Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణ డిష్యూం డిష్యూం సినిమాల వెనుక అసలు కెమెరా హీరో ఈయనే..!

December 25, 2021 by M S R

…… By…… Bharadwaja Rangavajhala………..  పుష్పాల గోపాలక్రిష్ణ

ఈయన పేరు క్రిష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది.

క్రిష్ణ గారి సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం.

Ads

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా క్రుషి చేస్తారు.

ఈ ఏరియాలో పుష్పాల గోపీక్రిష్ణ కాస్త పాపులర్.

విఎస్ఆర్ స్వామి తర్వాత ఈయనే క్రిష్ణ సినిమాలకు కెమేరా కెప్టెను.

ముఖ్యంగా విజయనిర్మల తీసిన చాలా సినిమాలకు గోపీక్రిష్ణే కెమేరా పని చేసేవాడు.

నాకు చాలా కాలంగా ఈయన గురించి తెల్సుకోవాలనే కోరిక బలంగా ఉంది. చాలా మందిని అడిగాను పుష్పాల గోపీ క్రిష్ణ గురించి ఏమైనా చెప్పగలరా అని … ఎవరూ చెప్పలేదు.

ఫైపల్ గా నాకు తెల్సిన విషయం ఏమిటంటే … పుష్పాల గోపీక్రిష్ణ స్వగ్రామం చిత్తూరు,

అలా రాయలసీమ కుర్రాడితను.

చిన్నతనం నుంచీ బొమ్మలు వేయడం అంటే పుష్పాల గోపీ క్రిష్ణకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మద్రాసు చేరి

స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చిత్రలేఖనంలో డిప్లమో చేశారు.

అలాగే మంచి చిత్రకారుడు అని కూడా అనిపించుకున్నారు.

మరలాటప్పుడు కళాదర్శకత్వం విభాగంలోకి వెళ్లిపోవాలి కదా … అలా వెళ్లలేదీయన.

ఆయన చూపు కెమేరామీద పడింది. అదీ మూవీ కెమేరామీద.

అది నేర్చుకుని ఆ ఏరియాలో జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత తిన్నగా ఎల్ వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనందబాబును కల్సారు.

pushpala

తాను బేసిక్ గా ఆర్టిస్టుననీ .. అయితే ఇలా చలనచిత్ర ఛాయాచిత్రకారుడుగా మారాలనుకుంటున్నానని అందుకు అవకాశం ఇప్పించమనీ కోరాడు.

చక్కని ఆర్టిస్టు … చక్కని ఛాయాదర్శకుడు అవుతాడనే భరోసాతో … అక్కినేని ఆనందబాబు ఎమ్ వి రావ్ గార్లు ప్రోత్సాహించి … ప్రసాద్ ప్రొడక్షన్స్ కెమేరా విభాగంలో చేర్చుకున్నారు.

అక్కడ జీవితం మామూలుగా ఉండదు. ఎవరు కెమేరా బుక్ చేసుకున్నా ప్రొడక్షన్ తరపున వీళ్లు హాజరు అవ్వాలి.

అక్కడ కెమేరా దర్శకుడు ఎవరైతే వారి కింద పన్జేయాల్సి వస్తుంది. అలా పన్జేసినప్పుడే పని వస్తుందనే నమ్మకం పుష్కలంగా ఉన్న గోపీక్రిష్ణ శ్రమ అనుకోకుండా పన్లోకి దిగిపోయారు.

అలా చాలా మంది గురువులున్నారు ఆయనకి.

అసలు పుష్పాల గోపాలక్రిష్ణకు సినిమాటోగ్రాఫర్ కావాలనే కోరిక కలగడానికి కారణం సి.నాగేశ్వర్రావుగారు.

ఇలా ప్రసాద్ ప్రొడక్షన్స్ లో ప్రవేశించిన తర్వాత నాగేశ్వర్రావుగారికి ఏకలవ్య శిష్యుడుగా మారిపోయారు. సి.నాగేశ్వర్రావు అంటే మరి ఆ రోజుల్లో స్టార్ డీవోపీ.

ఆ సి.నాగేశ్వర్రావుగారి కుమారుడే … ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలకు కెమేరా పనిచేసే విజయ్ సి కుమార్.

ఆ విషయం కాసేపు పక్కన పెడితే ..

కలర్ ఫొటోగ్రఫీ చేయడం అనే ప్రక్రియ బాలీవుడ్ కెమేరా దర్శకుడు జి.సింగ్ నుంచీ తెల్సుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఆనందబాబుగారికి చెందిన ప్రసాద్ ప్రొడక్షన్స్ ఆఫీసులో కెమేరా విభాగంలో పన్జేస్తున్నప్పుడు నేర్చుకున్న విద్యలే.

