Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలియదు… ఏమో, గుర్తులేదు… సోనియా ఈడీ విచారణ సాగిన విధంబెట్టిదనిన…

July 24, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ………… ED-సోనియా విచారణ ! సోనియా ED ఆఫీస్ కి బయలుదేరే ముందు అన్ని రాష్ట్రాల నుండి ఛోటా మోటా నాయకులు ఢిల్లీ చేరుకొని ED ఆఫీసు ముందు ఆందోళనకి దిగారు. కక్ష సాధింపు రాజకీయాలు అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేశారు. ED ఆఫీసుకి వెళ్ళే ముందే సోనియా అధికారులకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నది… తనతో పాటు తన వ్యక్తిగత వైద్యుడిని అనుమతించాలి అంటూ..! అంతే కాదు, తనకి వ్యక్తిగత సహాయుకుడు కూడా వెంట ఉండాలనీ, తన తరుపున తన అడ్వకేట్ ని కూడా అనుమతించాలి అని ఆ అప్లికేషన్ లో ED అధికారులని కోరింది సోనియా…

మానవతా దృక్పథంతో ED అధికారులు సోనియా విన్నవించుకున్న విజ్ఞాపనని అంగీకరించారు కానీ కొన్ని షరతులకి లోబడి మాత్రమే ! సోనియా వెంట వచ్చే వారు ఎవరయినా సరే ఆఫీసు బయటే ఉండాలి తప్పితే విచారణ జరిగే చోటుకి అనుమతి ఇవ్వము అని… కానీ సోనియా ED ఆఫీసులోకి ప్రవేశిస్తూనే కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత నా ఆరోగ్యం సరిగా లేదనీ, కాబట్టి నా కూతురు ప్రియాంక వాద్రా నాకు తోడుగా ఉండడానికి అనుమతి ఇవ్వండి అని అడిగినది. కానీ మహిళా విచారణ అధికారిణి అయిన మోనికా శర్మ ప్రియాంక బయటే ఉండాలని, లోపలికి అనుమతించబోమని ఖరాఖండిగా చెప్పేసింది. ఇది మొదటి షాక్ సోనియాకి… ED అధికారులు స్పష్టంగా తమ షరతులు ఏమిటో చెప్పాక కూడా చాలా తెలివిగా తన వ్యక్తిగత సహాయకురాలిగా ప్రియాంకని తీసుకువెళ్లడం, అధికారులు బయటే ఉండి పొమ్మనడం ఎలా అర్ధం చేసుకోవాలి ?

10 ఏళ్లు ఒక బొమ్మ ప్రధానిని అడ్డం పెట్టుకొని ఏకఛత్రాధిపత్యంగా UPA చైర్ పర్సన్ గా భారత దేశాన్ని ఏలిన సోనియా ఇలాంటి సంఘటన ఒకటి తాను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఊహించి ఉండదు… రెండున్నగంటల ED విచారణలో మొత్తం 20 ప్రశ్నలని సోనియాని అడిగారు ED అధికారులు. చాలా వాటికి సమాధానం చెప్పకుండా దాట వేసింది [dodged] తెలివిగా… దానికి కారణంగా తన గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చిందనీ, సరిగా మాట్లాడలేకపోతున్నానని చెప్పింది… కొంచెం సేపటి తరువాత తనకి ఊపిరి ఆడటం లేదంటూ ప్రియాంకని పిలిపించుకొని గొంతులోకి స్ప్రే చేసే నేబ్యూలైజర్ ని వాడింది…

Ads

మరి కొంచంసేపటి తరువాత తనకి నీరసంగా ఉందని, ఎక్కువసేపు కూర్చోలేనని, కీలకమయిన ప్రశ్నలని వేస్తున్నసమయంలో అధికారులతో విన్నవించుకుంది సోనియా. మళ్ళీ ప్రశ్నలు వేయడం ప్రారంభించగానే తన వ్యక్తిగత వైద్యుడిని కలవాలనీ, ఎందుకంటే తనకి బాలెన్స్ తప్పిపోతున్నదని కళ్ళు తిరుగుతున్నాయని అధికారులని కోరింది సోనియా… మొత్తం 20 ప్రశ్నలలో కీలకమయిన ప్రశ్నలు అడిగారు ED అధికారులు… అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ [AJL], యంగ్ ఇండియా [YI], సోనియా కాంగ్రెస్ పార్టీ, AK ఆంథోనీ, మోతీలాల్ వొరా గురించినవే. ఇవన్నీ తాను అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నవే… కానీ పేర్లు వేరు వేరుగా ఉన్నాయి. నిజమేనా ? అని అడిగారు…

డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ [Dotex Merchandise Pvt Ltd] నుండి సోనియా తీసుకున్న అప్పు గురించి ED అధికారులు ప్రశ్నించగా చాలాసేపు మౌనంగా ఉండి తరువాత అవేవీ నాకు గుర్తు లేవు మరియు తెలియదు అని సమాధానం ఇచ్చి మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ చాలా స్పెసిఫిక్ గా డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ [Dotex Merchandise Pvt Ltd] నుండి తీసుకున్న అప్పుకి మరియు AJL, YI, నేషనల్ హెరాల్డ్ ఆస్తుల డాక్యుమెంట్స్ మీద సంతకం చేశారు కదా అని ED అధికారులు అడిగినప్పుడు సోనియా ‘‘అవేవీ నాకు తెలియవు మరియు గుర్తుకురావట్లేదు. అవన్నీ చనిపోయిన మోతీలాల్ వొరా చూసుకున్నారు’’ అని బదులు ఇచ్చింది…

NOTE: ప్రశ్నలకి సమాధానం చెప్పకపోయినా మరియు నాకు తెలియదు అన్నా, నాకు గుర్తుకురావట్లేదు అన్నా లేదా మౌనంగా ఉన్నా ED కోర్టు సదరు ప్రశ్నలకి సమాధానంగా ‘అవును’ [admission] అనే నిర్ధారించి తీర్పు ఇస్తుంది. జులై 25, 2022 సోమవారం రోజున మళ్ళీ విచారణకి హాజరుకమ్మని ED ఫ్రెష్ గా సమన్లు ఇచ్చింది! విచారణ జరుగుతున్నంతసేపు ED ఆఫీసు బయట కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ ప్రభుత్వపు కక్ష సాధింపు చర్యలని ఆపాలి అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు…

చిదంబరం తెలివితేటలు !

ఈ చిదంబరం ఏమన్నాడు అంటే .. అసలు FIR నమోదు చేయకుండా ED సోనియాకి సమన్లు ఇవ్వకూడదు అని… చిదంబరం చాలా సీనియర్ అడ్వొకేట్ మరి ! నల్ల కోటు వేసుకొని అన్ని రాష్ట్రాల హై కోర్టులతో పాటు సుప్రీం కోర్టులో కూడా కేసులు వాదిస్తాడు… కానీ అసలు కథ దాచిపెడతాడు… 2012 ఢిల్లీలోని ట్రయల్ కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రైవేట్ కంప్లయింట్ ఇచ్చాడు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విషయంలో అక్రమాలు జరిగాయని… అలాగే వాటికి సంబంధించిన కావాల్సిన ఆధారాలని కోర్టులో ఇవ్వడం జరిగింది… కానీ అప్పటి UPA ప్రభుత్వం సుబ్రహ్మణ్య స్వామి కంప్లైంట్ ని కొట్టివేయాలి అంటూ సుప్రీం కోర్టు గడప తొక్కింది.. సుప్రీం కోర్ట్ ఢిల్లీ హై కోర్ట్ లో అపీల్ చేయమని చెప్పింది.

ఢిల్లీ హై కోర్ట్ పిటిషన్ పరిశీలించిన తరువాత ట్రయల్ కోర్ట్ ని విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించి సదరు కోర్టు వారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుండి నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఉంది. 2012 లో UPA అధికారంలో ఉంది, అందులో ఈ చిదంబరం కూడా కాబినెట్ మంత్రిగా ఉన్నాడు కానీ FIR లేకుండా ED ఎలా సమన్లు జారీ చేస్తుందని ప్రశ్నించి, తన తెలివితేటలు ఎంతలా ఉన్నాయో ప్రపంచానికి తానే స్వయంగా చెప్పుకున్నాడు. సోనియా, రాహుల్ తో సహా తాను కూడా బెయిల్ మీద ఉన్నారనే సంగతి మరిచిపోయాడా చిదంబరం ?

కాంగ్రెస్ నాయకుడు జై రామ్ రమేష్ మాత్రం ఒక కట్టు కధ వినిపించాడు. సోనియా ఎంతసేపయినా ED ఆఫీసులో ఉండి అన్ని ప్రశ్నలకి సమాధానం ఇస్తాను అని ధైర్యంగా చెప్పిందిట ! మిమ్మల్ని అడగడానికి మా దగ్గర ప్రశ్నలు లేవని అధికారులు పంపించేశారుట ! ఒక మహిళ భారత 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల 25 న… అదే సమయంలో మరో మహిళ ED విచారణ బోనులోకి రెండో సారి వెళ్లబోతున్నది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions