Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పౌరసత్వ సవరణ చట్టం అమలుకు అంతా రెడీ… బీజేపీ మరో అస్త్రం…

January 29, 2024 by M S R

అయోధ్య రాముడి అక్షింతలు, గుడి ప్రారంభం, ప్రాణప్రతిష్ట అయిపోయాయి… బీజేపీకి రావల్సినంత మైలేజీకన్నా ఎక్కువే వచ్చింది… దానికి విరుగుడు ఏమిటో తెలియక ఇండి కూటమి విలవిల్లాడిపోయింది… ఈలోపు బీజేపీ విసిరిన భారతరత్న దెబ్బకు ఏకంగా ఆ కూటమి నుంచి జేడీయూ బయటపడి, కూటమికి మరో షాక్ తగిలింది…

పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ లేదా ఫుల్ బడ్జెట్ పెట్టేసిన వెంటనే ఎన్నికల సంఘం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగించబోతోంది… మరి ఎన్నికలకు ముందు మరో బాంబ్ ఏమైనా వేయబోతోందా బీజేపీ… చూడబోతే సీఏఏ అలియాస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్టు కనిపిస్తోంది…

బెంగాల్‌కు చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాక్‌ద్వీప్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ… ‘నాదీ గ్యారంటీ… సీఏఏ వారం రోజుల్లో అమలుకు రాబోతోంది… అంతా రెడీ’ అన్నాడు… ‘బెంగాల్‌లో మాత్రమే కాదు, దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తాం, మన హోం మంత్రి అమిత్ షా చెప్పింది కూడా ఇదే’ అని పొడిగించాడు…

Ads

మొన్నటి డిసెంబరులో సీఏఏను బలంగా వ్యతిరేకించిన మమతా బెనర్జీని ఉద్దేశించి కలకత్తా ర్యాలీలో మాట్లాడుతూ ‘ఎవరూ సీఏఏ అమలు గాకుండా ఆపలేరు… కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయబోతోంది’ అని ప్రకటించాడు… ఆ ర్యాలీలో ఆయన బెంగాల్‌లోకి జొరబాట్లు, ఆ ప్రభుత్వ అవినీతి, రాజకీయ హింస, మైనారిటీల బుజ్జగింపు వంటి చాలా విషయాల్లో ఆమెను టార్గెట్ చేస్తూ ప్రసంగించాడు… 2026 ఎన్నికల్లో ఆమెను గద్దె దింపాల్సి ఉంటుంది, రెడీగా ఉండండీ అని ప్రజలకు పిలుపునిచ్చాడు… సరే, అదంతా వేరే కథ…

2019లో పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ బిల్లు పాసయ్యాక, రాష్ట్రపతి ఆమోదం కూడా వెంటనే లభించింది… కాకపోతే ఆ తరువాత దేశవ్యాప్తంగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశాయి… పలు సెక్షన్ల నుంచి భయాందోళనలు వ్యక్తమయ్యాయి… దానికి సరైన, సంతృప్తికరమైన జవాబు బీజేపీ శిబిరం నుంచి రాలేదు… నిజానికి ఇలాంటి సందర్భాల్లో అన్ని సెక్షన్లనూ కాన్ఫిడెన్సులోకి తీసుకుంటూ… అఖిల పక్ష భేటీలు, మీడియా భేటీల్లో సందేహనివృత్తి చేయాల్సి ఉండింది… కానీ జరగలేదు…
ఆ తరువాత న్యూస్ ఏజెన్సీ ఓ ఉన్నతాధికారి చెప్పాడంటూ ఓ స్టోరీ రిలీజ్ చేసింది… ‘సీఏఏ రూల్స్ అన్నీ రెడీ అయిపోయాయి, సీఏఏ అమలు కోసం ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ కూడా రెడీ అయిపోయింది… దరఖాస్తు నుంచి పౌరసత్వం జారీ వరకు మొత్తం డిజిటల్ ప్రక్రియగానే ఉంటుంది…’’ అని ఆ స్టోరీ సారాంశం… అంతేకాదు, దరఖాస్తుదారులు ఇండియాకు వచ్చిన ట్రావెల్ డాక్యుమెంట్లు సహా మరే డాక్యుమెంట్లు, ఆధారాలు కూడా సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది ఆ స్టోరీ…

ఐతే… రామమందిరం వేరు, పౌరసత్వ సవరణ చట్టం వేరు… రామమందిరం ఇంపాక్ట్ దేశమంతా బలంగా ఉంటుందని బీజేపీ ఆశించి వుండవచ్చు… కానీ పౌరసత్వ సవరణ చట్టం ప్రభావం మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి వచ్చే హిందువులపైనే ఉంటుంది… 2019లో దీనిపై ఉద్యమించిన మమత వంటి విపక్ష పార్టీలు ఇప్పుడు దీన్ని ఎన్నికల ప్రచారాంశంగా మారుస్తాయా..? చూడాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions