Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన దూరదర్శన్ బ్రిటన్ రాజు మీద అవాకులు రాస్తే ఆ దేశం ఊరుకుంటుందా..?!

February 24, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ………. మనం BBC కి అండగా ఉందాం ! బ్రిటన్ పార్లమెంట్ !….. ‘’We stand up for BBC’’ ! భారత ఆదాయపన్ను శాఖ బిబిసి కార్యాలయాలలో సర్వే చేసిన తరువాత బ్రిటన్ పార్లమెంట్ చేసిన వ్యాఖ్య ఇది ! ‘’ మనం బిబిసికి అండగా ఉందాం ! మనం స్థాపించిన బిబిసి వరల్డ్ న్యూస్ ని సమర్ధించాల్సి ఉంది ! బిబిసి ఎడిటోరియల్ కి ఆ స్వాతంత్ర్యం ఉంది! పార్లమెంట్ అండర్ సెక్రటరీ ఆఫ్ ది FCDO [Foreign, Commonwealth & Development Office (FCDO) అయిన డేవిడ్ రుట్లే [David Rutley ] బ్రిటన్ పార్లమెంట్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది!

అఫ్కోర్స్ అబద్ధాలని ప్రచారం చేయడంలో శతాబ్దం పైగా అనుభవం ఉన్న బిబిసికి బ్రిటన్ లో ఇంకా ఆ మాత్రం సమర్ధన ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది!

********************

Ads

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు మరియు FCDO జూనియర్ మినిస్టర్ అయిన డేవిడ్ రూట్లే డొంక తిరుగుడు వ్యాఖ్య ! 21-02-2022 మంగళవారం రోజున బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఒక అత్యవసర ప్రశ్నకి ఉద్దేశించి స్పందిస్తూ భారత ఆదాయ పన్ను శాఖ బిబిసికి చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాలలో చేసిన సర్వే గురింటి ఎలాంటి వ్యాఖ్య చేయబోమని అంటూనే… వాక్ స్వాతంత్ర్యం మరియు పత్రికా స్వేచ్చ అనేవి ప్రజాస్వామ్యానికి కావాల్సిన ముఖ్యమయిన అంశాలు అంటూ నొక్కి వక్కాణించాడు !

****************

Robust Democracy [రోబస్ట్ డెమొక్రసీ ] అనే పదం వాడాడు డేవిడ్ రుట్లే ! ఓహ్ ! రోబస్ట్ డెమొక్రసీ అంటే ? బ్రిటన్ లాగా హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిటన్ రాణి లేదా రాజుతో పాటు 26 మంది క్రైస్తవ మత గురువులు ప్రజాస్వామ్యం నడపడమా ? చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కి చెందిన 26 మంది బిషప్ లు బ్రిటన్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో బ్రిటన్ రాణితో కలిసి దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ చేసే చట్టాలని పర్యవేక్షించడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ? ఇది ఫ్యూడల్ వ్యవస్థ కాదా ? ప్రజాస్వామ్యంలో మత గురువులని ఎలా నామినేట్ చేస్తారు ఎగువ సభకి ? ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు హౌస్ ఆఫ్ కామన్స్ లోని దిగువ సభలో చేసే చట్టాలని మత గురువులు సమీక్షిస్తారా ? సలహాలు, సూచనలు ఇస్తారా ? ఇలాంటి వ్యవస్థ భారత్ లో లేదేమిటీ ?

అదే భారత పార్లమెంట్ లో ఎలాంటి మత గురువులు ఉండరు! భారత పార్లమెంట్ లో భారత దేశపు రాజు కానీ రాణి కానీ ప్రాతినిధ్యం వహించరు కానీ భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందట.. ! క్రైస్తవ మత గురువులు ప్రాతినిధ్యం వహించే బ్రిటన్ పార్లమెంట్ ఇచ్చే నిధుల మీద నడిచే బిబిసి భారత్ లో పన్ను ఎగవేతకి పాల్పడిందా లేదా అని సర్వే చేస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అయ్యింది అన్నమాట !

అసలు భారతదేశంలో బిబిసి అవసరం ఎందుకు ? భారత్ లో ఇప్పటికే అవసరానికి మించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఉన్నాయి కదా ?

