.
Subramanyam Dogiparthi ……. కొడుకు దిద్దిన కాపురం కాదు కొడుకులు దిద్దిన కాపురం . మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేసిన సినిమా . ఒకనాటి హరనాథ్ , జమున నటించిన లేత మనసులు సినిమా టైపు . కాకపోతే అది ఆడ కవల పిల్లలు కాబట్టి ఫైటింగులు గట్రా లేకుండా విడిపోయిన తమ తల్లిదండ్రులను కలిపారు ఇద్దరు కుమార్తెలు . ఈ సినిమాలో కవలలు మగ పిల్లలు కావటం వలన ఫైటింగులు , టీజింగులు గట్రా ఉన్నాయి .
ఈ సినిమా అంతా మహేష్ బాబుల మీదే నడుస్తుంది . కధ ఏంటంటే : హీరో కృష్ణ పేదవాడు , హీరోయిన్ విజయశాంతి కోటీశ్వరుడి కుమార్తె . కృష్ణ తోటి పెళ్లి అని చెప్పి మోహన్ బాబుతో పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు తండ్రి గుమ్మడి . ఆఖరి క్షణంలో వచ్చి విజయశాంతిని తీసుకుని వెళ్ళి పెళ్ళి చేసుకుంటాడు హీరో కృష్ణ .
Ads
చేయని హత్య కేసులో హీరోని ఇరికిస్తారు . విజయశాంతి కృష్ణే హత్య చేసాడని నమ్ముతుంది . కింద కోర్టులో పడిన శిక్షను హైకోర్టు కొట్టేసీ విడుదల అవుతాడు హీరో . విజయశాంతి కవలలను ప్రసవిస్తుంది . భార్యాభర్తలకు తెలియకుండానే ఇద్దరు కవలలు చెరొకరి దగ్గర పెరుగుతారు .
ఇద్దరు కవలలు కలుసుకుని తల్లిదండ్రులను కలపటానికి చేసే ప్రయత్నమే మిగిలిన సినిమా అంతా . ఈ ప్రయత్నంలో తండ్రి , తండ్రి స్నేహితులు గిరిబాబు , అశ్విని కవలలకు తోడ్పడతారు . క్లైమాక్సులో అందరూ కలిసి అసలు నేరస్తుడయిన మోహన్ బాబుని , హత్య చేసిన త్యాగరాజును , తదితర విలన్లను పోలీసులు అరెస్టు చేయటంతో సీనిమా సుఖాంతం అవుతుంది .
రాజ్య- కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హుషారుగా ఉంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , మనో , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . థియేటర్లో బాగుంటాయి . కొరియోగ్రాఫర్ శ్రీను డాన్సుల్ని కూడా బాగా కంపోజ్ చేసారు . కృష్ణ , విజయశాంతి మీద రెండు డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి.

జూం చక్కా ఎంచక్కా , బహూపరాక్ ఓ మహారాణీ అంటూ సాగుతాయి ఈ రెండు డ్యూయెట్లు . మహేష్ బాబు ఎంట్రీ సాంగ్ ఓం నమ నటరాజుకే నమ గ్రూప్ డాన్స్ బాగుంటుంది . మహేష్ బాబు చిన్నవాడిగా ఉన్నప్పుడే డాన్సులు బాగా వేసాడు . అలాగే మోహన్ బాబుని ఇద్దరూ కలిసి టీజ్ చేసే హే మామా హే మామా పాట కూడా హుషారుగా ఉంటుంది .
మరో పాట శివ శివ మూర్తివి గణనాధా నువు శివునీ కుమారుడవు గణనాధా కూడా బాగుంటుంది . కృష్ణ తాగినట్లు నటించి పాడే పాట ఆలూ లేదు చూలూ లేదు అల్లుడేమో సోమలింగం కూడా హుషారుగా ఉంటుంది . పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు .
త్యాగరాజన్ క్లైమాక్సులో ఫైట్లను కొత్త రకంగా కంపోజ్ చేసారు . విజయశాంతికి , మహేష్ బాబుకి అనార్కలికి కట్టినట్లు సజీవ సమాధి కడతారు . కృష్ణ , విజయశాంతి , గుమ్మడి , గిరిబాబు , మోహన్ బాబు , అశ్విని , కుయిలీ , త్యాగరాజు , సాక్షి రంగారావు , సారధి , ప్రభాకరరెడ్డి , తదితరులు నటించారు . విశేషం ఏమిటంటే జయమాలిని ఉన్నది కానీ ఆమెకు పాట కానీ డాన్స్ కానీ లేదు .
భీశెట్టి లక్ష్మణరావు నేసిన కధకు పరుచూరి బ్రదర్స్ డైలాగులను వ్రాసారు . పద్మాలయా బేనరుపై నిర్మించబడిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , నిర్మాత , దర్శకుడు అన్నీ కృష్ణే . కాపురాల మీద కృష్ణ ఎనిమిది సినిమాల్లో నటించారు . వాటిల్లో ఒకటయిన ఈ కొడుకు దిద్దిన కాపురం కమర్షియల్ గా సక్సెస్ అయింది .
మహేష్ బాబుకు మంచి పేరు వచ్చింది . బాగా నటించాడు . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . It’s a commercial , feel good , entertainer .
నేను పరిచయం చేస్తున్న 1215 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article