Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనా తొత్తుగా బతికినా సరే… చివరకు కష్టకాలంలో అదీ వదిలేసింది…

July 15, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ………. సంక్షోభంలో ఉన్న శ్రీలంకని వదిలి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే బతుకుజీవుడా అంటూ పారిపోయాడు ! సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలని వాళ్ళ కష్టానికి వాళ్ళని వదిలేసి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే పారిపోయాడు… గత వారం రోజులుగా ప్రజలు శ్రీలంక అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని కార్యాలయం మీద దాడి చేసి అక్కడే ఉండి పోయారు. అప్పటికే రణీల్ విక్రమ సింఘే రాజీనామా చేసి వెళ్ళిపోవడం, మరోవైపు గోటబయ అధ్యక్ష భవనం హడావిడిగా ఖాళీ చేసి రహస్య ప్రాంతానికి వెళ్ళిపోవడంతో, ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా తప్పించుకున్నాడు.

గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న గోటబయ రాజధాని కొలంబోలో ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయం ద్వారా అమెరికా వెళ్ళడానికి అనుమతి కోరాడు అయితే గోటబయ రాజపక్షే దగ్గర అమెరికా ఇచ్చిన వీసా ఉంది కానీ అమెరికాలో ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మరోవైపు భారత దేశ విదేశాంగ కార్యాలయానికి ఫోన్ చేసి, శ్రీలంక ఎయిర్ఫోర్స్ కి చెందిన AN 32 విమానoలో భారత దేశ సివిలియన్ ఎయిర్ పోర్ట్ లో దిగడానికి అనుమతి కోరాడు కానీ భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో గోటబయ రాజపక్షే మాల్దీవులలో ఆశ్రయం పొందాడు కానీ అక్కడా ప్రజలు నిరసనకి దిగడంతో మొదట సౌదీ వెళ్లాలని అనుకున్నా బహుశా అనుమతి దొరకక చివరకి సింగపూర్ కి వెళ్ళాడు.

గోటబయ చేసిన మరో తప్పిదం ఏమిటంటే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా దేశం వదిలి వెళ్ళిపోవడం. ఇప్పుడు శ్రీలంకలో పరిపాలన చేయడానికి మంత్రులు అంటూ ఎవరూ లేకపోవడంతో సైన్యం దేశాన్ని తన అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ సైన్యం మాత్రం ఏం చేయగలుగుతుంది ? అన్నీ సవ్యంగా ఉండి ఉంటే సైన్యం పరిపాలన చేయగలుగుతుంది కానీ లంక సెంట్రల్ బాంక్ లో డాలర్లు లేవు. ఇక పెట్రోల్, డీజిల్ నిల్వలు రేషన్ పద్ధతిలో ఇస్తున్నారు.

ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నా క్యూ ఉన్న వాళ్ళకి కనీసం 2 లీటర్ల పెట్రోల్ దొరకడానికి రెండు రోజులు పడుతున్నది. విద్యుత్ సరఫరా అయితే రోజులో కొన్ని గంటలు మాత్రమే సరఫరా అవుతున్నది. ఇక నిత్యావసర వస్తువుల ధరలు 300% పెరిగిపోయాయి. శ్రీలంక ద్రవ్యోల్బణం రేటు వచ్చేసి ప్రస్తుతం 54.6% గా ఉన్నది. ఈ పరిస్థితుల్లో సైన్యం దేశాన్ని అధీనంలోకి తీసుకున్నా పరిస్థితిలో మార్పు ఉండదు, పైగా విదేశీ సహయం చేయడాని ఏ దేశం కూడా ముందుకు రాదు సైన్యం చేతిలో అధికారం ఉంటే !

Ads

సహాయం చేయడానికి ప్రస్తుతం ఏ దేశం కూడా సిద్ధంగా లేదు శ్రీ లంకకి ! బహుశా శ్రీలంక ప్రతిపక్షం నుండి ఎవరినన్నా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అదీ అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతులకి ఒప్పుకుంటే తప్పితే బెయిల్ అవుట్ పాకేజీ ఇవ్వదు. శ్రీలంకకి నేడు ఈ దుస్థితి రావడానికి ప్రధాన కారణం కేవలం కుటుంబ రాజకీయాలే ! స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అయితే బండారు నాయకే కుటుంబము లేకపోతే రాజపక్ష కుటుంబాలే శ్రీ లంకని పరిపాలిస్తూ వచ్చాయి.

విదేశీ అప్పులు 54 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు తీసుకున్నవి కావు. గత మూడు దశాబ్దాలుగా IMF తో పాటు ఆసియా డెవలప్ బాంక్ [ADB] ల నుండి తీసుకున్నవే. ఇక శ్రీలంక ప్రభుత్వ బాండ్ల ని ప్రతీ సంవత్సరం విదేశీ మార్కెట్లలో అమ్ముతూ వచ్చింది అదీ ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తామనే హామీతో… శ్రీలంక ప్రభుత్వ బాండ్లని ఎక్కువగా కొన్నవి యూరోపియన్ దేశాలు… వాటి కాల పరిమితి తీరిపోయి చాలా రోజులు అయిపోయాయి కానీ అసలుతో పాటు వడ్డీ కలిపి ఇవ్వాల్సి ఉండగా మళ్ళీ వాటినే మరింత ఎక్కువ వడ్డీ కి తిరిగి అమ్మింది శ్రీలంక ప్రభుత్వం. ఇదంతా జరగడానికి 30 ఏళ్లు పట్టింది.

శ్రీలంక ప్రజల ముందు చూపు : తమ దేశ అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టినపుడు భవనం లోపల కొత్త డాలర్ నోట్ల కట్టలు 50 వేల వరకు దొరికాయి కానీ తరువాత వాటిని అధికారులకి అప్పచెప్పారు ప్రజలు. ఈ లెక్కన చూస్తే అధ్యక్షుడు గోటబయ రాజపక్షే రాజీనామా చేయకుండా అధ్యక్ష హోదాలో దేశం వదిలి ఎందుకు పారిపోయాడో అర్ధం అవుతుంది. ఒక దేశ అధ్యక్షుడి హోదాలో వేరే దేశంలోకి వెళ్లేటప్పుడు గ్రీన్ చానెల్ ద్వారా ఎలాంటి తనిఖీలు చేయకుండా పంపిస్తారు ఈ లెక్కన రాజపక్షే తన కుటుంబ సభ్యులతో విమానంతో పాటు ఎన్ని లక్షల డాలర్లని తీసుకెళ్ళి ఉంటాడో ? తాజావార్త :: సింగపూర్ కూడా ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరించడం లేదట…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions