.
ఓ మిత్రురాలు ఈమధ్య అమెరికా వెళ్లింది… ఆమె బ్యాగులో ఓ యాపిల్ గమనించి అక్కడి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు… ప్రశ్నలేశారు, సతాయించారు… యాపిల్ తెచ్చుకుంటే అంత రచ్చా అనడక్కండి…
అది అమెరికా పెట్టుకున్న పద్థతి… ఏ విత్తనమూ బయటి నుంచి తమ దేశంలోకి రాకూడదు… యాపిల్లో ఉన్న సీడ్స్ పట్ల వాళ్ల అభ్యంతరం..!! దురుద్దేశాలు ఏమీ లేకపోయినా సరే అమెరికా వాడు ఊరుకోడు…
Ads
చింతపండు తీసుకెళ్లాలని అనుకుంటే అందులో గింజలు ఉంటాయని తీసుకురానివ్వడు… విత్తనాలతోపాటు ఏవో తెగుళ్లు వస్తాయని సందేహం… 15 ట్రక్కుల ఇండియన్ మామిడి పళ్లను ఈమధ్యే అమెరికా లోనికి రానివ్వలేదు… సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం అని పైకి చెబుతున్నా జీవభద్రతే దాని అసలు భయం…
అలాంటిది ఎవరో సైంటిస్టులు, అందులోనూ చైనీయులు ఏకంగా ఫంగస్నే తీసుకొస్తే రానిస్తారా..?
ఉగ్రవాదులు వస్తారనే భయసందేహాలతో 12 దేశాల నుంచి జనం రాకడమే నిషేధించిన దేశమది… వాళ్లిష్టం… ఆ పద్ధతి తప్పు, పరిశోధనలకు ఫంగస్ తీసుకొస్తే తప్పేమిటి అనడగడానికి మనమెవరం..? అసలే కరోనా పేరిట ఓ విపత్తును ప్రపంచం మీదకు వదిలిన ధూర్త దేశమది…
అందుకే చైనాది అమెరికాపై అగ్రిటెర్రరిజం అంటోంది ప్రపంచం… ఆ పరిశోధనలు చైనాలో చేసుకోవాలి తప్ప అమెరికాకు పరిశోధనలకు ఆ ఫంగస్ తీసుకొచ్చాం అనే సైంటిస్టుల వాదనలో నిజాయితీ కనిపించడం లేదు… అయితే వాళ్లను అమెరికా అరెస్టు చేశాక… చైనా ఖండించిందో లేదో తెలియదు గానీ చైనాకు వీరప్రేమికులు ఉన్నారు కదా మన దేశంలో… శోకాలు స్టార్ట్ చేశారు…
అసలు అమెరికాయే పెద్ద అగ్రిటెర్రరిస్ట్… అప్పట్లో గోధుమలతోపాటు ఇండియాలోకి పార్థీనియం (వయ్యారి భామ, కాంగ్రెస్ గడ్డి… ఓరకం కలుపు మొక్క) ను ప్రవేశపెట్టింది అమెరికా కాదా..? ఏటా వందల కోట్ల నష్టం, ఆరోగ్య సమస్యలు… ఇండియా మాత్రమే కాదు 41 దేశాలకు అంటించింది అమెరికా… ఆ అమెరికా మా చైనాను అగ్రిటెర్రరిస్టు అంటుందా..? అని మొదలెట్టేశారు…
ఇది మన పంటలను దెబ్బతీస్తుందని తెలిసీ పంపింది అమెరికా, అంటే మన పొలాల్లో అది వ్యాపించి మన వ్యవసాయాన్ని దెబ్బతీయాలనే కదా… తద్వారా ఇండియా ఆహారధాన్యాలకు తన మీద ఆధారపడాలనే కదా…… ఇలా వ్యాసాలు, వాదనలు, కథనాలు మొదలయ్యాయి… సరే, ఒకవేళ అమెరికా ఉద్దేశపూర్వకంగా పార్థీనియం కుట్ర చేసిందనే అనుకుందాం… అందుకని చైనా ఫంగస్ను సమర్థించలేం కదా…
ఐతే ఒక వాదనను పరిగణనలోకి తీసుకోవచ్చు… చైనా సైంటిస్టులు స్వయంగా ఫంగస్ తీసుకుపోవడం వెనుక అసలు కారణాలేమిటో దర్యాప్తులో తేలతాయి కానీ… నిజంగా అమెరికా వ్యవసాయం మీద అగ్రి టెర్రర్ దాడి చేయాల్సినంత సీన్ ఉందా..? అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీస్తే అది చైనా ఆహారధాన్యాల దిగుమతి మీద ఆధారపడే దుస్థితి వస్తుందా..?
లేదు… అసలు అమెరికాలో వ్యవసాయమే నామమాత్రం… ఎక్కువగా గోధుమలు, కూరగాయలు… అందులోనూ జన్యుఇంజినీర్డ్ పంటలు ఇప్పుడు… అమెరికా జీడీపీలో పంట ఉత్పత్తుల శాతం 0.8 శాతం మాత్రమే… 223 బిలియన్లు…
ఈమాత్రం వ్యవసాయాన్ని దెబ్బతీయాలనేంత కుట్ర చైనా చేస్తుందని, ఇది అగ్రిటెర్రరిజం అనీ అనలేం… కానీ ఏదో ఉంది..? ఏమిటది..? ఏమో… ట్రంపు, మస్క్ పిచ్చి కొట్లాట ఓ కొలిక్కివచ్చాక ఆ ఫంగస్ సంగతేమిలో తేలుస్తారేమో..!!
Share this Article