.
ఏదైనా సమర్థనో, ఖండనో రాస్తే… తప్పయినా సరే నమ్మేలా ఉండాలి… అది ప్రజెంట్ సోషల్ మీడియా ప్రాపగాండా శకంలో ప్రథమ నీతి.,. కానీ చాలాసార్లు పలు పార్టీలు తప్పులో కాలేస్తుంటాయి…
ఇదీ అలాంటిదే… ముందుగా ఓ వార్త చదవండి…
Ads
పాకిస్థాన్, భారతదేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన భార్య ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చివేసి, పొరపాటున క్షిపణిని ప్రయోగించామని చెప్పింది. అప్పుడు భారత ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది.
అవును, 1965 సెప్టెంబర్ 19న గుజరాత్ ముఖ్యమంత్రి బలవంతరాయ్ మెహతా తన భార్యతో కలిసి గుజరాత్లోని ద్వారక నుండి కచ్కు వెళ్తున్నారు. పాకిస్థాన్ యుద్ధ విమానం భారత సరిహద్దుల్లోకి చొరబడి, గుజరాత్ ముఖ్యమంత్రి విమానంపై రెండు క్షిపణులను ప్రయోగించి తిరిగి పాకిస్థాన్కు వెళ్లిపోయింది.
ఈ దాడిలో ముఖ్యమంత్రి బలవంతరాయ్ మెహతా, ఆయన భార్య, కుమారుడు, విమాన పైలట్, కో-పైలట్ అందరూ మరణించారు.
బలవంతరాయ్ మెహతా విమానం పైలట్ పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని చూసినప్పుడు, అతను తమను రక్షించండి అనీ వారి దయ కోసం మేసెజ్ పంపాడు, విమానం రెక్కలను కదిలిస్తూ తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని సందేశం ఇచ్చాడు.
అయినప్పటికీ, పాకిస్థాన్ యుద్ధ విమానం బలవంతరాయ్ మెహతా విమానాన్ని కూల్చివేసి వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగిన 30 సంవత్సరాల తరువాత, బలవంతరాయ్ మెహతా, ఆయన భార్య, కుమారుడిని చంపిన పాకిస్థాన్ ఫైటర్ జెట్ పైలట్, అమెరికాలో నివసిస్తున్న బలవంతరాయ్ మెహతా కుమార్తెకు లేఖ రాసి క్షమాపణలు కోరాడు.
ఆ సమయంలో భారత ప్రభుత్వం కోరుకుంటే దీనికి గట్టి ప్రతీకారం తీర్చుకునేది. నేడు కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఐరన్ లేడీ ఐరన్ లేడీ అని అరుస్తున్నారు, అప్పుడు భారత ప్రభుత్వం పాకిస్థాన్ నుండి ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంది?
ఇదీ వార్త… ఆపరేషన్ సిందూర్తో బీజేపీకి, మోడీకి బాగా మైలేజ్ వచ్చిందనే అసహనంతో కాంగ్రెస్ సోషల్ టీమ్స్ నాడు ఇందిరగాంధీయే అపరకాళి, దుర్గ అనీ, పాకిస్థాన్ పీచమణిచిందనీ, మోడీకి చేతకాక ఆపరేషన్ సిందూర్ మధ్యలోనే ఆపేశాడనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు…
ఎహె, మీ ఇందిరకు ఏం చేతనైంది అని ఎదురుదాడి చేయడానికి బీజేపీ క్యాంపు స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ పైన పోస్టు… అయితే వార్త నిజం.,. ఆ ముఖ్యమంత్రి విమానాన్ని పాకిస్థాన్ యుద్ధవిమానం కూల్చివేసిన మాట నిజం… కాకపోతే పాకిస్థాన్ ఈ ముఖ్యమంత్రి వెళ్తున్న విమానాన్ని కూడా యుద్ధవిమానం అనుకుంది…
యుద్ధం జరుగుతున్నప్పుడు ఇవి సహజమే.., పైగా యుద్ధం వేళ పౌరవిమానానికి, అదీ సరిహద్దు రాష్ట్రంలో ఎయిర్ జర్నీకి అనుమతి ఇవ్వడమే తప్పు… ఆ ముఖ్యమంత్రి కూడా ఆ సాహసం చేసి ఉండాల్సింది కాదు… అన్నింటికీ మించి అప్పుడు ప్రధానిగా ఉన్నది ఇందిరాగాంధీ కాదు… లాల్ బహదూర్ శాస్త్రి…
ఈ సంఘటన జరిగిన ఒకటీరెండు రోజుల్లోనే (సెప్టెంబరు 1965) తను జూన్ 1964 నుంచి జనవరి 1966 వరకు ప్రధాని… జనవరిలో ఇదే యుద్ధం విరమణ, శాంతి ఒప్పందం కోసం రష్యా వెళ్లి అక్కడే అనుమానాస్పద స్థితిలో మరణించాడు…
ఈరోజుకూ అది మిస్టరీయే… అప్పట్లో ఎల్బీ శాస్త్రి కూడా పాకిస్థాన్ మీద కంప్లీట్ అప్పర్ హ్యాండ్ సాధించిన స్థితిలోనూ యుద్ధవిరమణ చేశాడు… ఎస్, ఇందిరాగాంధీ కూడా బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో 93 వేల మంది పాకిస్థానీ సైనికులు బందీలుగా మారినా సరే, కనీసం పాకిస్థాన్ జైళ్లలోని మన సైనికుల విడుదల కూడా కోరకుండా, పీవోకే అప్పగింత షరతు పెట్టకుండా యుద్ధవిరమణ ప్రకటించేసింది…
అవును, అప్పుడైనా ఇప్పుడైనా సేమ్… ప్రస్తుతం మోడీ కూడా అర్థంతరంగా యుద్ధం (ఆపరేషన్) ఆపేసినట్టుగానే గతంలో ఇందిర, ఎల్బీ శాస్త్రి కూడా… మళ్లీ మళ్లీ అలాగే… వాడు మారడు, మనమూ మారం..!!
Share this Article