డేవిడ్ రుట్లే కధనం ప్రకారం బ్రిటన్ FCDO [[Foreign, Commonwealth & Development Office] ఇస్తున్న నిధులతో మొత్తం 12 భాషలలొ బిబిసి వరల్డ్ న్యూస్ తన కార్యకలాపాలని నిర్వహిస్తున్నది! ఈ 12 భాషలలొ నాలుగు భారతీయ భాషలు. తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషలలొ బిబిసి పనిచేస్తున్నది.

త రెండు దశాబ్దాలకి పైగా గుజరాత్ లో బిజేపి అధికారంలో ఉన్నదని అక్కడ బిబిసి పనిచేస్తున్నదా ? రెండు తెలుగు రాష్ట్రాలలో బిజేపి అధికారంలోకి రాకుండా బిబిసి పనిచేయడానికి కంకణం కట్టుకున్నదా ? భారత దేశ ఆర్ధిక రాజధాని అయిన మహారాష్ట్రలో బిజేపి పట్టు సాధించకుండా ఉండడానికి బిబిసి పనిచేస్తున్నదా ? పంజాబ్ ఏమంత పెద్ద రాష్టమని బిబిసి అక్కడ పనిచేస్తున్నది ? తమిళనాడులో ఎందుకు బిబిసి లేదు ? అక్కడ DMK కి అడ్డంకులు సృష్టించకూడదు అనే అజెండా ఏమన్నా ఉందా ? కేర లో బిబిసి ఎందుకు లేదు ?

***********************

డేవిడ్ రుట్లే చాలా ఖచ్చితంగా చెప్పేశాడు !

భారత్ లో మా [బ్రిటన్ ] మాట వినిపించాలి. అదీ స్వతంత్ర్య మాట [independent voice ] వినిపించాల్సి ఉంది మరియు ఇది చాలా ముఖ్యం అంటున్నాడు… భారత్ లో మీ మాట ఎందుకు వినిపించాలి ? మా దేశ ప్రజల అభిప్రాయాలు ఏమిటో చెప్పడానికి మాకు ప్రసార మాధ్యమాలు ఉన్నాయి కదా ?

బ్రిటన్ యొక్క ఇండిపెండెంట్ వాయిస్ అంటే భారత్ దేశ అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులని లెక్క చేయకుండా బ్రిటన్ యొక్క వాయిస్ ని వినిపించడానికా ? లేక బ్రిటన్ కి వత్తాసు పలుకుతూ నిత్యం భారత్ మీద విషం కక్కే ఓ జాతీయ పార్టీ బానిసలు గత 9 ఏళ్ల నుండి అధికారంలో లేకుండా ఉన్నందుకా ? గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లతో పాటు భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులని కాదని, గుజరాత్ అల్లర్లకి మోడీజీ బాధ్యుడు అంటూ మీకు మీరే నిర్ధారించుకుని దానిని డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేయడం, మరో దేశపు సార్వభౌమత్వాన్ని సవాలు చేయడం ప్రజాస్వామ్యం అవుతుందా ?

బిబిసి డాక్యుమెంటరీ మీద బ్రిటన్ ప్రధాని ఋషి శునాక్ బిబిసి డాక్యుమెంటరీని బ్రిటన్ ప్రధానిగా నేను సమర్ధించట్లేదు అని అన్నాడు ! ఋషి శునక్ ఇలా అన్న వారం తరువాత ఉత్తర ఐర్లాండ్ MP అయిన జిమ్ షానాన్ [Northern Ireland MP Jim Shannon] అత్యవసరంగా దీనిమీద హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రశ్నించాలి అంటూ ప్రకటన చేశాడు. డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ సభ్యుడు [Democratic Unionist Party (DUP) జిమ్ షానాన్ భారత ప్రభుత్వం బిబిసి మీద వివక్ష చూపిస్తూ ఆదాయపన్ను శాఖ ద్వారా బిబిసిని అణిచివేయాలని చూస్తున్నదనీ, దీని మీద బ్రిటన్ ప్రభుత్వం కానీ హౌస్ ఆఫ్ కామన్స్ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం నన్ను కలిచివేస్తున్నది అంటూ వ్యాఖ్యానించిన తరువాతే డేవిడ్ రుట్లే ప్రతిస్పందించాడు !

బ్రిటన్ కి చెందిన లేబర్ పార్టీ సిక్కు MP తన్మన్జీత్ సింగ్ ధేశీ [Tanmanjeet Singh Dhesi] మాట్లాడుతూ మన దేశం [బ్రిటన్ ] భారత దేశానికి ప్రజాస్వామ్య విలువలు, పత్రికా స్వాతంత్ర్యం కానుకగా ఇచ్చింది! వీటిని భారత్ జాగ్రత్తగా కాపాడాల్సిన అవసరం ఉందన్నాడు. అవునా ? భారత్ బ్రిటన్ ల మధ్య 2030 రోడ్ మాప్ కోసం చర్చలు జరుగుతున్న వేళ ఇలాంటి దురదృష్ట కర సంఘటన జరగడం విచారకరం అంటూ డేవిడ్ రుట్లే సన్నాయి నొక్కులు నొక్కాడు…

అవును ! నిజమే కదా ? యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటికి వచ్చాక అతి పెద్ద మార్కెట్ అయిన భారతదేశ అవసరం బ్రిటన్ కి ఉంది. మరి అలాంటప్పుడు ప్రెస్ ఫ్రీడం పేరుతో భారత్ లో చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తే దానిని గట్టిగా ఎదుర్కునే హక్కు భారత దేశానికి ఉంటుంది అని తెలియదా ? మీరు తప్పుడు ఆరోపణలు సాక్షాత్తూ భారత ప్రధానిని ఉద్దేశించి చేశారు అన్నది మరిచిపోయి మీతో భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలా ?

ఇక భారత ఆదాయపన్ను శాఖ విడుదల చేసిన ప్రకటనలో భారత దేశంలో బిబిసి చేస్తున్న కార్యకలాపాలకి, దానికి కాను ఆ సంస్థ చెల్లిస్తున్న పన్నుల మొత్తానికి పొంతన లేకుండా ఉంది !

******************

బ్రిటన్ వల్లే వేస్తున్న ఫ్రీడం ఆఫ్ స్పీచ్ మరియు ఫ్రీడం ఆఫ్ ప్రెస్ డొల్లతనం ఏమిటో తెలుసుకుందాం ! 1922 లో అక్టోబర్ 18 న బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కంపనీ పేరుతో ఒక ప్రైవేట్ వార్తా సంస్థగా స్థాపించబడినది! అయితే ఇందులో కేవలం బ్రిటన్ కి చెందిన పారిశ్రామిక వేత్తలకి మాత్రమే షేర్లు కొనే హక్కు ఉండేలా చేశారు.

బిబిసి స్థాపించిన మొదట్లో ప్రజల నుండి మద్దతు లభించలేదు కానీ 1926 లో బ్రిటన్ లో జరిగిన సార్వత్రిక సమ్మె మీద ప్రసారం చేసిన వార్తలు [రేడియో] ప్రజల దృష్టిని ఆకర్షించాయి. దాంతో అదే సంవత్సరం అంటే 1926 లో అప్పటి బ్రిటన్ పార్లమెంట్ బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని పబ్లిక్ ఎంటిటీ గా మారుస్తూ [under Royal Charter-an instrument of incorporation granted by the ruling monarch] బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ గా మార్పు చేసింది. అలాగని బ్రిటన్ పార్లమెంట్ అజమాయిషీ అంటూ ఏమీ లేదు బిబిసి మీద. ప్రతీ 10 ఏళ్లకి ఒకసారి బ్రిటన్ హోమ్ సెక్రటరీ నుండి లైసెన్స్ తీసుకోవాలి బిబిసి. అలాగే ప్రతీ 10 ఏళ్లకి లైసెన్స్ ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

**************************

కానీ రాయల్ ఛార్టర్ కొన్ని మార్గ దర్శక సూత్రాలని రూపొందించి, వాటి అనుసారంగా బిబిసి నడుచుకోవాలని సూచించింది. వార్తలు పక్షపాతం లేకుండా తగిన ఆధారాలతో తెలియచేయాల్సి ఉంటుంది. కానీ ఈ పని బిబిసి చేస్తున్నది అనుకోవడం భ్రమ. వార్తలు కానీ టివి ప్రసారాల కార్యక్రమాలు ప్రజలకి అర్ధమయ్యేలా గ్రేట్ బ్రిటన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం సజావుగానే చేస్తున్నది కానీ సెలక్టివ్ గా తన అజెండాకి సూట్ అయ్యేవిధంగా ప్రసారం చేస్తూ వస్తున్నది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions