Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డియర్ ఠాక్రే… అసలు కుటుంబ పార్టీల వారసత్వాలే అప్రజాస్వామికమోయ్…

February 19, 2023 by M S R

Subramanyam Dogiparthi  ఏమంటారంటే..? శివసేన సింబల్ని అభినవ కలియుగ విభీషణుడు షిండేకు కేటాయించటం ఉధ్ధవ్ ఠాక్రేకు షాక్ అని పత్రికలు వ్రాస్తున్నాయి. నాకు వెంటనే ఇందిరమ్మ రాజకీయ ప్రస్థానం గుర్తుకొచ్చింది. 1952 ఎన్నికల నుండి 1969 వరకూ కాంగ్రెస్ పార్టీ సింబల్ కాడెద్దులు . బ్యాంకుల జాతీయకరణ వంటి సోషలిస్టు నిర్ణయాలు తీసుకున్న తర్వాత , ఆనాడు కాంగ్రెస్ పార్టీలో సిండికేటుగా పిలవబడిన కామరాజు , మొరార్జీ వంటి హేమాహేమీలు ఇందిరమ్మను బయటకి నెట్టేసారు .

ఆమె స్వంతంగా న్యూ కాంగ్రెస్ అనే పేరుతో , ఆవు దూడ గుర్తుతో జనంలోకి వెళ్ళి గెలిచింది . చివరకు ఆమెదే అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ అయింది . ఓల్డ్ కాంగ్రెస్ కనుమరుగయింది . చరిత్రలో కలిసిపోయింది. మరలా మరోసారి ఎమర్జెన్సీ తర్వాత , 1977 లో ఓడిపోయిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు . మళ్ళా స్వంతంగా కాంగ్రెస్ ( ఐ ) ని హస్తం గుర్తుతో పెట్టుకుని ప్రజల్లేకి వెళ్ళి గెలిచింది .
1978 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా రెడ్డి కాంగ్రెస్ ఓడిపోయి , ఇందిరమ్మ కాంగ్రెసే గెలిచింది . చంద్రబాబు ఇందిరమ్మ కాంగ్రెస్ అభ్యర్ధిగానే గెలిచారు . ఒక విధంగా ఉధ్ధవ్ ఠాక్రే అదృష్టవంతుడు . పట్టుదలతో , కసితో జనంలోకి వెళ్ళి మళ్ళా గెలవొచ్చు . 1984 లో NTR అలాగే ముఖ్యమంత్రి పదవిని తిరిగి పొందారు . ఆయన 1996 లో మరణించకపోతే , జనంలోకి వెళ్ళే వారు . ఇందిరమ్మ లాగా తేల్చుకునే వారు . అయితే దురదృష్టవశాత్తు మరణించడంతో చంద్రబాబుకు ఊరట కలిగింది . ఎవరు నాయకుడు అనేది నిర్ణయించేది అల్టిమేట్ గా జనమే ప్రజాస్వామ్యంలో . ప్రజలే స్వాములు .

 

May be an image of animal and text that says "Congress's symbol Poll symbol of between 1952 and 1969 Indira's Congress (R) during 1971 1971-1977 Election symbol of Congress since 1977"

 

Ads

నిజమే… కానీ ఏకనాథ్ శిండే విభీషణుడు కాదు… లక్ష్మిపార్వతి అనే ఫ్యాక్టర్ నుంచి తెలుగుదేశాన్ని చంద్రబాబు అండ్ కో కాపాడుకున్నట్టే ఏకనాథ్ శిండే కూడా శివసేనను కాపాడాడు అని చెప్పుకోవచ్చు… స్థూలంగా చూస్తే ఇవి వెన్నుపోట్లుగా కనిపిస్తాయి… కానీ మరో కోణం నుంచి చూడాలి… ఈ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఎప్పుడూ కుర్చీ మీద కూర్చోవాలని తాపత్రయపడలేదు… కింగ్ మేకర్‌గా ఉన్నాడు తప్ప కింగ్ కాలేదు…

తన పంథా వేరు… తన పార్టీ బేసిక్ రూట్స్‌ నుంచి పక్కకుపోలేదు… అదే పార్టీ బలం… కానీ తన వారసుడు ఉద్దవ్ ఠాక్రే ఏం చేశాడు..? కేవలం కుర్చీ కోసం, ప్రజలిచ్చిన తీర్పును కాలరాసి, తన పార్టీ బేసిక్ సిద్ధాంతాల్ని కాలరాచి, కాంగ్రెస్‌తో జతకట్టాడు… ఎన్సీపీతో పొత్తుకూడాడు… ఏ రెండు పార్టీలకు వ్యతిరేకంగా తాము పోరాడామో, వాళ్లతోనే కలిసి కుర్చీ పంచుకున్నామనే నెగెటివ్ ఫీలింగ్ శివసేన పార్టీ కేడర్‌లో పెరుగుతోంది…

