.
హేమిటో… కవిత చేసే కొన్ని సూత్రీకరణలు నవ్వు పుట్టిస్తాయి… ఇన్నేళ్లూ తెలంగాణను తమ కోసం పదే పదే వాడుకుని, చివరకు తమ అక్రమాలకూ తెలంగాణనే అడ్డుపెట్టుకునే ఆలోచనలు, చర్యలు, మాటలు ఓ రకమైన నెగెటివిటీకి దారితీస్తున్నాయనే ఆత్మవిమర్శ కనిపించదు…
ఈ తరహా ఆలోచనల వల్లే గత ఎన్నికల్లో ఇదే తెలంగాణజనం తమను ఓడించినా సరే, ఇంకా ఆ నిజం తెలియరావడం లేదు… ఆమె ఏదో తన పిత మీద (జాతి పిత కాదు) తిరుగుబాటు జెండా ఎగరేసింది సరే, ఆమె కారణాలు, ఆమె ఆశలు, ఆమెకు అడ్డంకులు, ఆ వారసత్వ పంచాయితీల కథలు వేరు..,
Ads
ఆమె బయటికి వచ్చేస్తుందా..? లేక నరేంద్రను, విజయశాంతిని తరిమేసినట్టే కేసీయార్ సొంత బిడ్డనూ పార్టీ నుంచి పంపించేస్తాడా అనేది కూడా వేరే విషయం… కానీ ఈరోజుకూ ప్రతి దానికీ తెలంగాణతో లింక్ పెట్టడం ఏమిటి అసలు..?
నిన్న జాగృతి కొత్త కార్యాలయం వేళ ఆమె మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనీ, ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే యావత్తు తెలంగాణకు నోటీసులిచ్చినట్లేనని అంటోంది… అసలు జాతిపిత అనే భావనే శుద్ధ తప్పు… పైగా అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీని నిరూపించుకోవాల్సిందే తప్ప… కేసీయార్ కాబట్టి అన్నింటికీ అతీతుడనే భావన ఏమిటసలు..?
పైగా ఆయనకు నోటీసులిస్తే తెలంగాణకు ఇవ్వడం ఏమిటి..? వేరే ఏ దేశం వాడో, వేరే రాష్ట్రం వాడో తెలంగాణ మీద కుట్రతో ఇచ్చారా నోటీసులు..? తెలంగాణ జనం ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చింది నోటీసులు… అదీ ఓ తెలంగాణ మెగా ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ ఖజానాకు వాటిల్లిన నష్టాల గురించే…
ఏ తప్పూ లేనప్పుడు ఉలికిపాట్లు దేనికి..? సేమ్, మద్యం కేసుల్లో అరెస్టయి బెయిల్ విచారణలకు వచ్చిన ప్రతిసారీ పిడికిలి బిగించి జైతెలంగాణ అనేది… తెలంగాణ ఎప్పుడూ తలవంచదు అనే కామెంట్స్ కూడా… మద్యం అవినీతి ఆమె వ్యక్తిగతం… అది తెలంగాణ మీద కుట్ర ఎలా అవుతుంది..?
కాలేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్నే నిరసిస్తూ మహాధర్నా చేస్తుందట, సరే, ఆమె తిరుగుబాటు బలమేమిటో ఆమే తన పిడికిలి విప్పి ప్రదర్శిస్తే అది ఆమెకే నష్టం… అసలే బీఆర్ఎస్ కేడర్ సంపూర్ణంగా ఆమెను అవాయిడ్ చేస్తోంది… బలనిరూపణ అన్ని వేళలా కరెక్టు కాదు, ఒకవేళ ఈమె వెనుక ఎవరూ లేరని తేలిపోతే, ఆమె తిరుగుబాటు కూడా నిరర్థకం అయిపోతుంది… అది ఆమెకు తెలియడం లేదు…
కేసీఆర్ పిడికిలెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చిందనీ, దానివల్లే ఇవాళ అధికారంలో ఉన్నామన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని ఆమె రేవంత్ రెడ్డికి హితవు పలికింది… గుడ్.., తెలంగాణ కోసం కేసీయార్ చేసిన పోరాటాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు కదా… పైగా అదే రేవంత్ రెడ్డి పార్టీ అధినేత్రి తెలంగాణ ఇచ్చిందనీ మరిచిపోయింది…
మైనారిటీల హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తుందని కవిత ప్రకటించింది… జాగృతిలో మైనారిటీల హక్కుల కోసం ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తామంటోంది… జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది… గుడ్, కానీ గత పదేళ్లలో సామాజిక తెలంగాణ, బీసీ హక్కులు, మైనారిటీలు అనే కనీసాలోచన చేయలేదు ఎందుకని..? గంగ చంద్రముఖి అవుతున్నట్టు కవిత షర్మిల అవుతున్నట్టుగా ఏదో సంకేతం..! ఏదో సందేహం…!!
Share this Article