Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఔనౌను… కేసీయారే మంచోడు… ఇప్పుడు మన రహస్య స్నేహితుడు కదా…

November 6, 2023 by M S R

బీసీ సీఎం అంటున్నాం కదా… అందుకే ఈసారి నేను పోటీచేయడం లేదు… అంటున్నాడు కిషన్ రెడ్డి… నవ్వొచ్చింది… బీసీ సీఎం నినాదానికి తను పోటీచేయడానికి లింక్ ఏమిటి అసలు..? అంటే, తను పోటీచేస్తే, మెజారిటీ వస్తే, అన్నీ అనుకూలిస్తే తను మాత్రమే సీఎం అభ్యర్థి అని పరోక్షంగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడా..?

పైగా తను కేసీయార్ ఫేవర్ కాదని, ఎవరికీ లొంగబోననీ ఏవేవో తన మీద విమర్శలకు వివరణ ఇచ్చుకున్నాడు… కేసీయార్ కోసం కాకపోతే బండి సంజయ్‌ను మార్చి, మళ్లీ ఆ పాత కిషన్‌రెడ్డికే ఎందుకు పగ్గాలు ఇచ్చినట్టు..? బీజేపీ వద్ద ఒక్కటీ సరైన సమాధానం లేదు, స్పష్టీకరణ లేదు… అంటే, కేసీయార్ కోసమే అధ్యక్షుడి మార్పు జరిగింది అనే ఆరోపణలకు బలం అలాగే ఉంటుంది…

నిన్న రెండు ప్రెస్‌మీట్ల సారాంశం చూడండి… ఒకటి ధర్మపురి అర్వింద్, రెండు కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డేమో కాంగ్రెస్ గెలిస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అంటున్నాడు… అంటే కాంగ్రెస్‌కు మాత్రం వేయొద్దు, మాకు వేయకపోయినా సరే, కేసీయార్ వచ్చినా పర్లేదు అని స్పష్టంగానే చెబుతున్నాడు… అదేకదా మరి అందరూ అంటున్నది… బీఆర్ఎస్ అనేది బీజేపీ బీటీం అని…!

Ads

బీజేపీ

రేవంత్ కంటే కేసీయారే మంచోడు అని ధర్మపురి అర్వింద్ అంటున్నాడు… ఆయన ఏదో అల్లాటప్పా ప్రజాప్రతినిధి కాదు, బీజేపీ ఎంపీ… దానికి విలువ ఉంటుంది… మరీ ఎన్నికల వేళ ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉన్న ఓ ప్రత్యర్థి నాయకుడికి మంచోడు అని సర్టిఫికెట్ ఇవ్వడం ఏమిటి..? పైగా కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే సీఎం రేవంతే అవుతాడని ఏ ప్రాతిపదికన చెబుతున్నట్టు..? కాంగ్రెస్‌లో చాలామంది ఉన్నారు… పైగా కేసీయారే మంచోడు అని చెప్పడం అంటే బీఆర్ఎస్ పాజిటివ్ వోటుకు బీజేపీ మద్దతు పలుకుతోందా..?

మాకు వోటు వేయకపోయినా పర్లేదు గానీ కాంగ్రెస్‌కు మాత్రం వేయొద్దు, కేసీయార్ మంచోడే అని చెప్పడం ఒకరకంగా దిగజారిపోవడం… అదీ కీలకమైన పోరాటవేళ… అందులోనూ బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ మీద ఆరోపణలు వస్తున్నవేళ… అవును, బరాబర్ మేం దోస్తులమే అని చెబుతున్నట్టుగా ఉంది ఇదంతా… పైగా అర్వింద్ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ వస్తుందని చెబుతున్నాడు…

ఒక పార్టీ నేతృత్వంలో హంగ్ రావడం ఏమిటి..? అకస్మాత్తుగా ఏమైంది బీజేపీ రాష్ట్ర నేతలకు… ఓ శృతి లేదు, ఓ మతి లేదు… బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ గెలిస్తే ఇక బర్రెలు తినేవాళ్లు పోయి ఏనుగులు తినేవాళ్లు వస్తారు అంటున్నాడు కిషన్ రెడ్డి… అవును, రెండు పార్టీలూ ‘తినేవాళ్లే’ కదా… బర్రెలు అయితేనేం, ఏనుగులు అయితేనేం… ‘శుద్ద శాకాహారివి’… నీ గురించి నువ్వు చెప్పుకోకుండా… వాడికన్నా వీడు డేంజర్ అని వోటర్లకు చెప్పడం వెనుక ఆంతర్యేమిటి..? పోనీ, పదో పదిహేనో పోటీకి దిగి, మిగతా చోెట్ల స్నేహపూర్వక పోటీ అని చెప్పకపోయారా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!
  • విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దుట ! – మంత్రిగా ఉంటే పర్లేదుట !!
  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!
  • హైడ్రా ! తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమా ?!
  • ఇదంతా తెలంగాణ అస్థిత్వ సమస్యా? బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా!?
  • బొద్దింకల పార్టీ ! మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ !!
  • అసలు సమస్య ‘నీట్’ను దాటి… మన వైద్య వ్యవస్థలోనే ‘రోగాలు’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions