.
నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశ్చర్యపరిచింది, అభినందించేలా వ్యవహరించింది… ప్రతిపక్షాలను షాక్కు గురిచేసింది… విశేషమే… ఎందుకో చెప్పాలంటే..?
రైతు భరోసా నిధుల్ని… పొలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా… అందరికీ… ఒకేసారి, అంటే తొమ్మిది రోజుల్లో ఏకంగా 9 వేల కోట్లను పంపిణీ చేసింది… అదీ ఎకరానికి 12 వేల చొప్పున… కేసీయార్ ప్రభుత్వంలాగా 10 వేలు కాదు… ఈ సర్కారు 12 వేలు ఎకరానికి… ఎందుకు విశేషమో చెప్పాలంటే..?
Ads
బీఆర్ఎస్ హయాంలో దాదాపు నెలరోజుల పాటు, ఏటా రెండు దఫాలుగా పంపిణీ జరిగేది… కానీ ఈయన ఏదో ప్రకటించాడు గానీ, వారం పదిరోజుల్లో ఏకంగా 9 వేల కోట్ల నిధుల్ని సమీకరించి, రైతులకు పంపిణీ చేయడం సాధ్యమేనా అని సందేహించారు చాలామంది… ఎందుకంటే, పాత కేసీయార్ పాలన వైఫల్యాల పుణ్యమాని రాష్ట్ర బడ్జెట్ చాలా దారుణమైన స్థితిలో అప్పగించబడింది ఈ సర్కారుకు…
సిక్స్ గ్యారంటీల్లో ప్రతిదీ ఏదోలా కాస్త వెనకో ముందో అమలు చేస్తూ వస్తున్నారు, కానీ ఈ రైతు భరోసా నిధులు ఇప్పట్లో అయ్యే పని కాదని అనుకున్నారు చాలామంది మీడియా, పొలిటికల్ అనలిస్టులు ప్లస్ బ్యూరోక్రాట్లు కూడా… దీన్ని పట్టుకుని మళ్లీ రేవంత్ రెడ్డి మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టాలని బీఆర్ఎస్ కాచుక్కూర్చున్న సంగతి కూడా తెలిసిందే కదా…
ఇప్పుడు ఏదో ఒకటి కావాలని పొలిటికల్ ఫాయిదా కోసం హరీశ్ రావు ఏదో మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు తప్ప తనకూ తెలుసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి 9 వేల కోట్లను సమకూర్చుకుని పంపిణీ చేయడం ఎంత పెద్ద టాస్కో…
కేసీయార్ స్టయిల్ ఏమిటో చూశాం కదా పదేళ్లు… అరకొరగా డబుల్ బెడ్ రూం ఇళ్లు, విపరీతమైన ప్రచారం, ఆ కొద్ది ఇళ్లు కూడా నాసిరకం కట్టడాలు… హుజూరాబాద్ ఎన్నికలో లబ్ది కోసం దళితబంధు ప్రకటించి, అదీ అరకొరగా అమలు చేసి, తరువాత చాపచుట్టేసి అటక మీద పారేశాడు…
నిరుద్యోగ భృతి లేదు, సరే, ఏవేవో చెప్పాడు కేసీయార్.., తీరా ఎన్నికల ముందు కూడా ఏవేవో అలవికాని వాగ్దానాలు చేశాడు… కాంగ్రెస్ నా వాగ్దానాలను, మేనిఫెస్టోను కాపీ కొట్టింది అని కూడా అన్నాడు… నిజానికి మేనిఫెస్టో అనేది పవిత్ర గ్రంథమేమీ కాదు, అదీ బడ్జెట్లాంటిదే…
స్థూలంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యాలు, అడుగులు ఏమిటో చెబుతుంది… డబ్బుంటే, అవకాశముంటే ఎవరెవరికి ఎంత మేలు చేస్తామో చెప్పే డాక్యుమెంట్… కానీ బీఆర్ఎస్ తన పాత మేనిఫెస్టోలను కూడా పార్టీ వెబ్సైట్ల నుంచి మాయం చేసింది… ఎందుకలా..? ఎందుకు చేయలేదు అని జనం అడుగుతారని భయం…
చేస్తే చేశామని క్రెడిట్ తీసుకోవచ్చు, లేదా ఎందుకు చేయలేకపోయామో చెప్పొచ్చు… అది స్ట్రెయిట్ అండ్ ఫెయిర్ ఆచరణ.., మరెందుకు ఉలికిపాట్లు… పోనీ, కష్టమైనా సరే, ఎక్కడా అప్పులు పుట్టలేని స్థితిలో కూడా రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 9 వేల కోట్లను పంపిణీ చేయడం చిన్న విషయమేమీ కాదుగా... ఉన్నదున్నట్టు చెప్పుకుంటే..!! ఐనా ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంటుంది బీఆర్ఎస్...
రాష్ట్రంలో మ్యాగ్జిమమ్, 90 శాతం దాకా రైతులు 5 ఎకరాల్లోపు చిన్న, సన్నకారు రైతులే… వాళ్లకు వర్షాలు కురిసే సమయంలో, ఎకరానికి ఇంత డబ్బు ఒకేసారి రావడం ఖచ్చితంగా వ్యవసాయానికి సాయం చేయడమే… పెట్టుబడిసాయం అనండి, ఇంకే పేరు పెట్టినా సరే… ఐతే పండిన పంటకు మద్దతు ధర పెంచడం బెటర్ కదా, నిజంగా ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకే మేలు అంటారా..? అదీ నిజమే… అది వేరే చర్చ…
Share this Article