టి బియ్యం చేస్తే వాటిని Boil Rice అంటారు (ఇవ్వి పూర్వం తినే వారు గోధుమ రంగు లోకి మారీ గట్టిగా తయారవుతాయి) ఇందులో నూకల శాతం అనేది ఉండదు
👉రైతులు తినేది Raw Rice
👉ఫంక్షన్ లలో , దేశ విదేశాలకు Export చేసేది Streaming Rice
👉So ఇప్పుడు Boil Rice విషయానికి వస్తె పూర్వం చాలా తినేవారు ఇప్పుడు చాలా తక్కువ అయింది. విదేశాలలో కూడా డిమాండ్ లేదు మనదేశం లో కూడా చాలా అంటే చాలా తక్కువ గా తింటున్నారు.
ఇప్పుడు కేంద్రం ఏమన్నదీ అంటే BOIL RICE కాకుండా STREEMING RICE పంపించండి అని రాష్ట్రానికి రాసిన లెటర్ లో నీ శారంశం.
ఇక్కడ ఉంది అసలు తిరకాసు
కేంద్రం రైతుల గురించి కానీ వారు పండించే పంట గురించి కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు
రైతుల నుండి వడ్లు సేకరించి బియ్యం పట్టి మాకు పంపండి. కానీ దేశీయ అంతర్జాతీయ మార్కెట్ లో BOIL RICE కీ Demand లేదు కాబట్టి BOIL RICE వద్దు అన్నది
ఇది అసలు పాయింట్
BOIL RICE లో తరుగు నూకల శాతం ఉండదు కావున STREEMING RICE కంటే ఎక్కువ మొత్తం వడ్ల నుండి డెలివరీ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి రైస్ మిల్లర్లకు అదనంగా లాభం వస్తుంది.
ఉన్నట్టుండి కేంద్రం BOIL RICE వద్దు అనేసరికి ఇటు ప్రభుత్వానికి మరియు మిల్లర్లకు ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోక, వారి సమస్యను రైతులకు అంటగట్టి, కేంద్రం వడ్లు కొనను అంటుంది అని నిందలు వేసి, కేంద్ర ప్రభుత్వంను బద్నాం చేస్తుంది
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు STREEMING RICE పంపిస్తే ఎవరికి ఎం ప్రోబ్లం ఉండదు. కానీ వీళ్లకు లాభం ఉండదు కదా అందుకని BOIL RICE కొనమని కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నారు
BOIL RICE నిల్వలు ఇప్పటికే కేంద్రం దగ్గర చాలా ఉన్నాయ్ ప్రజలు BOIL RICE కంటే STREEMING RICE కే అలవాటు పడ్డారు. కాబట్టి ఇక మీద BOIL RICE వద్దు అనేది కేంద్రం వాదన.
👉పంజాబ్ లోనీ రైతులు వానాకాలం వడ్లు పండిస్తారు. 👉ఎండాకాలం గోధుమ పంట వేస్తారు
అందుకే వానాకాలం ఎంత పండినా 100% పంట సేకరించి స్ట్రీమింగ్ రైస్ చేసి కేంద్రానికి పంపిస్తారు
మన రాష్ట్రంలో యసంగిలో వరి వేస్తం కాబట్టి BOIL వద్దంటోంది కేంద్రం కాబట్టి STREEMING RICE చేస్తే నూకల శాతం ఎక్కువ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం మరియు మిల్లర్లకు తక్కువ లాభాలు వస్తాయి దెబ్బ పడుతుంది. కాబట్టి వారి స్వంత సమస్యను రైతులపై రుద్దాలని చూస్తున్నారు.

👉యశంగి పంట మార్పిడి చేపట్టాలంటే రైతుకు అవగాహన కల్పించాలి. మద్దతు ధర ముందే ప్రకటించాలి. తగిన విత్తన సబ్సిడీ ఇవ్వాలి. భూ పరీక్షలు నిర్వహించాలి. వాణిజ్య పంటలను పరిచయం చెయ్యాలి. అప్పుడే రైతులు పంట మార్పిడి చేస్తారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాల్సి ఉంటుంది. ఇదే మాట కేంద్రం కూడా చెప్పుకొచ్చింది….



……. ఇదీ పోస్టు… టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధాల జోలికి మనం ఇక్కడ వెళ్లడం లేదు గానీ.., తెలంగాణ బీజేపీ పరివార్‌కు ఈరోజుకూ ఏ సమస్య మీదనైనా సరే, సరైన కౌంటర్లు ఇచ్చే జ్ఙానస్థాయి లేదు… ఈ పోస్టు విషయానికే వద్దాం…

  • వడ్ల నుంచి డైరెక్ట్ బియ్యం తీస్తే రా రైస్ అంటారనేది నిజమే… దాన్నే ఎఫ్సీఐ భాషలో పచ్చి బియ్యం అంటారు… మరాడిస్తే నూకలు ఎక్కువ వస్తాయనేదీ నిజమే, కానీ వండితే మెత్తగా అవుతుందనేది అజ్ఞానం… అది వండే తీరు మీద ఆధారపడి ఉంటుంది…
  • వడ్లను మిషన్‌లో త్వరగా ఆరబెట్టి బయటికి తీస్తే స్ట్రీమింగ్ రైస్ వస్తుందనేది మరో అజ్ఞాన గుళిక… స్ట్రీమింగ్ రైస్, బఫరింగ్ రైస్ ఏమీ ఉండవు… మిల్లర్లు కొందరు కొత్త బియ్యాన్ని పాత బియ్యంగా భ్రమింపచేయడానికి కాస్త స్టీమ్ పట్టించి, తరువాత మిల్లింగ్ చేస్తారు, అదొక మార్కెటింగ్ టెక్నిక్… ఈ బియ్యం బయట మార్కెట్‌లో అమ్మడానికే, ఎవరూ ఎఫ్సీఐకి ఇవ్వరు… రేటు ఎక్కువ…
  • (ఈరోజు ఓ పేపర్ మరీ ఘోరంగా ఎఫ్సీఐ సన్నబియ్యం మాత్రమే కొంటానంటోంది అని గీకిపారేసింది… రిపోర్టర్ నుంచి ఎడిటర్ దాకా ఎవరికీ ఏమీ తెలియదు అని అర్థం… ఎఫ్సీఐకి రేటెక్కువ సన్నబియ్యం ఎవరైనా లెవీ ఇస్తారా..? అసలు సన్నబియ్యం ధరెంతో.., దొడ్డుబియ్యానికీ సన్నబియ్యానికీ నడుమ తేడాలు తెలుసా వీళ్లకు..? మీరేం జర్నలిస్టులురా నాయనా..?)
  • వడ్లను కాస్త ఉడికించి, మరాడిస్తే వచ్చేది బాయిల్డ్ రైస్… ఉప్పుడు బియ్యం… దీనివల్ల నూకలు తక్కువ… అయితే గతంలో బాయిల్డ్ రైస్ తినే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ధాన్యం విస్తృతంగా పండుతోంది… పైగా బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదు, అది త్వరగా జీర్ణం కాదు… అందరూ తినలేరు… తూర్పుదేశాల్లో ధాన్యం దిగుబడి, ఎగుమతి స్థాయి విపరీతంగా పెరిగింది, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు, ధర లేదు…
  • అందుకని ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్ వద్దు బాబూ, కొనలేం, కొన్నా నిల్వ చేయలేం, పారబోయలేం అని నిష్కర్షగా చెబుతోంది… అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయి… పంజాబ్ మిల్లర్ల నుంచి కూడా ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది… కానీ దాన్ని సరిగ్గా ఎక్స్‌పోజ్ చేయలేక, నిజాలు చెప్పడం చేతగాక, ఈ ‘‘స్ట్రీమింగ్ రైస్’’ ప్రచారాలు దేనికి బ్రదర్..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions