.
ఎస్, విమర్శించాల్సిందే రేవంత్ రెడ్డిని… కవిత గానీ, హరీష్ గానీ, కేటీయార్ గానీ, నమస్తే తెలంగాణ గానీ… కేసీయార్ ఎలాగూ బయటికి రావడం లేదు, యాక్టివ్ ప్రజాజీవితంలో లేడు కాబట్టి ఆయన్ని కాస్త పక్కన పెడితే… తప్పకుండా రేవంత్ రెడ్డిని విమర్శించాలి…
ప్రతిదీ రాజకీయం చేయడం కాదు, విమర్శ అవసరమైన చోట్ల… ప్రజలకు ఉపయోగపడాల్సిన చోట్ల.., అనాలి, అనడానికే కదా, తప్పులు ఎత్తిచూపడానికే కదా వాళ్లను ప్రతిపక్ష పాత్ర పోషించాలని జనం తీర్పు చెప్పింది… సో, ఆ బాధ్యత నెరవేర్చాల్సిందే… అందులో తప్పులేదు…
Ads
ఉదాహరణకు… మొన్న జీహెచ్ఎంసీలో మాన్సూన్ టెండర్లు రద్దు చేయాలని కవిత డిమాండ్ చేసింది… నిజంగానే ఏదో మతలబు ఉందనుకుని జీహెచ్ఎంసీ వాటిని రద్దు చేసింది… దిద్దుకుంటుంది… ఒక బనకచర్ల- గోదావరి ప్రాజెక్టు మీద విమర్శలు చేస్తున్నారు… అవసరమే… పొరుగు రాష్ట్రం ఎత్తుగడలపై నిఘా, స్పందన అవసరమే… ఆల్రెడీ తెలంగాణ ప్రఁభుత్వం తన అభ్యంతరాలను సంబంధిత సంస్థల వద్ద ప్రస్తావిస్తోంది… అవసరమైతే కోర్టుల్లోనూ తేల్చుకోవాలని భావిస్తోంది… గుడ్…
కానీ బీఆర్ఎస్ క్యాంపు మొదటి నుంచీ రేవంత్ రెడ్డి మీద ఏదో వ్యక్తిగత, బలమైన పాత పంచాయితీలు ఉన్నట్టుగా… ప్రతిదీ పీకి పీకి పెంట చేయడానికే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది… నిన్న కవిత ఎక్కడో మాట్లాడుతూ అమరవీరులకు దండం పెట్టని ముఖ్యమంత్రి అని విమర్శించింది… జైతెలంగాణ అని పలకలేదని పేర్కొంది… నమస్తే తెలంగాణ అయితే ఫస్ట్ పేజీలో వార్త రాసుకొచ్చింది…
అసలు తన ప్రసంగమంతా తెలంగాణ గురించే కదా… అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, చేసుకోవాల్సిన అభివృద్ధి గురించే కదా స్మరణ అంతా… పైగా తను అమరవీరుల స్థూపం దగ్గర నివాళ్లు అర్పించాడు కదా… ఇదుగో ఫోటో…
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కూడా ధన్యవాదాలు చెప్పాడు… మేధావులు, కవులు, ఆలోచనపరులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, యువకుల, సకలజనులూ చేసిన ఉద్యమఫలితమే ఈ తెలంగాణ అని కూడా గుర్తుచేసుకున్నాడు… తన పథకాలన్నీ చెప్పుకున్నాడు… 9 మంది తెలంగాణ కవులు, కళాకారులకు కోటి రూపాయలు ఇచ్చాడు… ఇదంతా తెలంగాణతనం కాదా..?
తెలంగాణకు ఇప్పుడు కేసీయార్కు బదులుగా మరో తెలంగాణ నాయకుడు కావాలనే బలమైన కోరికతోనే కదా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది, ఎంచుకుంది… హేమిటో… నిజంగా తెలంగాణకు నష్టదాయకమైన ఇష్యూస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడితే ఖచ్చితంగా విమర్శించడమో, లోపాలు ఎత్తిచూపడమో, ప్రతిఘటనకు పూనుకోవడమో మంచిది…
కానీ ఆ స్థూపం దగ్గర దండం పెట్టలేదు, స్మరించలేదు వంటి విమర్శలు దేనికి..? ఇంకా నయం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, జాతిపిత అంటూ కేసీయార్ పేరు ప్రస్తావించలేదు అనే విమర్శలు చేయలేదు… ఐనా, రేవంత్ రెడ్డి సాబ్, ఓసారి గట్టిగా జై తెలంగాణ అనొచ్చు కదా… నేను విమర్శించాకే రేవంత్ రెడ్డి మారాడు అని కవిత క్లెయిమ్ చేసుకుంటుంది… మంచిదే కదా…
అవునూ… జాతిపిత, తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు అవతరణ దినోత్సవం జరుపుకున్నాడా..? ఫోటోలు, వార్తలు కనీసం తన సొంత నమస్తే తెలంగాణ పత్రికలో కూడా కనిపించలేదు ఫాఫం… వారసుడు కేటీయార్ డాలస్ బీఆర్ఎస్ సభ వార్తలు, ఫోటోలతోనే నింపేశారు…
Share this Article