Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హిడింబి… మహాభారతంలో ఓ మార్మిక పాత్ర… ఆ గుడిలో దేవత…

April 14, 2025 by M S R

.

చాలామంది ఈ తరం యువతకు ఓ డౌటొచ్చింది… రాక్షస జాతికి చెందిన వేరే పురాణ పాత్రలకూ గుళ్లున్నాయా..? ఇలా అనగానే గుర్తొచ్చేది హిడింబి గుడి… అదే ఎందుకు గుర్తురావాలి..? హిడింబి గుడి ఉన్నది మనాలి‌లో… చాలామంది టూరిస్టులు మనాలి వెళ్తుంటారు కదా, హిడింబి గుడి కూడా వెళ్లొస్తుంటారు… కానీ హిడింబి మన మనిషి, పూజించాల్సిన దేవత ఎలా అయ్యింది..?

మహాభారతంలో ఓ అంతుచిక్కని మార్మిక పాత్ర హిడింబి… తన కళ్ల ముందే తను బాగా అభిమానించే అన్నను చంపిన భీముడిని అక్కడిక్కడే, అప్పటికప్పుడే ప్రేమించేస్తుంది… కొంతకాలం ఇదే అడవిలో ఉంటేనే, హిడింబి సైన్యంతో రక్షణ ఉంటుంది, కౌరవులు ఇటువైపు అస్సలు రాలేరు అనుకున్న కుంతీదేవి లౌక్యంగా ఆ ప్రేమకు ఆమోదం చెప్పి, స్వయంగా పెళ్లిచేస్తుంది… సమాజానికి భిన్నంగా పోవడం కుంతీదేవికి అలవాటే కదా… అలా హిడింబి రాజ్యంలో తలదాచుకుంటారు పాండవులు…

Ads

తరువాత హిడింబిని వదిలేసి, కుంతీ తన కొడుకులతో సహా వెళ్లిపోతుంది… హిడింబి అభ్యంతరపెట్టదు… అప్పటికే గర్భిణి… మళ్లీ ఎప్పుడూ భీముడి ఆచూకీ కోసం కూడా ప్రయత్నించదు… భీముడి మీద ఎంత ప్రేమ అంటే, తను ఆ రాజ్యానికి రాణి కాబట్టి, ఇంకా సంతానం కావాలి బట్టి వేరే మగవాళ్ల తోడుతో వేరే పిల్లల్ని కంటుంది తప్ప పెళ్లి మాత్రం ఇంకెవరినీ చేసుకోదు… అందుకే ఆ పాత్ర అంటే హైందవ సమాజానికి జాలి, ఇష్టం…

తరువాత ఘటోత్కచుడి సాయం కోసం భీముడు మళ్లీ ఆ అడవికి వస్తాడు… అప్పుడూ హిడింబి కోపంగా, ప్రేమగా, ఆర్తిగా కాసేపు కొట్టి, గుద్ది… తరువాత మళ్లీ నన్ను విడిచిపోకోయ్ అన్నంతగా హత్తుకుపోతుంది… అంతేతప్ప తన ప్రియసఖుడికి వ్యతిరేకంగా వ్యవహరించదు… ఘటోత్కచుడిని యుద్ధరంగానికి పంపించడానికి కూడా సమ్మతిస్తుంది…

తను పాండవుల పక్షాన పోరాడి, చివరకు హతమారిపోతాడు… ఘటోత్కచుడి కొడుకుల్నీ యుద్ధానికి పంపిస్తుంది… జరిగిన నష్టానికి హిడింబి పాండవులను నిందించదు… బతికిన మనమడు మేఘవర్ణుడిని ఘటోత్కచుడి స్థానంలో రాజును చేస్తుంది… హస్తిన అధికారం కోసం అర్రులు చాచలేదు…

ఈ కారణాలకు తోడు ఆమె ఆర్యుడిని పెళ్లిచేసుకోవడంతో ఇంటి కోడలు అయిపోయింది… అందుకే ఆమె ఉత్తర హైందవులకు ప్రీతిపాత్రమైంది… హిందువులు ఎవరికైనా గుడి కట్టేయగలరు… హిడింబికీ కట్టేశారు… మరి మనాలిలోనే ఆ గుడి ఎందుకుంది..?

కురుక్షేత్రం తరువాత మేఘవర్ణుడికి రాజ్యం అప్పగించి, మనాలీలోనే తపస్సు చేసుకుంటూ గడిపిందని స్థలపురాణం… గుడి సాదాసీదా ఉంటుంది… చెక్కలతో కట్టారు… మనాలీ నుంచి కాలినడకన వెళ్లిరావచ్చు… ఈ గుడి నుంచి 70 మీటర్ల దూరంలో ఘటోత్కచుడికీ ఓ చిన్న గుడి ఉందట… దాని వివరాలు పెద్దగా తెలియవు…

ఇక్కడ డూన్గరి మేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది… ఈ మేళాలో అక్కడి ఆడ పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో తయారై, హిడింబి దేవి అనుగ్రహం కోసం నృత్యం చేస్తారు. వసంత ఋతువులో జరిగే ఉత్సవం కావటం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి హిడింబి దేవిని పూజిస్తారు… హిందువులు ఎవరినైనా తమలో కలిపేసుకోగలరు… అది మతాన్ని పరిపుష్టం చేసింది… అదేసమయంలో అది బలహీనతగా మారింది కూడా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions