Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాయిబాబా పడకగదిలో హత్యలు… ఇక ఎప్పటికీ తేలని ఓ మిస్టరీ…

May 5, 2024 by M S R

Sai Vamshi….   … 1993లో పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన 6 హత్యల గురించి కేరళకు చెందిన హేతువాది బసవ ప్రేమానంద్ గారు రాసిన పుస్తకం ఇది. మహిమలు, స్వామీజీలకు వ్యతిరేకంగా జీవితమంతా కృషి చేసిన ప్రేమానంద్ 1974 నుంచి సత్యసాయి బాబా మీద పోరాడారు. 1986లో దాదాపు 500 మంది కార్యకర్తలతో కలిసి పుట్టపర్తిలో కవాతు నిర్వహించినందుకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

అదే ఏడాది ఆయన కోర్టులో బాబా మీద కేసు వేశారు. శూన్యం నుంచి బంగారం సృష్టిస్తూ Gold Control Actని ఉల్లంఘించారని ఆరోపించారు. కానీ కోర్టులో ఆ కేసు కొట్టేశారు. 1993లో ఆయన ఈ పుస్తకం రాశారు. పుట్టపర్తి సాయిబాబా మీద బలమైన పోరాటం చేసిన వారిలో నేటికీ ప్రేమానంద్ గారిది తొలి స్థానం. 2009లో 79వ ఏట క్యాన్సర్‌తో మరణించారు.

… 1993 జూన్ 6వ తేదీ రాత్రి 9:20కి నలుగురు వ్యక్తులు కత్తులతో ఆశ్రమంలోని బాబా గదికి వెళ్తుండగా, బాబా శిష్యులు సాయికుమార్, ఎన్.రాధాకృష్ణ వారిని అడ్డగించారు. వారు తిరగబడి వీరిని చచ్చేలా కొట్టి హతమార్చారు. మరో ఇద్దరు శిష్యులు అనిల్, విష్ణుభట్ అడ్డురాగా, వారిని బలంగా గాయపరిచారు. మందిరంలో ఉన్న బాబా ఎలాగో మరో గదికి వెళ్లిపోయారు.
ఆ సమయంలో అలారం మోగి, ఆశ్రమంలో లైట్లు వెలిగాయి. కత్తులతో ఉన్నవారు అక్కడే నిలబడి ఉండగా, పోలీసులు వచ్చి తమ ఆత్మరక్షణ కోసం వారిని కాల్చి చంపేశారు. ఇది పోలీసుల కథనం. అయితే వచ్చిన వారి చేతిలో కత్తులే లేవని, కత్తులు చేతితో పట్టుకుని నలుగురితో ఎలా పోరాడతారనే ప్రశ్న అప్పట్లో కొందరిలో మెదిలింది. పోలీసుల కథానానికి, లోపల శవాలు, ఆయుధాలు, రక్తం పడి ఉన్న తీరుకూ సంబంధం లేదని మరికొందరి మాట.

… వచ్చినవారి లక్ష్యం బాబా కాదని, ఏవో కొన్ని రహస్యాలు తెలిసిన ఎన్.రాధాకృష్ణను చంపేందుకే వచ్చారనే వాదన వినిపించింది. అయితే నిజం ఏమిటో, ఆరోపణలు ఏమిటో ఏవీ బయటకు రాలేదు. అనంతరం సత్యసాయి ట్రస్టు ముఖ్య అధికారి ఇందూలాల్ షా మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా ట్రస్టు వ్యక్తిగత అంశం. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోనవసరం లేదు’ అన్నారు.

Ads

ఆ తర్వాత ఈ అంశం గురించి విచారణ జరిగినా, వివరాలేవీ బయటకు రాలేదు. ఈ కేసును మూసేయమని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత రహస్య ఆదేశాలు వచ్చాయనేది ఒక మాట. అయితే, మరణించినవారిలో నలుగురు నిజంగా హత్య చేయడానికే వచ్చారా, లేక అక్కడికి వచ్చి హత్యకు గురయ్యారా, వాళ్ల శరీరాల్లో బుల్లెట్లు పోలీసులు కాల్చినవేనా, ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది అనేది నేటికీ తెలియదు… పూర్తి వివరాలు: http://www.exbaba.com/articles/whomurdered.html…?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions