Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… చెప్పుల పార్టీ వెనుక కూడా నందమూరి కుటుంబ నేపథ్యం ఉందా..?!

April 8, 2023 by M S R

Siva Racharla…….  ఒక సంఘటన, ఒక వార్త… ఒక సంబంధం, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ అనేక తప్పులు చేసిందని అన్నారు. దానికి సోషల్ మీడియాలో అలాంటి తప్పుల్లో మిమల్ని సీఎం చేయటం అతి పెద్దది అని కౌంటర్లు పడ్డాయి…

ఇప్పుడు ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే… ఇప్పటికే బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు ముఖ్యంగా సుజనా చౌదరితో కిరణ్ కుమార్ రెడ్డి కలిసి పనిచేస్తారా? భవిష్యత్తులో అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు గారు ఉమ్మడి వేదిక నుంచి ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేయమని అడిగి చేతులు పైకెత్తి మేము ఒకటే అనే సందేశం ఇస్తారా?
1978లో తొలిసారి ఎమ్మెల్యే అయిన బాబుగారు తొలి వర్గ పోరు నాటి మంత్రి , సీనియర్ నేత ఒక సందర్భంలో సీఎం రేసులో నిలిచిన కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అయిన అమర్నాథ్ రెడ్డి గారితోనే. చంద్రబాబు చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పార్టీ నిర్ణయాన్ని కాదని కుతూహలమ్మ ను ఎంపిక చేయటంతో అమర్నాథ్ రెడ్డి కక్షకట్టి చంద్రబాబును కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయించాడు.
2014 ఎన్నికల ముందు కాంగ్రెసులో పెద్ద నేత, సొంత బలం ఉన్న అప్పటి మంత్రిని బీజేపీలో చేరమని అడగగా టీడీపీతో పొత్తు లేకుంటే చేరుతాను అని కండిషన్ పెట్టాడు… ఇప్పుడు టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటే ఎలా ఉంటుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది…
ఈ రోజు వచ్చిన వార్త… చిలకలూరిపేట నుంచి టీడీపీ తరపున హరికృష్ణ గారి కూతురు సుహాసిని పోటీకి రంగం సిద్ధం. చక్రం తిప్పిన బాలకృష్ణ అని ఒక పత్రిక రాసింది. అది నిజమే కాదో తెలియదు, దాని గురించి చర్చ అవసరం లేదు. మరి కిరణ్ కుమార్ రెడ్డికి సుహాసిని పోటీ వార్తకు సంబంధం ఏమిటి?

జై సమైక్యాంధ్ర పార్టీ చెప్పుల గుర్తు కిరణ్ కుమార్ రెడ్డి గారిదని అందరికీ తెలిసిందే. అయితే ఆ జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టింది, ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్టర్ చేసింది టీడీపీ మాజీ ఎంపీ చుండు శ్రీహరి. కిరణ్ కాంగ్రెస్ ను వీడిన తరువాత శ్రీహరి గారి నుంచి జై సమైక్యాంధ్ర పార్టీని తీసుకున్నారు. ఆ తరువాత శ్రీహరి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించారు. శ్రీహరి రాజమండ్రి లోకసభ స్థానం నుంచి 1984లో గెలిచి, 1989 మరియు 1996లో ఓడిపోయారు. ఈ శ్రీహరి గారి కోడలే నందమూరి సుహాసిని. 2018 ఎన్నికల్లో సుహాసిని టీడీపీ తరపున కూకట్ పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు…

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions