Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియాను వదలని ఆదానీ… ఎన్డీటీవీ వాటాల కొనుగోలు… త్వరలో పూర్తిగా…

August 23, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ……… కాంగ్రెస్ వలన, కాంగ్రెస్ కొరకు, కాంగ్రెస్ చేత సృష్టించబడ్డ NDTV ఎట్టకేలకి ఆదాని చేతిలోకి రాబోతున్నది. ప్రస్తుతం 28.9% స్టేక్ తీసుకుంటున్నా, దానిని క్రమంగా పెంచుకుంటూ పోతూ, చివరికి తన అధీనంలోకి తీసుకోగల దమ్ము, సత్తా ఉంది ఆదానికి! (ఆసక్తి కూడా ఉంది) గతంలోనే ఈ వార్త వైరల్ అయినా [నేను పోస్ట్ కూడా పెట్టాను ] అలాంటిది ఏదీ లేదంటూ NDTV ఖండించింది కానీ ఆదానీ మాత్రం అవును అని కానీ కాదు అని కానీ అనలేదు ఇప్పటివరకు… చాలా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయాడు…

1984 లో కలకత్తాకి చెందిన ఆర్ధికవేత్తగా పిలవబడే ప్రణయ్ రాయ్ అతని భార్య అయిన మరియు జర్నలిస్ట్ అయిన రాధిక రాయ్ కలిసి NDTV [New Dhelhi Television ] స్థాపించారు. మొదట్లో దూరదర్శన్ కోసం వార్తలు ప్రసారం చేసేవారు. క్రమంగా దూరదర్శన్ ప్రైమ్ టైమ్ స్లాట్ ని తమకి ఇచ్చేలా పైరవీలు చేసుకొని, దూరదర్శన్ లో పాతుకు పోయారు. వార్తలు అంటే ఎన్డీటివి అనే స్థితికి వచ్చేలా చేశారు… కొన్ని నిజాలు చాలా వరకు అబద్ధాలుగా ప్రచారం చేయడంలో Ph.d చేశారు…

ఎన్డీటివి చెప్పిందే నిజం ! ఎందుకంటే వేరే మాధ్యమం లేని రోజుల్లో మంచి క్వాలిటీతో వార్తలు అందించేది ఎన్డీటివి. పాత తరం యూమాటిక్ కెమెరాలతో వీడియోలు తీసే దూరదర్శన్ ప్రసారాలు ఉంటే, అప్పట్లో ఎన్డీటీవీ కొత్తగా వచ్చిన Sony Beta కెమెరాలతో వార్తలని కవర్ చేయడంతో పిక్చర్ క్వాలిటీ బాగా ఉండేవి. ఇక వీడియో జర్నలిస్ట్ లకి Sony Hi 8 కెమెరాలు ఇచ్చి వాటితో షూట్ చేయించి ప్రసారాలు చేసేది…

Ads

దూరదర్శన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా సరే, ప్రణయ్ రాయ్ ఆడింది ఆట పాడింది పాటగా అప్రతిహతంగా కొనసాగింది. 1998 లో రూపర్డ్ ముర్దోక్ కి చెందిన STAR ప్రసారాలకి భారత్ లో అనుమతి ఇచ్చిన తరువాత NDTV 24 X7 ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. పాకిస్థాన్ లో భారత టెలివిజన్ చానెల్ కి అనుమతి కేవలం ఎన్డీటివికే ఉండేది అప్పట్లో !

ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ దృశ్యాలని లైవ్ లో కవర్ చేయాలంటే పాకిస్థాన్ నుండి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎన్డీటివికి అడిగినదే తడవుగా వీసాతో పాటు ప్రత్యేక గుర్తులతో వాహనం ఏర్పాటు చేసేది పాక్ ప్రభుత్వం [ISI]… ఎన్డీటివి విలేఖరులకి మన దేశంలో ప్రత్యేక సదుపాయాలు ఉండేవి అప్పట్లో. ఏదన్నా నగరానికి వెళితే చేతిలో ఎన్డీటివి లోగో ఉన్న మైక్ కనపడగానే ఎలాంటి ఛార్జీ లేకుండా రెండు మూడు గంటలు హోటల్ లో ఉచితంగా ఉండవచ్చు. కొన్ని హోటళ్లలో ఖరీదయిన విదేశీ మద్యం బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చే సాంప్రదాయం ఉండేది.

ndtv

పారిశ్రామిక వేత్తలని బెదిరించి డబ్బు వసూలు చేయడం ఎన్డీటివితో మొదలయ్యింది. సిబిఐ కంటే ఎన్డీటివికే భయపడేవారు. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ల ప్రాబల్యం కేంద్ర ప్రభుత్వంలో ఎంతలా ఉండేది అంటే, మీకు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కార్యాలయాలలో ఏదన్నా పని పెండింగ్ లో ఉంటే వీళ్లిద్దరిలో ఎవరిని కలిసినా ఆ పని అయిపోయేది. చివరకి సౌత్ బ్లాక్ లో ఉండే ప్రధాని కార్యాలయంలో కూడా వీళ్ళ హవా నడిచింది ! రామన్ మెగసెసే అవార్డులతో పాటు పద్మశ్రీ అవార్డులు కూడా చిటికెలో వరించేవి !

