.
ఉండవల్లి అరుణ్కుమార్… ఈ మాజీ ఎంపీ, నాటి సీఎం వైఎస్కు అత్యంత సన్నిహితుడు… ఆయన కొడుకు జగన్తో పెద్ద సత్సంబంధాలు పెట్టుకోనివాడు… తెలంగాణ వ్యతిరేకి… రామోజీరావు బద్ధ విరోధి…
అన్నింటికీ మించి బ్రహ్మాండమైన లా పాయింట్లు ఆలోచించగలిగే మేధావి… వ్యక్తిగత ఆరోపణలేవీ కనిపించవు… కానీ జనమంతా ఒకవైపు చూస్తుంటే, ఒకటి నమ్ముతుంటే, దానికి భిన్నంగా ఆలోచించగలడు… చూడగలడు… లోకం ఆశ్చర్యంగా చూసినా సరే…
Ads
తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్లయినా సరే… స్టిల్, ఈ ఏర్పాటు చట్టవిరుద్ధం అనీ, విహిత పద్దతికి విరుద్ధంగా జరిగిందనీ వాదిస్తాడు… సుప్రీంలో ఓ కేసు కూడా ఉన్నట్టుంది… లోకమంతా నిజం అనుకున్నది అబద్ధమనీ, అబద్ధం అనుకున్నది నిజమనీ బలంగా వాదించగలడు…
తాజాగా సాక్షిలో ఓ వ్యాసం రాశాడు… సాక్షి మాత్రమే పబ్లిష్ చేయగలదు ఇలాంటి వాదనల్ని… ఏమంటాడయ్యా అంటే… ఎహె, అందరూ ఎమర్జెన్సీని రాజ్యాంగ విరుద్ధం అనీ, చీకటిరోజులనీ తిట్టిపోస్తున్నారు గానీ… తప్పు… అప్పట్లో ఇందిరా గాంధీకి అంతకుమించి గత్యంతరం లేదు, ఎమర్జెన్సీ విధింపు రాజ్యాంగ వ్యతిరేకం కూడా కాదని చెప్పుకొచ్చాడు…
ఇంట్రస్టింగు… కొన్ని నిజమే అనిపిస్తాయి పాయింట్లు… 1) ఆమె మొరార్జీ పోర్ట్ఫోలియోలు పీకిపారేసింది కాబట్టి ఆయన గుజరాత్లో ఏదో ఓ చిన్న ప్రజావ్యతిరేకతను (ఆ రాష్ట్రంలో హాస్టల్ మెస్ ఛార్జీల పెంపు) ఎగదోశాడు… కోపంతో… 2) దానికి ఇందిరను వ్యతిరేకించే శక్తులన్నీ వంతపాడాయి… 3) ఈలోపు ఓ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లనేరదని తీర్పు చెప్పడంతో ఇక ఆ శక్తులన్నీ వీరంగం పాడాయి…
4) జయప్రకాష్ నారాయణ ఆ ఇందిర వ్యతిరేకతను (ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కాదు, జస్ట్, ఇందిర వ్యతిరేక ఉద్యమం) పోరాటం స్థాయికి తీసుకుపోయాడు… 5) ఆమెకు తప్పలేదు, రాజీనామా చేసి, రాజకీయాల నుంచి పారిపోవడమో లేదా ఎదురు తిరిగి పోరాడటమో… 6) ఆమె ఎమర్జెన్సీ నిర్ణయం అక్షరాలా రాజ్యాంగబద్ధమే… 352(1) ప్రకారమే…
7) కేబినెట్ ఆమోదించింది, రాష్ట్రపతి సంతకం చేశాడు… 8) పోనీ, ఆమె నిజంగానే చీకటి రోజుల్ని పాలించిందీ అనుకుందాం… మరి ఏపీలో 42 సీట్లకు గాను 41 సీట్లు ఆమె గెలవగలిగింది, దక్షిణ భారతం తనను ఎందుకు వ్యతిరేకించలేదు..? మనం ఆ చీకటినే ఇష్టపడ్డామా..? 9) రెండున్నరేళ్లకే ఇందిర వ్యతిరేక కూటమి కుక్కలు చింపిన విస్తరి అయిపోయి, మళ్లీ ఆ ఇందిరే కావాలని దేశం కోరుకుంది… 10) అసలు ఎమర్జెన్సీ విధించకపోతే ఆమె ఒక్కరోజైనా పాలించే స్థితి ఉందా అప్పట్లో…?
సరే, ఇవన్నీ నిజమే అనుకుందాం… కానీ ఎమర్జెన్సీ రోజుల్లో అధికార యంత్రాంగం దేశమంతా అమలు పరిచిన నిర్బంధం, అరాచకం మాత్రం నిజమే కదా ఉండవల్లి సాబ్..? స్వేచ్ఛ, ప్రజాస్వామిక వాతావరణం మచ్చుకైనా కానరాని రోజులే కావా అవి..? ఏమో, కాంగ్రెస్ కూడా ఎమర్జెన్సీ తప్పని, సారీ చెప్పాక ఇక దానిపై చర్చలే అనవసరం ఏమో కదా… తెలంగాణ ఏర్పాటు సరిగ్గా లేదంటూ మళ్లీ మళ్లీ వాదించడంలాగే..!!
కానీ ఏమాటకామాట… ఒక శశిధరూర్, ఒక ఉండవల్లి… ఇలా కొందరు ఉంటారు… సమాజానికి భిన్నమైన సూక్ష్మ దృష్టి కలిగినవారు అవసరం… అఫ్కోర్స్, మన పార్టీలు వాళ్లను సహించినా లేకపోయినా… కాపాడుకున్నా లేకపోయినా..!! అవును, మనం వాళ్ల ఆలోచన ధోరణులతో ఏకీభవించినా లేకపోయినా..!! నిష్ఠురంగా ఉన్నా ఓ నిజం ఏమిటంటే..? ఈరోజుకూ మన దేశానికి ఇందిర తీసుకొచ్చిన ఎమర్జెన్సీ మరో ఇరవై ఏళ్లు అవసరం ఉందని చాలామంది నమ్మడం..!!
ఎమర్జెన్సీ విధింపు తరువాత… ఇన్నిరోజుల్లో దానికి వ్యతిరేకంగా, అది అక్రమం, అవాంఛనీయం అంటూ కొన్ని లక్షల వార్తలు, అభిప్రాయాలు గట్రా దేశ ప్రజానీకం మెదళ్ల మీద అకారణంగా రుద్దబడ్డాయి అంటారా మిస్టర్ ఉండవల్లీ..!?
Share this Article