.
దాదాపు ప్రతి మీడియా రాసింది… పవిత్రమైన జూన్ 20న సాయి సుదర్శన్ అరంగేట్రం అని… ఇక తిరుగు లేదు అని… అఫ్కోర్స్, ఈ దినానికి ఇండియన్ క్రికెట్ కోణంలో కొంత విశిష్టత ఉంది… కానీ ఏ దినానికీ ఏ పవిత్రతా ఉండదు… ఇది అందరికీ అనుకూలంగా ఉండాలనీ లేదు…
ఎందుకు..? జూన్ 20… ఈ తేదీ ఇండియన్ టెస్ట్ క్రికెట్కు ప్రత్యేకం… 1996 జూన్ 20న లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో లెజండరీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ టెస్ట్ అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్లోనే గంగూలీ 131, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులు చేసి.. క్రికెట్ ప్రపంచానికి తమను తాము గట్టిగా పరిచయం చేసుకున్నారు…
Ads
ఇక 2011 జూన్ 20న కింగ్స్టన్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ సిరీస్లో కోహ్లీ హయ్యెస్ట్ స్కోర్ 30… కానీ ఆ తర్వాత కోహ్లీ క్రికెట్లో కింగ్ అయ్యాడు…
తాజాగా ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్ ఇవ్వాళ (జూన్ 20) టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనే డకౌట్ కావడం క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది… అంతర్జాతీయ వేదికపై ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుంది… ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లు, వాతావరణం అంత త్వరగా అర్థం కావు...
సాయి సుదర్శన్ ఆడింది చెత్త షాట్… తొందరపడ్డాడు… టెస్టు క్రిెకెట్లో కావల్సింది ఓపిక… టెక్నిక్… వన్డే కాదు, టీ20 కాదు, ఐపీఎల్ అసలే కాదు… సరే, రానురాను కుదురుకుంటాడేమో చూడాలి… కానీ ఒకవైపు యశస్వి జైశ్వాల్ కుదురైన ఆట ఆడాడు, మెప్పించాడు…
ఒకప్పుడు ఉపాధి కోసం పానీపురి అమ్ముకున్న తను క్రికెట్లో మంచి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు… గతంలోనూ ఇండియన్ జట్టు తరఫున మంచి రికార్డే ఉంది… అరంగేట్రంలోనే సెంచరీ, తరువాత రెండు టెస్టుల్లో వరుస డబుల్ సెంచరీలు… అధిక సిక్సర్లు… ఆర్ఆర్ తరఫున గత ఐపీఎల్ సీజన్లోనూ నిలకడ కనబరిచాడు…
శుభమన్ గిల్… కెప్టెన్గా తొలి టెస్టులోనే సెంచరీ… విజయ్ హజారే, గావస్కర్, కోహ్లీ తరువాత తనే… బ్యాలెన్స్డ్, మెచ్యూర్డ్ ప్లే… సరే, రిషబ్ పంత్…? ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుబోయి, ఏ ప్రలోభం ఆవహించిందో గానీ, అడ్డదిడ్డంగా ఆడి, చివర మ్యాచులో తల్లకిందులు విన్యాసాలు చేసి, అత్యంత అప్రతిష్ట మూటగట్టుకున్నాడు… ఐనా జట్టులోకి వచ్చాడు…
ఫస్ట్ డే మొదటి ఇన్నింగ్స్లో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 350 దాటి స్పష్టమైన ఆధిక్యతను సంపాదించింది ఇండియన్ టీమ్… నిజమే… ఎవరో కామెంటేటర్ చెబుతున్నట్టు… ఇండియన్ క్రికెట్లో ఓ ఆధునిక తరం తెర మీదకు వచ్చింది… బలమైన బ్యాటింగ్ లైనప్… కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, యశస్వి జైశ్వాల్… తర్వాత కరణ్ నాయర్, జడేజా కూడా…
అవునూ, జూన్ 20న అరంగేట్రం చేసిన గంగూలీ, ద్రావిడ్, కోహ్లీ.. ముగ్గురు కూడా టీమ్ ఇండియా టెస్టు జట్టుకు కెప్డెన్లుగా వ్యవహరించారు… శుభమన్ గిల్ కూడా ఇవ్వాళే కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్నాడు… మరి సాయి సుదర్శన్ భవిష్యత్ ఎలా ఉండబోతోందో… ఏమో, ఆ అదృష్టం కూడా బాకీ ఉందేమో…!! (ఇన్పుట్స్ #భాయ్జాన్
)
Share this Article