కేవలం సంజయ్ రౌత్ అనే కోవర్టు చెప్పింది వింటూ కేడర్‌ను దూరం చేసుకున్నాడు ఉద్దవ్ ఠాక్రే… తన అధికార దాహం పార్టీ కేడర్‌కే నచ్చలేదు… శివసేన నాయకులకు ఫీల్డులో పదే పదే ఇదే ప్రశ్న ఎదురవసాగింది… డీమోరల్ అవుతున్నారు కార్యకర్తలు… ఈ స్థితిలో ధైర్యంగా పిల్లి మెడకు గంట కట్టడానికి ఏకనాథ్ శిండే రెడీ అయ్యాడు… తను బాల్ ఠాక్రేకు వీరశిష్యుడు… చాలామందితో మాట్లాడాడు… తరువాత బీజేపీ ఈ పరిణామాలు గమనించి, మద్దతు ఇవ్వడానికి, గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు స్పిరిట్ ప్రకారం వెళ్తామంటే మేం మళ్లీ కలుస్తామని హామీ ఇచ్చింది…

ఠాక్రేకు పాఠం చెప్పడానికి బీజేపికి శిండే రూపంలో చాన్స్ దొరికింది… ఇప్పుడు తనేమంటున్నాడు..? ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుబోయింది, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది అని…! ప్రజాస్వామ్యంలో మెజారిటీయే నిర్ణేత… అందుకే ఎన్నికల సంఘం మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ సంఘాల బాధ్యుల లెక్కలన్నీ పరిశీలించి, కొన్నాళ్లు ఆగీ ఆగీ తన నిర్ణయాన్ని వెలువరించింది… సేమ్, తెలుగుదేశం పార్టీ పగ్గాలు, ఎన్నికల సింబల్ విషయంలో చంద్రబాబు గెలిచింది కూడా మెజారిటీ ప్రాతిపదికనే..

.shinde

అసలు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరిని సూచిస్తే వాళ్లు వారసులు కావాలి… ఇక్కడ జరిగిందీ అదే… అంతేతప్ప కుటుంబ పార్టీ యవ్వారంలా బాల్ ఠాక్రే తరువాత ఉద్దవ్ ఠాక్రే, ఆయన తరువాత మరో ఠాక్రే శివసేన వారసులు కావడమే అప్రజాస్వామికం అనిపించుకుంటుంది… దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ అనబడే జాతీయ పార్టీతోపాటు దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలూ అలాగే ఉన్నాయి… ఇదేమైనా వారసత్వ ఆస్తియా..? కుటుంబవారసులు ఎంజాయ్ చేయడానికి..? ఎవడిని కేడర్ నమ్ముతుందో వాడే వారసుడు… మహారాష్ట్రలో జరిగింది అదే… దీనికి ఉద్దవ్ ఠాక్రే గింజుకోవాల్సిన పనేమీ లేదు… తను మారగలిగితే మళ్లీ జనంలోకి వెళ్లి, కష్టపడాల్సిందే… కాంగ్రెస్, ఎన్సీపీలతో దోస్తీ ఎందుకు చేశావ్ అనే ప్రజల ప్రశ్నకు జవాబు చెప్పుకునే ప్రయత్నం చేయాల్సిందే… !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ చిన్నారులు… ప్రపంచ సుందరిని కలిసిన తరువాత… ఛ, దుర్విధి…
  • ప్రేమతిట్ల సీజన్… మీ దుంపల్‌తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
  • ప్రపంచ సుందరికి అయోధ్య సందర్శన అభిలాష… ఓ నేపథ్యం…
  • అధికారంలో ఉంటేనే అవతరణ దినోత్సవాలా కేసీయార్ సాబ్..?!
  • పోలీసులది క్రౌర్యమే, తప్పే… మరి రౌడీ షీటర్లకు రాజకీయ ఓదార్పు..!?
  • ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
  • అన్ని సినిమాల్లోలాగే… పొలిటిషియన్సే విలన్లు… ఎదిరించేవాడే హీరో…
  • మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!
  • వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…
  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions