.
ఢిల్లీలోని ఎన్.ఐ.ఏ (NIA) ప్రత్యేక కోర్టు మార్చి 24, 2026న (అంటే నిన్న) ఆసియా అంద్రబీకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది… ఆమెతో పాటు ఆమె సహచరులు సోఫీ ఫెహ్మీదా, నహిదా నస్రీన్లకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది… భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, ఉగ్రవాద కుట్రలు పన్నడం వంటి అభియోగాలపై వీరు దోషులుగా తేలారు…
-
దుఖ్తరన్-ఎ-మిల్లత్ (Dukhtaran-e-Millat)…: 1987లో ఆమె ఈ మహిళా వేర్పాటువాద సంస్థను స్థాపించింది…. “దుఖ్తరన్-ఎ-మిల్లత్” అంటే ‘జాతి పుత్రికలు’ అని అర్థం… ఈ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించింది…
-
పాకిస్తాన్ పట్ల అనుకూలత…: ఆమె కాశ్మీర్ను పాకిస్తాన్లో కలపాలని బహిరంగంగానే వాదించేది… ప్రతి ఏటా ఆగస్టు 14న (పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం) కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగురవేస్తూ, పాకిస్తాన్ జాతీయ గీతాన్ని పాడేది… దీనికి సంబంధించిన వీడియోలు కూడా గతంలో బయటకు వచ్చాయి…
-
గోవధ, బీఫ్ ఫెస్టివల్…: 2015లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు గోవధను నిషేధించినప్పుడు, దానికి నిరసనగా ఆమె బహిరంగంగా ఆవును కోసి ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది… ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది…
-
పాకిస్తాన్ నేతలతో సంబంధాలు…: విచారణలో భాగంగా బయటపడిన వివరాల ప్రకారం, ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఐ.ఎస్.ఐ (ISI) అధికారులతో క్రమం తప్పకుండా సంబంధాలు కలిగి ఉండేది… కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ మరింత కఠినంగా వ్యవహరించాలని వారికి లేఖలు రాసేది…
-
భారత వ్యతిరేకత…: భారత్ పట్ల, హిందూ ధర్మం పట్ల ద్వేషాన్ని చిమ్ముతూ సోషల్ మీడియా (Twitter, Facebook) ద్వారా యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేది… అందుకే ఆమెపై ‘వేజింగ్ వార్ అగైనస్ట్ ఇండియా’ (భారత దేశంపై యుద్ధం ప్రకటించడం) వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి…
మొత్తానికి, ఆమెపై ఉన్న ఆరోపణలు కేవలం మాటలు, ప్రచారాల్లో మాత్రమే కాదు, కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నిరూపితం కావడంతోనే ఈ కఠిన శిక్ష పడింది….
Ads
ఎన్.ఐ.ఏ (NIA) ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులోని ప్రధానాంశాలు…
1. భారత దేశంపై యుద్ధం ప్రకటించడం (Waging War): భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం, ప్రజలను రెచ్చగొట్టడం, కాశ్మీర్లో అల్లర్లను ప్రోత్సహించడం వంటి తీవ్రమైన ఆరోపణలు (IPC సెక్షన్ 121) రుజువయ్యాయి… కేవలం మాటలతోనే కాకుండా, పాకిస్తాన్ సాయంతో ఆయుధ పోరాటాన్ని ప్రేరేపించినట్లు కోర్టు నిర్ధారించింది…
2. ఉగ్రవాద నిధుల సేకరణ (Terror Funding)…: ఆమె విదేశాల నుండి, ముఖ్యంగా పాకిస్తాన్ నుండి నిధులను స్వీకరించి, వాటిని కాశ్మీర్ లోయలో అశాంతి సృష్టించడానికి, రాళ్ళ దాడి (stone pelting) వంటి కార్యకలాపాలకు ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి…
3. సోషల్ మీడియా దుర్వినియోగం…: ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా భారత వ్యతిరేక ప్రచారాన్ని సాగించడం, యువతను జిహాద్ వైపు మళ్లించడం వంటి చర్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది… ఈమె ప్రసంగాలు సమాజ శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది…
4. నిషేధిత సంస్థతో సంబంధాలు….: ‘దుఖ్తరన్-ఎ-మిల్లత్’ అనే సంస్థను ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవడం, లష్కరే తోయిబా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటం వంటి అంశాలను NIA కోర్టు విచారణలో నిరూపించింది…
5. నేరపూరిత కుట్ర (Criminal Conspiracy)…: భారతదేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు భంగం కలిగించేలా ఒక వ్యవస్థీకృత కుట్రను పన్నినట్లు కోర్టు తేల్చింది… ఈ నేరాల తీవ్రత దృష్ట్యా ఆమెకు సమాజంలో తిరిగే హక్కు లేదని భావిస్తూ ‘యావజ్జీవ కారాగార శిక్ష’ విధించింది…
6. సహ నిందితుల పాత్ర…: ఆమె ప్రధాన అనుచరులైన సోఫీ ఫెహ్మీదా, నహిదా నస్రీన్లు కూడా ఈ కుట్రలో చురుగ్గా పాల్గొన్నారని, అంద్రబీకి కుడిభుజాలుగా వ్యవహరించారని కోర్టు పేర్కొంటూ వారికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది….
Share this Article