.
రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల పోస్టింగుల విషయంలో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరిస్తున్నాడు… ఎవరు ఏ పోస్టుకు ఫిట్టవుతారనేది, గత పాలకులతో సంబంధం లేకుండా, సొంతంగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు… అంటే..?
గతంలో కేసీయార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు అనే కారణంతో, బీఆర్ఎస్ సన్నిహితులు అనే కారణంతో ఎవరినీ దూరం పెట్టడం లేదు… మరీ స్మితా సబర్వాల్ వంటి ఒకరిద్దరు కేంద్ర సర్వీసు అధికారులు మినహా… దానికీ రీజన్స్ ఉన్నాయి… కేసీయార్ పాలనలో కొన్ని రంగాల్లో కొందరు విశేషంగా రాణించారు… వారిని రేవంత్ రెడ్డి కూడా అవే పనుల్లో ప్రాధాన్యం ఇచ్చి మరీ సర్వీస్ తీసుకుంటున్నాడు…
Ads
ఉదాహరణకు… జయేష్ రంజన్ పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో కేసీయార్కు బాగా సహకరించాడు… తనకు మరింత ప్రాధాన్యం ఇచ్చి రేవంత్ రెడ్డి సేమ్ సర్వీస్ తీసుకుంటున్నాడు… దాదాపు పదేళ్లుగా తెలంగాణ ఫైనాన్స్ అంటేనే రామకృష్ణారావు… రేవంత్ రెడ్డి తనను ఏకంగా చీఫ్ సెక్రెటరీని చేసుకున్నాడు… ఎలాగోలా తిప్పలు పడి ఆయన అప్పులు తెస్తూనే ఉన్నాడు, బండి నడిపిస్తూనే ఉన్నాడు…
నవీన్ మిట్టల్ రెవిన్యూ సెక్రెటరీ… తనను చాన్నాళ్లు సీసీఎల్ఏ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా..! శాంతికుమారిని అలాగే చీఫ్ సెక్రెటరీ పోస్టులో కొనసాగించాడు… బుర్రా వెంకటేశంను ఏకంగా టీజీపీఎస్సీ అధ్యక్షుడిని చేశాడు…
స్మితా సబర్వాల్కు టూరిజం బాధ్యతలు ఇచ్చి, మిస్ వరల్డ్ బాధ్యతలు ఇచ్చినా సరే, ఆమె సగటు బీఆర్ఎస్ కార్యకర్తకన్నా ఎక్కువగా కంచె గచ్చిబౌలి ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి బుక్కయ్యింది… ఆమె సర్వీస్ రూల్స్ గీతలు దాటింది… సో, ఆమెను పక్కన పెట్టేయాల్సిన అనివార్యత… జస్ట్, ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే…
ఆమ్రపాలి… ఆమెకు ఓ దశలో ఆరు పోస్టులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం… కానీ ఆమెతోపాటు మరికొందరు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి వచ్చింది… మళ్లీ క్యాట్ ద్వారా తెలంగాణకు వచ్చేసింది తాజాగా ఆమె… ఎలాగూ ఆమెకు మళ్లీ మంచి పోస్టింగులే దక్కుతాయి… డౌట్ లేదు…
ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే… పొరుగున ఉన్న ఏపీలో ఓ వింత ధోరణి కనిపిస్తోంది… జగన్కు బాగా సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారులకు మంచి పోస్టింగులు ఇస్తే కూటమి పార్టీ శ్రేణుల నుంచే వ్యతిరేకత, మరీ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో నెగెటివిటీ కనిపిస్తోంది… చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అలాగే ఆలోచిస్తూ కథనాలు వెలువరిస్తోంది…
జగన్ వీరభక్తులకు మన ప్రభుత్వంలో కూడా మంచి పోస్టింగులు ఏమిటనేది ఆ అభ్యంతరాల సారాంశం… మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఇతర కొందరు కేంద్ర సర్వీసు అధికారులపై ఉన్న వివాదాలు, కేసులు వేరు, వాళ్లను పక్కన పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు… కానీ జగన్ పాలనకాలంలో పనిచేసిన అందరినీ దూరం పెట్టలేరు కదా…
ప్రస్తుత ప్రభుత్వ పాలసీలు, ప్రాధాన్యాల ప్రకారం పనిచేయించుకోవాల్సిందే.., నిజానికి అధికశాతం ఉన్నతాధికారులు ఎవరు ప్రభుత్వంలో ఉంటే, వాళ్లతో బాగుంటున్నారు… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా…
సో, రాజకీయ నియామకాలు వేరు… ఉన్నతాధికార యంత్రాంగంతో పని తీసుకోవడం, పోస్టింగులు వేరు… అన్నింటినీ ఒకే గాటన కట్టలేం… ఈ కోణంలో చంద్రబాబుకన్నా రేవంత్రెడ్డే అలవోకగా ఏ ఒత్తిడీ లేకుండా ఉన్నతాధికారుల నుంచి తనకు కావల్సిన సర్వీస్ తీసుకుంటున్నట్టే లెక్క..!!
Share this Article