.
Subramanyam Dogiparthi ……. పాపం ! పసివాడు ! ఈ సినిమా కూడా పాపం ఓ పసివాడిదే . ప్రేక్షకుల గుండెను పిండేసే విధంగా ఉంటుంది ఈ పసివాడి పాత్ర . పసివాడు కూడా heart-toucching గానే నటించాడు . పేరు మాస్టర్ అర్జున్ . ఇప్పుడు 45/46 ఏళ్ళకు చేరి ఉంటాడేమో ! చాలా ముద్దుగా , చక్కటి నటనను అందించాడు .
ఓ పచ్చని సంసారంలోకి హఠాత్తుగా ఒక పసివాడు ఎంటర్ అవుతాడు . హీరో గారి గత ప్రియురాలి బిడ్డ . ఆ ప్రియురాలు చనిపోవటంతో ఆ బిడ్డ బాగోగులు ఆమెను ఆదరించిన మాస్టారి పైన పడుతుంది . ఆ బిడ్డను తండ్రి వద్దకు పంపుతాడు .
Ads
ఈ పసివాడిని కుటుంబంలోకి స్వీకరించలేక , కుటుంబం అతలాకుతలం అవుతుంది . తల్లి హితబోధతో ఇల్లు వదలి వెళ్ళిన హీరోయిన్ సర్దుకుని వెనక్కు వచ్చి పసివాడిని కుటుంబంలోకి ఆహ్వానించటంతో సినిమా ముగుస్తుంది .
ఈ సినిమాను ఇప్పుడు చూసే వాళ్ళకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు గుర్తుకొస్తుంది . ఈ ఇల్లాలు ప్రియురాలు సినిమా నైనితాల్ చుట్టూ ఉంటే ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు సినిమా నేపాల్ చుట్టూ ఉంటుంది .
హిందీలో అవార్డులు , డబ్బులు కురిసిన మాసూమ్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా మార్పులు , చేర్పులతో తీసారు . హిందీలో నసీరుద్దీన్ షా , షబానా ఆజ్మీ నటించారు . అయిదు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి .
ఇల్లాలు అని ఉంటే సగం సక్సెస్ అయినట్లే కదా తెలుగులో . కాస్త బాగుంటే మిగతా పని మహిళామ తల్లులు చూసుకుంటారు . ఈ సినిమా ఆ కోవకు సంబంధించిందే . 1+ 2 సినిమా . పైగా శోభన్ బాబు హీరో . శోభన్ బాబు నటన చాలా settled గా ఉంటుంది . మహిళా ప్రేక్షకుల సానుభూతి కూడా పొందుతాడు .
ఆయన ప్రియురాలిగా ప్రీతి అనే నూతన నటి గ్లామర్ స్పేసుని ఫిల్ చేస్తుంది . ఇల్లాలుగా సుహాసిని చక్కగా నటించింది . ఏ జయసుధ అయితే ఇంకా బాగుండేదేమో ! (ఈ ప్రీతి రెండు రెళ్లు ఆరు మినహా మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించినట్టు లేదు… వివరాలూ పెద్దగా నెట్లో దొరకవు…)
ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , శుభ , అన్నపూర్ణ , సుత్తి జంట , మమత , బుల్లి మీనా ప్రభృతులు నటించారు . నైనితాల్ ప్రకృతి అందాలను బాగా చూపించారు . కోదండరామిరెడ్డి మార్క్ బాగా కనిపిస్తుంది . సినిమా భారంగా నడుస్తుంది .
అయినా పాటలు , పిక్చరైజేషన్ మహాత్మ్యాలతో 14 సెంటర్లలో వంద రోజులు ఆడింది . హైదరాబాద్ వెంకటేశ్ థియేటర్లో 175 రోజుల పోస్టర్ కూడా పడింది . బహుశా షిఫ్టులతో రన్ అయి ఉండవచ్చు .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఏమిటో ఈ కలవరం ఏమిటో ఈ కలవరం ఈ క్షణం రసమయం డ్యూయెట్ శోభన్ బాబు , ప్రీతిల మీద నైనితాల్ అందాల్లో చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఆదివారం అర్ధాంగి సాయంకాలం సరసానికి పాటతో హేపీ కుటుంబాన్ని ప్రేక్షకులకు బాగా ప్రదర్శిస్తాడు దర్శకుడు .
తాగితే పాపమా భార్యలకు కోపమా అంటూ సాగే పార్టీ పాటలో సత్యనారాయణ , శోభన్ బాబుల నటన , పాట చిత్రీకరణ బాగుంటుంది . సత్యనారాయణ నటన కూడా సినిమాలో హైలైటే . ఆర్ద్రతతో కూడిన పాట ఏమని తెలిపేది ఎవరని చెప్పేది అంటూ సాగే పాటలో శోభన్ బాబు నటన బాగుంటుంది .
అలాంటిదే మరో పాట ఇది కధ కాదు ఇది అల కాదు పాట . పాటల్ని సి నారాయణరెడ్డి , వేటూరి వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు .
తాగితే పాపమా పాటలో సత్యనారాయణకు చక్రవర్తి గొంతు ఇచ్చారు . సత్యానంద్ డైలాగులు టచీగా ఉంటాయి . ముఖ్యంగా శోభన్ బాబు , అన్నపూర్ణ డైలాగ్స్ .
It’s an emotion-filled , heart-touching , feel good , family sentiment picture . యూట్యూబులో ఉంది . శోభన్ బాబు అభిమానులకు బాగా నచ్చుతుంది . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు (మాస్టర్ అర్జున్ గురించి మరో కథనంలో…)
Share this Article