2008 లో ICICI బ్యాంక్ నుండి 366 కోట్ల రూపాయలని ఒక ప్రైవేట్ హోల్డింగ్ కంపనీ కోసం, తన ఎన్డీటివి షేర్లని గ్యారంటీగా చూపించి రుణం ఇప్పించాడు ప్రణయ్ రాయ్. అది NDTV – RRPR Holding Private Ltd అనే సంస్థ… కానీ అప్పట్లో ముంబై స్టాక్ ఎక్సేంజ్ లో వాస్తవంగా ఉన్న ఎన్డీటివి షేర్ ధరని కృత్రిమంగా బాగా పెంచి రుణం తీసుకున్నాడు. నిజానికి RRPR holdings Private Ltd అనేది ఒక ఫేక్ కంపనీ. సంవత్సరం తిరగకుండానే తీసుకున్న అప్పు మీద వడ్డీ 48 కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ ! ఆ 48 కోట్ల రూపాయలని దారి మళ్లించి తన ఖాతాలో వేసుకొని బాంక్ కి వడ్డీ కింద 48 కోట్లు కట్టినట్లు తప్పుడు రిటర్న్స్ ఇచ్చాడు ఆదాయపన్ను శాఖకి…

ndtv

2014 మోడీ అధికారంలోకి రాగానే సిబిఐ ఎన్డీటివి కార్యాలయాల మీద దాడి చేసి పలు కీలక పత్రాలని స్వాధీనం చేసుకున్నప్పుడు ఐసిఐసిఐ బాంక్ రుణం విషయం కూడా బయటపడ్డది. మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు దొరకగానే ED రంగప్రవేశం చేయడంతో మొత్తం 405 వందల కోట్ల రూపాయల కేసుగా నమోదు అయ్యింది. ఎన్డీటివి పతనం మొదలయ్యింది 2015 లో. ఇప్పటివరకు కోలుకోలేదు. ఒకప్పుడు అధికారం, దర్పం వెలగబెట్టిన ఒక్కొక్కరూ బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రణయ్ రాయ్ కూడా అధికారికంగా ఎన్డీటివి వ్యవహారాలకి దూరంగా ఉంటూ వచ్చాడు.

సిబిఐ దాడులలో ప్రణయ్ రాయ్ కి పాకిస్థాన్ తో ఉన్న సన్నిహిత సంబంధాల తాలూకు ఆధారాలు దొరికాయి అంటారు కానీ ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు. ఎన్డీటివిని ఆదానీ చేజిక్కించుకోవడం మీద ఎవరైనా, నైతిక విలువలు లేవా అని అంటే తాను టీవి వార్తల రంగంలో నిలదొక్కుకోవడానికి దూరదర్శన్ లేటెస్ట్ కెమెరాలు కొనకుండా ఆపేశాడు అనే వార్తని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. U-Matic Low Band కెమెరాలతో అవస్థలు పడుతుంటే అప్పట్లో వచ్చిన Sony Beta కెమెరాలు దూరదర్శన్ కొనకుండా ఆపడంలో ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ ల ప్రముఖ పాత్రని మరిచిపోకూడదు. ఒకరికి ఇద్దరు పారిశ్రామిక వేత్తలు ఎన్డీటివి బెదిరింపులకి భయపడి ఆత్మహత్య చేసుకుంటే దానిని ఆర్ధిక సమస్యల వలన చనిపోయారు అంటూ కవరింగ్ ఇచ్చిన సంగతీ మరువకూడదు.

అంచేత కాలం ఎప్పుడూ ఒకే తీరున ఉండదు అని గ్రహించినవాళ్ళకి ఇలాంటి కష్టాలు రావు. కమ్యూనిస్ట్ దేశమయిన సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లో మత ఛాందసులకి వ్యతిరేకంగా పోరాడుతుంటే, కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగిన ప్రణయ్ రాయ్ పాకిస్థాన్ తో చేతులు కలిపి తోటి కమ్యూనిస్టులకి ద్రోహం చేశాడు. ఇక్కడ సిద్ధాంతాలు కాదు డబ్బు, కీర్తి ప్రతిష్టలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు అదే డబ్బు వీళ్ళకి రంగులు చూపిస్తున్నది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
  • కాశీ తిరగబడింది… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions