.
Subramanyam Dogiparthi …….. అనగనగా ఓ యంపి గారు (గొల్లపూడి). జాతీయ జండాకు ఎన్ని రంగులంటే నాలుగు రంగులు అని చెప్పే ఓ మాజీ MLA (అల్లు రామలింగయ్య) యంపి గారికి తోక . తనకు తానే దేశ్ కీ నేతా అని కూడా చెప్పుకుంటూ ఉంటాడు .
ఇద్దరూ కలిసి ఊళ్ళో అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు . వీళ్ళని ప్రతిఘటిస్తూ రాబిన్ హుడ్ పాత్రలో మన కథానాయకుడు (బాలకృష్ణ) ఉంటాడు . హీరో గారి అక్క (శారద) జడ్జి . హీరో గారి అన్న మోహన్ (చంద్రమోహన్) .
Ads
యంపి గారు కొడుకుతో (బాలాజి) కలిసి కోడలిని హత్య చేస్తాడు . కోర్టులో ఏమడిగినా నాకు తెలీదు నాకు తెలీదు అనే చెపుతుంటాడు . (ఇప్పుడు కూడా అంతేకదా, ఏ విచారణ అయినా, ఏ దర్యాప్తు అయినా నాకు తెలియదు, గుర్తులేదు అనే జవాబులే చెబుతుంటారు పెద్దలు)… పైపెచ్చు రివర్సులో బాధితులకే హత్యను చుట్టే ప్రయత్నం చేస్తాడు . యంపి గారు కదా ! కథానాయకుడు తన ధైర్యసాహసాలతో ఇద్దరు విలన్లను బంధించి సాక్ష్యాలతో సహా కోర్టుకు అప్పచెప్పి శిక్ష పడేలా చేస్తాడు .
సురేష్ ప్రొడక్షన్స్ బేనరుపై రామానాయుడు గారు నిర్మించిన ఈ సినిమాకు కధను , డైలాగులను పరుచూరి బ్రదర్స్ అందించారు . బాలకృష్ణ , శారదల కోసమే కధను నేసారు . మంగమ్మ గారి మనమడు ప్రభంజనం తర్వాత వచ్చిన ఈ సినిమాకు కూడా ఆ ఊపు కొనసాగింది . వంద రోజులు ఆడింది . హైదరాబాద్ , విజయవాడల్లో 175 రోజుల పోస్టర్ కూడా పడింది . కె మురళీమోహన రావు దర్శకులు .
రాజకీయ నాయకుల మీద చెణుకులు పుష్కలంగా ఉంటాయి . పరుచూరి బ్రదర్స్ రాజకీయ నాయకుల్ని ఉతికి ఉతికి ఆరేస్తుంటారు కదా ! ఇవన్నీ నాయకులు సహజంగానే పట్టించుకోరుగా ! మా మాట వింటే ఢిల్లీలో జడ్జి అవుతుంది అనే డైలాగ్స్ నలభై ఏళ్ళ కిందే వ్రాసారు పరుచూరి బ్రదర్స్ .
పరుచూరి గోపాలకృష్ణ రౌడీ గారిగా కూడా నటించారు . రామానాయుడు సినిమాలో కూడా గోపాలకృష్ణ పాత్ర ఎబ్బెట్టుగా అనిపిస్తుంది . ఆయన హావభావాలు , డైలాగులు , యంపి MLA లను కూడా ఆడుకోవటం ఎబ్బెట్టుగానే ఉంటుంది .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . బాలకృష్ణ , విజయశాంతి డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి . కోక డాబుల కోటమ్మో , ప్రేమా ఎక్కడ నీ చిరునామా , దోర ముద్దు పెట్టవే , మొదలెట్టనా పూజ , ఇదేమి దిగులో ఓయమ్మా పాటలు బాగుంటాయి . డ్యూయెట్లలో విజయశాంతి అదరగొడుతుంది .
శారద పాత్ర , ఆమె నటన సినిమాకు హైలైట్ . పరుచూరి బ్రదర్స్ కధంటే ఆమె పాత్ర ఎలివేట్ అవుతుంది కదా ! అందుకు ఆమె న్యాయం కూడా చేస్తుంది . ఈ సినిమాలో ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర సినిమా అంతా చంకలో ఓ బుజ్జోడిని పెట్టుకుని అందరినీ ఎడాపెడా వాయించేసే రమాప్రభ పాత్ర . చాలా బాగా నటించింది . She is a versatile actress .
ఇతర ప్రధాన పాత్రల్లో దేవదాస్ కనకాల , నిర్మలమ్మ , నూతన్ ప్రసాద్ , రాధాకుమారి , పి యల్ నారాయణ , రాజ్యలక్ష్మి , స్వప్న , చలపతిరావు , శ్యామలగౌరి , ప్రభృతులు నటించారు . ప్రతి సినిమాలో లాగానే రామానాయుడు గారు తళుక్కుమంటారు .అదాయన సెంటిమెంట్ కదా !
తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమాను హిందీలో కూడా రీమెక్ చేసారు . మిథున్ చక్రవర్తి , మీనాక్షి శేషాద్రి , స్మితాపాటిల్ ప్రధాన పాత్రల్లో నటించారు . సినిమా యూట్యూబులో ఉంది . బాలకృష్ణ , విజయశాంతి అభిమానులు చూడవచ్చు . వాళ్ళిద్దరి పరస్పర టీజింగ్ , రొమాన్స్ అభిమానులకు బాగా నచ్చుతుంది .
It’s a total commercial entertainer packed with action , romance and court hall drama . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
కథానాయకుడు అని ఎన్టీఆర్ సినిమా కూడా ఒకటి ఉంది… అది 1969… ఇది బాలకృష్ణ కథానాయకుడు సినిమా… ఇది 1984… ఇదే బాలకృష్ణ నాయకుడిగా ఎన్టీఆర్పై తీసిన బయోపిక్ టైటిల్ కూడా కథానాయకుడే…
Share this Article