Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ఉపనయన మరణాలు జలప్రమాదమా..? జెన్‌కో అధికారులు చేసిన హత్యలా..?

February 11, 2023 by M S R

ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు… ఇదీ విషాదం… నిజానికి అది ప్రమాదం కాదు, ఖచ్చితంగా రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు చేసిన హత్యలే…. ఆశ్చర్యంగా ఉందా..? మొత్తం చదివాక మీరే అంగీకరిస్తారు… ముందుగా ఈ వార్తను కాస్త ప్రామినెంట్‌గా కవర్ చేసిన ఆంధ్రజ్యోతికి అభినందనలు, అదేసమయంలో ఉపనయనమే ఉసురు తీసిందనే తిక్క హెడింగ్ పట్ల అభ్యంతరాలు..! ఉపనయనం ఉసురు తీయడం ఏమిటి..?

ముందుగా ఇన్సిడెంట్ ఏమిటో చూద్దాం… హర్షిత్ అలియాస్ వాచస్పతి ట్రిపుల్ ఐటీ గౌహతిలో చేస్తున్నాడు… 20 ఏళ్లు… ఎప్పుడో ఉపనయనం జరిగి ఉండాల్సింది, ఎందుకో లేటైంది… ఆ క్రతువు కోసం నాగార్జునసాగర్‌లోని పెద్దనాన్న దత్తు ఇంటికి చేరుకున్నారు అందరూ… హైదరాబాద్‌కు చెందిన నాగరాజు కూడా దీనికోసమే సాగర్ వచ్చాడు… సాగర్ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రం దిగువన ఓ స్నానవాటికలో మూడు రోజులుగా క్రతువు కొనసాగుతోంది…

గురువారం తెల్లవారుజామున హర్షిత్, నాగరాజు, దత్తు కొడుకు చంద్రకాంత్ స్నానాలు చేస్తున్నారు… ఈలోపు హఠాత్తుగా నీటి వరద వచ్చి ముగ్గురూ కొట్టుకుపోయారు… తల్లిదండ్రులు లబోదిబో మంటూ సాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చి, స్థానిక పుట్టి జాలర్ల సహకారంతో గాలించారు… చివరకు రాత్రికి ముగ్గురి మృతదేశాలు స్నానఘాట్‌కు సమీపంలోనే కనిపించాయి… వీరిలో దత్తు కొడుకు చంద్రకాంత్ ఐటీ జాబ్‌తోపాటు పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు… ఇదీ వార్త…

Ads


upanayanam


మరి అధికారులు వైఫల్యం ఏమిటి అంటారా..? ముగ్గురికీ ఒకేసారి మృత్యువు రాసిపెట్టి కాబట్టి అలా కొట్టుకుపోయారు అని ఖర్మసిద్ధాంతం వల్లిస్తున్నారా..? తప్పు… చీకటి, సాగర్ హైడల్ ప్లాంటు నుంచి ఒకేసారి 20 వేల క్యూసెక్కుల వరద ముంచెత్తితే ఇదే కదా జరిగేది… ఈత వచ్చిన వాళ్లు సైతం ఆ ఉధృతికి కొట్టుకుపోతారు… అది చిన్న వరదేమీ కాదు… మరి నీటిని దిగువకు వదిలేటప్పుడు అలారమ్ సిస్టమే లేదా..?

నీళ్లు వదిలినప్పుడు దిగువన ఉన్న కొన్ని కీలక ప్రాంతాల్లో అలారమ్ మోగే ఏర్పాట్లు చేతకాలేదా జెన్‌కో అధికారులకు..? అప్పటికప్పుడు రక్షించడానికి ఆ చీకటివేళ ఎవరూ ఉండరు… ఎవరో కొద్దిమంది ఇలా స్నానాలు చేసేవాళ్లు తప్ప… పైగా చీకట్లో ఎవరూ ఏమీ చేయలేరు… కనీసం నీళ్లు వదులుతున్నామని గుర్తించేలా సాగర్ డ్యామ్‌పైన నాలుగైదుసార్లు లైట్లు వేసి, ఆర్పేసినా సరే, దిగువన ఉన్నవాళ్లు అలర్ట్ అవుతారు… ఏ హెచ్చరిక లేకుండా ప్లాంటులో కరెంటుత్పత్తి కోసం నీళ్లు అన్ని క్యూసెక్కుల నీటిని వదిలేస్తే, అది ఇలాంటి ఉపద్రవాలకే దారితీస్తుంది… ఇప్పుడు చెప్పండి ఇవి హత్యలా..? ప్రమాదమా..? విధి రాతా..?! ఈ ఉసురు తగిలేదెవరికి..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…
  • సారీ-గమలు… మళ్లీ అదే పోకడ… అసలు తప్పేమిటో తెలియడాయె…!!
  • కాకులూ పగబడతాయ్… గుంపుకట్టి దాడిచేస్తయ్… ప్రతీకారం తీర్చుకుంటయ్…
  • ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions