Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా పుండు మీద పాకిస్థానీ కారం… దానికీ తత్వం తెలిసి వస్తోంది…

March 19, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి…..   పూరి జగన్నాథ్ సినిమా డైలాగ్ ఒకటి ఉంది “ రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను “ అని. కానీ పాకిస్థాన్ డైలాగ్ వేరే గా ఉంది “ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతాను “ అని…

తాజాగా అమెరికాలో పాకిస్థాన్ రాయబారిగా మసూద్ ఖాన్ ని నియమించింది. ఇది అమెరికాకి కాలే పుండు మీద ఉప్పు రాసినట్లుగా ఉంది. ఇంతకీ ఎవరీ మసూద్ ఖాన్ ? కాశ్మీర్ టెర్రర్ గ్రూపులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉంటాడు. అమెరికా కోర్టులు దోషులుగా నిర్ధారించిన పాకిస్థాన్ టెర్రరిస్టులతో తరుచూ సమావేశం అయ్యి వాళ్లకి మద్దతు తెలుపుతూ ఉంటాడు. మరో వైపు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి మెలిసి తిరుగుతూ ఉంటాడు. వాషింగ్టన్ ఎక్జామినర్ అనే వెబ్ news మరియు వీక్లీ మాగజైన్ ఈ విషయం తెలిపింది,

అంతే కాదు నేరుగా అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకి లెటర్ వ్రాసింది మసూద్ ఖాన్ నియామకం గురించి. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకి కూడా లేఖ వ్రాస్తూ మసూద్ ఖాన్ లష్కరే తోయిబా సభ్యులతో నిరంతరం సమావేశం అయ్యి వాళ్ళు చేసే దాడులని బహిరంగంగా సమర్ధిస్తుంటాడు, అలాంటి వాడిని వాషింగ్టన్ లో పాకిస్థాన్ రాయబారిగా ఎలా ఒప్పుకుంటున్నది అమెరికా ? అంటూ నేరుగా ప్రశ్నించింది…

Ads

అంతే కాదు నేరుగా అటార్నీ జనరల్ చేత ఎందుకు కోర్టు ధిక్కార అభియోగం మోపట్లేదు ? అంటూ అడిగింది. ఇన్ని రోజులూ అమెరికా పాకిస్థాన్ కి ఇస్తున్న నాన్ నాటో మిత్రుడు [Pakistan’s Major Non-NATO Ally status] అనే హోదాని ఇంతవరకు రద్దు చేయలేదు. కానీ పాకిస్థాన్ కి అన్ని వైపుల నుండి దారులు మూసుకుపోయిన తరుణంలో, అమెరికాతో సత్సంబంధాలు పునరుద్ధరించుకోవాల్సింది పోయి రెచ్చగొట్టే చర్యగా మసూద్ ఖాన్ ని నియమించడం మీద సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ఐనా జో బిడెన్ యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరించడం శోచనీయం.

2008 లో ముంబై మీద దాడులు చేసిన లష్కరే తోయిబా టెర్రర్ గ్రూపు మొత్తం 166 మంది మరణానికి కారణం అయ్యింది అయితే వీళ్ళలో 6 గురు అమెరికన్ పౌరులు కూడా ఉన్నారు. ముంబై దాడుల తరువాత అమెరికా కోర్టు లష్కరే తోయిబా టెర్రర్ గ్రూపుని దోషిగా నిర్ధారించింది. అలాగే ఆ టెర్రర్ గ్రూపు సభ్యుల మీద పెద్ద మొత్తంలో బహుమతిని ప్రకటించింది అమెరికా కానీ ఇంత వరకు ఎవరినీ పట్టుకోలేక పోయింది.

మసూద్ ఖాన్ ని అమెరికాలో పాకిస్థాన్ రాయబారిగా నియమించడం కేవలం రెచ్చగొట్టే చర్యగా భావించాలి. ఏదో ఒక వెబ్ news పత్రిక అయిన వాషింగ్టన్ ఎక్జామినర్ చెపితే కానీ తెలుసుకోలేనంత స్థితిలో ఉందా అమెరికా ? జో బిడెన్ యంత్రాంగం మరో వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద బిజీగా ఉన్న సమయంలో పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం ఏం చేస్తావో చూద్దాం అన్నట్లుగా ఉంది. రెండు వారాల క్రితం అమెరికా మనీ లాండరింగ్ చేస్తున్నది అంటూ పాకిస్తాన్ మీద ఏకంగా 50 మిలియన్ డాలర్లు జరిమానా వేసినా బుద్ధి రాలేదు పాకిస్థాన్ కి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions