.
పార్థసారథి పొట్లూరి… బిన్ లాడెన్ ఆఫ్ఘానిస్థాన్ లోని ఎడారి ప్రాంతంలో ఒక కొండ గుహలో ఉన్నాడని ఇంటెలిజెన్స్ సమాచారం రాగానే… అప్పటికప్పుడు ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్న అమెరికన్ సైనిక వ్యూహకర్తలు, పెంటగాన్ లో ఉన్న వ్యూహకర్తలు లాడెన్ ని చంపెందుకు రకరకాల ప్లాన్స్ వేశారు…
చివరికి అంత సమయం లేదని గ్రహించి, బంకర్ బస్టర్ బాంబుతో కొండని పేల్చేయాలని నిర్ణయించుకొని, వెంటనే అప్పటికే ఖతార్ లో ఉన్న B2 స్పిరిట్ బాంబర్ లో GBU-57 బాంబుని లోడ్ చేసి ఆఫ్ఘానిస్తాన్ లో లాడెన్ ఉన్న కొండ గుహని పేల్చేసారు!
Ads
ఈ మొత్తం ఆపరేషన్ ని వీడియో తీశారు అప్పట్లో!
GBU 57 తో దాడి చేసిన తరువాత చూస్తే అప్పటికే లాడెన్ అక్కడి నుండి వెళ్లిపోయాడని తెలిసింది!
కానీ GBU – 57 MOP లాడెన్ ఉన్న గుహని ఎంత తీవ్రంగా నష్టపరచగలిగిందో రీసెర్చ్ కి ఉపయోగపడింది కానీ వాటి వివరాలు బయటికి రాలేదు!
అంతిమంగా 2015 లో నిన్న ప్రయోగించిన GBU-57 MOP బాంబుని అభివృద్ధి చేసి స్టోర్ చేసింది అమెరికా! 2015 తరువాత కొత్తగా ఏవీ తయారుచేయలేదు!
GBU-57 MOP బోయింగ్ సంస్థ తయారు చేసింది!
ఆఫ్ఘానిస్తాన్ కొండ గుహ అనుభవంతో బోయింగ్ కొత్త వర్షన్ GBU-57 MOP ని అభివృద్ధి చేసింది. వార్ హెడ్ ని హై పెర్ఫామేన్స్ స్టీల్ అలాయ్ తో తయారు చేయడం వలన 200 అడుగుల రీ-ఎన్ఫోర్స్డ్ స్టీల్ కాంక్రీట్ ని కూడా సునాయాసంగా చీల్చుకుంటూ వెళ్లి ధ్వంసం చేసింది నిన్న!
ఇరాన్ భూగర్భ అణు కేంద్రాన్ని నిర్మించినపుడు అమెరికా దగ్గర ఉన్న GBU-57 MOP బాంబు మహా అయితే 150 అడుగులు లోతుకు వెళ్ళగలదని అంచనా వేసి, భూమి లోపల 200 అడుగుల మందంతో కాంక్రీట్ వేసింది… కానీ ఇరాన్ అంచనాకి అందని విధంగా ఇజ్రాయేల్ అమెరికాలు ఒక ప్లానింగ్ తో వెళ్లాయి.
జూన్ 16 న ఇజ్రాయేల్ చేసిన దాడిలో 100 అడుగుల కాంక్రీట్ మాత్రమే ధ్వంసం అవగా మిగిలిన 100 అడుగుల కాంక్రీట్ ని నిన్న GBU – 57 MOP లు కూల్చేసాయి…
దాడి ఎలా జరిగింది?
మొత్తం 6 B2 స్పిరిట్ బాంబర్లు ఒక్కోటి రెండు GBU-57 MOP లని తమతో తీసుకొని దాడికి వచ్చాయి. అంటే మొత్తం 12 GBU-57 MOP లతో దాడికి వచ్చాయి. మొత్తం 36 గంటలు ప్రయాణించి రెండు సార్లు గాల్లోనే ఇంధనం నింపుకొన్నాయి అన్నమాట!
రెండో సారి ఇరాన్ గగనతలంలోనే ఇజ్రాయేల్ ట్యాంకర్లు B2 స్పిరిట్ లకి ఇంధనం నింపాయి. అప్పటికే ఇజ్రాయేల్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ని ధ్వంసం చేయడం వలన స్వేచ్ఛగా అమెరికన్, ఇజ్రాయల్ జెట్ ఫైటర్స్, ఇంధనం అందించే టాంకర్లు మరియు గగనతలంలో ఉంటూ నిఘా పెట్టే అవాక్స్ విమానాలు తిరగగలిగాయి!
మొత్తం 6 B2 స్పిరిట్ బాంబర్లు 12 GBU-57 MOP బంకర్ బస్టర్ బాంబులని FORDOW అణు కేంద్రం మీద ఒక దాని తరువాత ఇంకోటిగా వేసాయి.
అదే సమయంలో అమెరికన్ సబ్ మేరైన్లు మొత్తం 30 టోమ్ హాక్ క్రూయిజ్ మిస్సళ్ళ తో NATANZ మరియు ఇస్పహాన్ అణు కేంద్రాల మీద ఏకకాలంలో దాడులు చేసి ధ్వంసం చేశాయి.
ఈ మొత్తం ప్రక్రియని సంవత్సరం ముందే అమెరికా, ఇజ్రాయేల్ కలిసి రిహార్సల్స్ చేశాయి.
ఫోర్ దౌవ్ (FORDOW ) అణు కేంద్రం మీదనే 12 GBU-57 MOP లని ఎందుకు ప్రయోగించారు?
QUOM దగ్గర పర్వతపాదాల దగ్గర రాయిని తొలిచి రెండు వందల మీటర్ల లోతులో FORDOW అణు కేంద్రం నిర్మించింది ఇరాన్.
FORDOW అణు కేంద్రం 2006 లో మొదలు పెట్టి 2012 లో పూర్తి చేసి ఆపరేషన్ లోకి తెచ్చింది ఇరాన్! ఈ అణు కేంద్రమే అత్యంత పటిష్టమైన భద్రత కలిగి ఉంది కాబట్టి 12 GBU-57 MOP లతో ధ్వంసం చేశారు. 2012 లో ఈ అణు కేంద్రం ప్రారంభం అయ్యే నాటికి అయిన ఖర్చు $1.2 బిలియన్ డాలర్లు మరియు 6 సంవత్సరాల కష్టం!
2006 నుండి 2012 వరకూ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఇరాన్ అణు కార్యక్రమానికి ముగింపు పలికి ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా కూడా భాగస్వామి అయ్యింది 1978 తరువాత మొదటిసారిగా!
అఫ్కోర్స్! భూగర్భ బంకర్ లో భయంతో తలదాచుకున్న ఆయుతొల్లా అలీ ఖోమేని తన తరువాతి వారసుడు ఎవరు అన్నది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి తన ముఖ్య అనుచరుల చేతికి ఇచ్చినట్లుగా తెలుస్తున్నది! ఆ లిస్టులో ఖోమేని కొడుకు పేరు లేదు! ఇది చాలు ఇరాన్ ని ఇకముందు ఎవరూ నాశనం చేయనక్కరలేకుండా ఇరాక్ లాగా అంతర్యుద్ధంతో తనంత తానే నాశనం అవుతుంది!
బహుశా 400 బాలిస్టిక్ మీసైళ్ళ ని ఇజ్రాయేల్ మీదకి ప్రయోగించబోతున్నది ఇరాన్!
మరో వైపు అంతర్జాతీయ అణు శక్తి సంఘం ( International atomic Energy Agency – IAEA) తెలుపుతున్న ప్రకారం ఇరాన్ దాడికి ముందే 83.7% శుద్ధి చేసిన యురేనియంని సురక్షితమైన ప్రాంతాలకి తరలించింది..
ఇరాన్ ఈ వార్తని ధ్రువీకరించింది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏమీ అయిపోలేదు! 83.7% ఎన్ రిచిడ్ యురేనియంతో డర్టీ బాంబు తయారు చేసి బాలిస్టిక్ మీసైళ్ళ ద్వారా ప్రయోగించే అవకాశం ఉంది. అణు బాంబు తయారు చేయాలంటే 90% శుద్ధి చేసిన యురేనియం కావాలి! నేటి నుండి ఆయుతోల్లా అలీ ఖోమైనిని వెతికి చంపేసే పనిలో మోస్సాద్ ఉండవచ్చు!
Share this Article