తను ప్రధానంగా ఆర్టిస్టు కావడంతో కెమేరా పని నేర్చుకోవడం ప్రభావవంతంగా చిత్రీకరించడం … లైటింగ్ సెట్ చేసుకోవడం సన్నివేశాన్ని అర్ధం చేసుకుని దాన్ని తెర మీద ఎలా వస్తే బావుంటుందో విజువలైజ్ చేసుకుని అందుకు తగ్గ లెన్సులు వాడుతూ … సన్నివేశాన్ని రక్తి కట్టించడం చాలా తేలికగానే అర్ధం చేసుకున్నారు.

ఇలా ప్రసాద్ ప్రొడక్షన్స్ లో పన్జేయడం వల్ల అనేక మంది కెమేరామెన్ల దగ్గర వారి పనితీరు చూసి నేర్చుకునే అవకాశం దొరికింది. ఆ సమయంలో వి.ఎస్.ఆర్ స్వామి దగ్గర ఆపరేటివ్ కెమేరామెన్ గా ఛాన్స్ వచ్చింది. అలా ఐదారు సినిమాలకు పన్జేశారు అంతే … కెమేరామెన్నుగా ప్రమోషన్ వచ్చేసింది. అదెలా జరిగిందంటే … స్వామిగారి దగ్గర చేసిన సినిమాలన్నీ క్రిష్ణగారివి కావడంతో …

అలా వారి కాంపౌండ్ ద్రుష్టిలో పడ్డారు.

pushpala

అదే సమయంలో విజయనిర్మల డైరక్షన్ చేయాలనుకున్నారు. క్రిష్ణ సలహా మేరకు లో బడ్జెట్ లో కవిత అనే సినిమా చేశారు. ఆ సినిమాకు కెమేరా దర్శకుడుగా ఎవర్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు పుష్పాల గోపీ క్రిష్ణ పేరు ముందుకు వచ్చింది. అంతే వెంటనే పిల్చి ఛాన్స్ ఇచ్చేశారు. అలా కవిత సినిమా తెలుగు మళయాళ చిత్రాలకు ఆయనే పన్జేశారు.

మీనాకి కూడా పుష్పాల గోపీక్రిష్ణే కెమేరా బాధ్యత నిర్వహించారు.

అలా పాడిపంటలు ఛాన్స్ వచ్చేసింది. అప్పటి వరకు పద్మాలయాలో విఎస్ఆర్ స్వామిగారే కెమేరా దర్శకుడు. అలాంటిది పుష్పాల గోపీక్రిష్ణకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

దీంతో వరసగా క్రిష్ణ సినిమాలు పుష్పాలకు వచ్చేశాయి.

త్రిమూర్తీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డూండీగారు తీసిన దొంగ సిరీస్ సినిమాలు పుష్పాల గోపీ క్రిష్ణ కెమేరాలోనే నడిచాయి.

మన వూరి కథ , రామరాజ్యంలో రక్తపాతం ఇలా వరసపెట్టి క్రిష్ణ గారి డిష్యుం డిష్యుం సినిమాలన్నింటికీ పుష్పాల గోపీక్రిష్ణే కెమేరా దర్శకుడు.

పాడిపంటలు టైమ్ లో స్వామిగారు భక్తకన్నప్ప ఒప్పుకున్నారు. అయితే గోపీక్రిష్ణ అప్పటికీ స్వామిగారి దగ్గర ఫస్ట్ అసిస్టెంటే … ఆయన వెళ్లాకే … గోపాల్రెడ్డి , ఎం.వి రఘు లాంటి వాళ్లు స్వామిగారి టీమ్ లో చేరి పెద్దోళ్లు అయ్యారు.

అలా చాలా కాలం పాటు క్రిష్ణగారి క్యాంపు ముఖ్యంగా విజయనిర్మల కెమేరామెన్ గా ప్రపంచానికి తెల్సిన పుష్పాల గోపీక్రిష్ణ చనిపోయి దాదాపు పదిహేనేళ్లు అయినా … ఇప్పటికీ యాక్షన్ మూవీ అనగానే ఆయనే గుర్తొస్తాడు.

అలాగే … యాక్షన్ సినిమా అనగానే గుర్తొచ్చే మరో ఇద్దరు కెమేరామెన్లలో ఎస్ఎస్ లాల్ గారి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు దేవరాజ్ …

ఆయన గురించి మరోసారి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions