.
ఆహా ఓటీటీలో వచ్చిన తెలుగు ఇండియన్ ఐడల్… కంటెస్టెంట్లలో కాస్త బక్కపల్చగా ఉన్న ఓ అమ్మాయి మీద అందరి దృష్టీ ఫోకస్ అయ్యింది… పేరు వాగ్దేవి… ఊరు నెల్లూరు… ఆ సీజన్ విజేత కూడా…
తను ‘ అలై పొంగెరా ’ పాడుతుంటే అంతటి థమన్ కూడా నోటమాట లేకుండా అలా వింటూ ఉండిపోయాడు… మంచి గొంతు… ప్లజెంట్ లుక్కు… ప్రత్యేకించి ఏ పాటకైనా భావప్రకటన ముఖ్యం… ఏదో నోటికొచ్చిన సంగతులు, శృతులు, నోట్స్ సరిచూసుకుని పాడితే అందులో లైఫ్ ఉండదు… వాగ్దేవి ఎమోషన్ పలికించగలదు…
Ads
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… ఉంది, ఓ కీలక విషయం ఉంది… ఇప్పుడు బహుశా 18 ఏళ్ల వయస్సు ఉండొచ్చు… కానీ ఒకసారి ఎనిమిదేళ్ల క్రితం రోజుల్లోకి వెళ్దాం… పాడుతా తీయగా పాత ప్రోగ్రాం చూస్తుంటే ఇదే వాగ్దేవి కనిపించింది… బాలు హోస్ట్ కమ్ జడ్జి… గోరటి వెంకన్న సహ- జడ్జి…
జూన్ నుంచి సెప్టెంబరు 2014… ఈ వాగ్దేవి అప్పటికి చిన్న పిల్ల… (అసలు తెలుగులో ఫేమస్ సింగర్స్ అందరూ దాదాపుగా ఆ పాడుతా తీయగా షోలో పాడి పైకొచ్చినవాళ్లే కదా… ఇండియన్ ఐడల్ షోలో ఉన్న సింగర్స్ అదితి భావరాజు, వైష్ణవి, మాన్య చంద్రన్ కూడా పాడుతా తీయగా షోలో ఒకప్పుడు కంటెస్టెంట్స్…)
తను పెద్దగా భేషజాల మధ్య తన చెప్పాల్సిన మాటల్ని దాచుకోడు… ఈ వాగ్దేవి ఖడ్గం సినిమాలో… నువ్వు, నువ్వు అనే పాట ఎంచుకుంది… నో డౌట్… బాగా పాడింది… ఆ పాటలో నిజానికి పైపైన అల్లాటప్పా పదాల్లాగా ఉంటాయి… కానీ లోతుల్లోకి వెళ్తే ఓ శృంగార తాదాత్మ్యత…
వెంకన్న తన అభిప్రాయం చెబుతూ… ‘‘చాలా పదాలకు లోతైన అర్థాలుంటయ్, ఉన్నయ్… మీ వయస్సుకు, మీ స్థాయికి వాటి వివరణల జోలికి పోకూడదు, పోలేను ఇక్కడ… అందుకే ఆ భావాల లోతుల్లోకి పోకుండా… నీ గాత్రమాధుర్యంతో మెప్పించినావు…’’ అన్నాడు…
తరువాత బాలు మాట్లాడుతూ… ‘‘పిల్లలకు ఇచ్చే పాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి… సీతారామశాస్త్రి తన స్థాయిని దిగజార్చుకుని జుగుప్స పదాలు ఎప్పుడూ వాడడు… కానీ ఆ సినిమాలో ఆ పాత్ర వేరు… వీళ్ల వయస్సుకు ఆ పాట పదాల మోతాదు ఎక్కువ అవుతుందని చరణాల్లో చాలా లైన్స్ మార్చేశాం…
వాళ్ల వయస్సుకు అనకూడని మాటలు ఏమైనా ఉంటే పరిహరించాలనేదే ఉద్దేశం.. ఒరిజినల్ సింగర్స్కు ఆ పదాలు వోకే… చాలా పదాల అర్థాలు కూడా లోతైనవే… కానీ పిల్లల నోట అవి వద్దు అనిపించింది…’’ అని వివరించాడు…
అంటే… వెగటు పదాల్ని పిల్లల నోట పలికించకుండా కార్యక్రమాన్ని నడిపించాలనే భావన గొప్పది… ఉదాత్తమైంది… పాట ఏదైనా సరే, అవసరమైతే చరణాల్ని మార్చేసి పాడించారు అని చెప్పడం ఈ కథన ఉద్దేశం… కానీ కొన్ని ప్రోగ్రాముల్లో పిల్లలతో కూడా గ్గుగ్గు గుడిసుంది, మ్మమ్మ మంచముంది పాడించే రోజులివి… డ్రైవర్ రాముడిలా పాయ్ పాయ్ అని కూడా పలికించే దుర్దినాలు…
డెఫినిట్గా అప్పట్లో పాడుతా తీయగా కొన్ని స్టాండర్డ్స్కు కట్టుబడి సాగింది..!! ప్రస్తుతం పాడే పిల్లల కోసం ఆడిషన్స్ జోరుగా సాగుతున్నయ్ తెలుగు రాష్ట్రాల్లో… అందుకే ఈ ప్రస్తావన..!! మరి ప్రస్తుత పాడుతా తీయగా స్టాండర్డ్..? ఏమో, ప్రవస్తిని అడగాలి..!!
Share this Article