Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదీ అసలు పాయింట్… చిన్న లీక్ లేకుండా ఆర్‌బీఐతో 6 నెలల సంప్రదింపులు…

January 2, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి …….  కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సుప్రీం కోర్టు సమర్ధించింది! 1. 2016 లో కేంద్ర ప్రభుత్వం 500,1000 రూపాయల నోట్ల రద్దుని సవాలు చేస్తూ మొత్తం 58 మంది సుప్రీం కోర్టులో పీటీషన్లు వేశారు. వీళ్లలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. 2. అయితే ఈ పిటీషన్ల మీద 5 గురు సభ్యులు కల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ రోజు ఉదయం తుది తీర్పు ఇస్తూ నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ బద్ధమే అని తీర్పు ఇచ్చింది.

3. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు కేంద్రప్రభుత్వ చర్యని సమర్ధించగా ,ఒక్క న్యాయమూర్తి మాత్రం మిగతా నలుగురితో విభేదించి నోట్ల రద్దుని వ్యతిరేకించారు. తీర్పు 4:1 మెజారిటీతో వెలువడింది.

4. కాంగ్రెస్ తో పాటు మిగతా పిటీషనర్ల వాదన ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బాంక్ అడ్వయిజరీ బోర్డ్ ని సంప్రదించకుండా ఏక పక్ష నిర్ణయం తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారు అని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని వాదించారు.

Ads

5. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బాంక్ ఇచ్చిన నోట్స్ ని పరిశీలించిన తరువాత, నోట్లు రద్దు చేయడానికి 6 నెలల ముందు నుండి కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బాంక్ ల మధ్య సంప్రదింపులు జరిపినట్లు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నదని పిటీషనర్లకు తెలిపింది. కాబట్టి ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపింది.

6. నోట్ల రద్దు అనేది రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చిన హక్కు అంటూ దానిని ఎలా అమలుచేయాలో చెప్పిన మార్గ నిర్దేశిక సూత్రాలని కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బాంక్ లు సరిగానే నిర్వర్తించాయి అని తీర్పులో పేర్కొంది.

7. సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పులో నోట్ల రద్దు వల్ల నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట పడిందా మరియు బ్లాక్ మనీని అరికట్టగలగారా అనే ఆబ్జెక్టివ్స్ గురించి పట్టించుకొనవసరం లేదని పేర్కొంది ! నోట్లు రద్దు చేసే అధికారం రాజ్యాంగం కల్పిస్తున్నప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో అది ప్రభుత్వం మరియు రిజర్వ్ బాంక్ చూసుకోవాలి కానీ కోర్టు ఇలాంటి విషయంలో జోక్యం చేసుకోదు ! శాసన వ్యవస్థ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగ బద్ధంగా జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రమే కోర్టు పరిశీలిస్తుంది తప్పితే దాని ఫలితాల మీద కోర్టు విచారణ చేయలేదు అంటూ తీర్పుని చదివిన జస్టిస్ BR Gavai గారు పేర్కొన్నారు.

8. అయితే 5 గురు సభ్యులు కల సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనంలో కేంద్ర ప్రభుత్వపు చర్యని వ్యతిరేకించిన ఒకే ఒక్క న్యాయమూర్తి అయిన జస్టిస్ BV నాగరత్న తన తీర్పులో నోట్ల రద్దుని చట్ట వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు.

9. 2016 నవంబర్ నెల 8వ తారీఖున నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కేవలం 24 గంటలలో తీసుకున్నారు అని జస్టిస్ BV నాగరత్న అభిప్రాయపడ్డారు. కనీసం పార్లమెంట్ లో చట్టం చేసి రద్దు చేసి ఉండాల్సిందని అభిప్రాయ పడ్డారు. మిగతా నాలుగు న్యాయమూర్తుల తీర్పు కంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది జస్టిస్ నాగరత్న గారి తీర్పు.

10. నోట్ల రద్దు నోటిఫికేషన్ తరువాత ప్రజలకి కొత్త నోట్లు మార్చుకోవడానికి ఇచ్చిన 58 రోజుల గడువు కూడా సమంజసంగానే ఉన్నట్లు సుప్రీం కోర్టు అభిప్రాయపడ్డది.

11. నోట్ల రద్దుని సవాలు చేస్తూ దాఖలయిన పిటీషన్లని ఉద్దేశిస్తూ మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుంటూనే ఉంది… ఇప్పుడు దానిని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు కనుక పిటీషన్లని కొట్టివేయమని అభ్యర్ధిస్తూ వచ్చింది.

12. అయితే సుప్రీం కోర్ట్ మాత్రం అంతా చట్ట బద్ధంగానే జరిగిందా లేదా అనే అంశాన్ని పరిశీలించే క్రమంలో ఏదన్నా చర్య తీసుకున్నా అది నిష్ఫలం అవుతుంది తప్పితే ప్రయోజనం ఉండదు… ఎందుకంటే రద్దు చేసిన నోట్ల ని తిరిగి చెలామణిలోకి తీసుకురావడం అసాధ్యం కనుక ఈ పిటీషన్లని కొట్టివేయమని అటార్నీ జనరల్ మొదటి నుండి ఒకే వాదనకి కట్టుబడి ఉన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో గతంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన చిదంబరం తన పలుకుబడిని ఉపయోగించి ఆర్ధిక శాఖ ద్వారా వివరాలు తీసుకున్నాడు… అయితే ఆ వివరాలలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బాంక్ ని నోట్ల రద్దు విషయంలో సంప్రదింపులు జరిపినట్లుగా రికార్డులు లేవు. ఈ విషయం మీదనే సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేశాడు కాంగ్రెస్ పార్టీ తరపున… తాను వేసిందే కాక ఇతరులని కూడా పిటీషన్లు వేయించడంలో సఫలీకృతం అయ్యాడు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బాంక్ తో నోట్ల రద్దు విషయం మీద చేసిన సంప్రదింపుల వివరాలు రహస్యంగా ఉంచింది కాబట్టి ఆ వివరాలు ఏవీ కూడా చిదంబరానికి చేరలేదు. రిజర్వ్ బాంక్ తో సంప్రదించకుండా నోట్ల రద్దు చేస్తే అది చట్ట విరుద్ధం, ఇది నిజం. ఈ పాయింట్ ని పట్టుకొని కోర్టుకి ఎక్కి భంగపడ్డాడు చిదంబరం. కేంద్ర ప్రభుత్వం తాను రిజర్వ్ బాంక్ తో నోట్ల రద్దు విషయం మీద 6 నెలలపాటు చేసిన కరస్పాండెన్స్ వివరాలు నేరుగా సుప్రీం కోర్ట్ ధర్మాసనానికి ఇచ్చింది… వాటిని పరిశీలించిన తరువాత తీర్పు బయటికి వచ్చే వరకు రహస్యంగా ఉంచబడింది. కీలమయిన పాయింట్ ఏమిటంటే చిదంబరంతో పాటు మిగతా పిటీషనర్లని చాలా జాగ్రత్తగా బురిడీ కొట్టించడంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తపడ్డది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మాణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions