.
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించిందని ఇటీవల చాలా చర్చలు జరుగుతున్నాయి… ఢమాల్, ఇప్పట్లో ఇక ఇది పుంజుకోదు అనీ…
హైడ్రాను, కూల్చివేతల్ని, మార్కెట్ డౌన్ఫాల్నీ, ఇంకా ఏవేవో కారణాలు చూపిస్తున్నారు… కానీ దేశవ్యాప్తంగానే రియల్ ఎస్టేట్ మందకొడిగా ఉంది… అయితే, హైదరాబాదులో ఏమైనా రెంట్ వాల్యూ తగ్గిందా..? ఆల్రెడీ జనం యాక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రేట్లు ఏమైనా తగ్గాయా..? తక్కువకు, అంటే అడ్డగోలు రేట్లకు ఎవరైనా తక్కువకు అమ్ముకుంటున్నారా..? నిల్…
Ads
అంతే, ప్రచారమే… అడ్డికి పావుశేరు అమ్మేవాడు లేడు… అడ్డగోలు రేట్లకు కొంటున్నవాడూ లేడు… వినిపించే ప్రచారానికీ కనిపించే నిజాలకూ నడుమ బోలెడు తేడా… అలాగని మొత్తం బాగుందా..? ఓ ఉదాహరణ చూద్దాం…
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (కెపిహెచ్బి) కాలనీలోని 7వ దశలో 18 ఓపెన్ ప్లాట్లను వేలం వేయడం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డు ₹142.78 కోట్లు సంపాదించింది… ఇంకా చెప్పాలంటే, ప్లాట్లు రికార్డు స్థాయిలో చదరపు గజానికి ₹2.98 లక్షలకు అమ్ముడయ్యాయి -.. ఇటీవలి కాలంలో చూసిన అత్యధిక ధరలలో ఇది ఒకటి…
బుధవారం స్థానిక కమ్యూనిటీ హాల్లో జరిగిన వేలంలో 84 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ప్లాట్ నంబర్ 22 చదరపు గజానికి ₹2.98 లక్షల అత్యధిక బిడ్ను అందుకుంది.., అయితే మొత్తం 6,232 చదరపు గజాల సగటు రేటు ₹2.38 లక్షలు… ప్లాట్ పరిమాణాలు 198 మరియు 987 చదరపు గజాల మధ్య ఉన్నాయి…
ఈ ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పటికీ బలంగా ఉందని, మందగమనం వాదనలకు విరుద్ధంగా ఉన్నాయనే వేరే దృశ్యాన్ని చూపిస్తున్నాయి… KPHB తో పాటు, కోకాపేట, శంకర్పల్లి, తెల్లాపూర్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా అమ్మకాలు, ప్రధాన ఆస్తి ఒప్పందాల్లో మందకొడితనం లేదు… కానీ శివారు ప్రాంతాల్లో..? అదే పెద్ద ప్రశ్న… నిజంగా కేవలం హైదరాబాద్, ఇతర తెలంగాణ నగరాల్లో మాత్రమేనా..?!
Share this Article