Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కశ్మీర్ న్యూ ఫైల్స్..! ఇదీ ఆ కశ్మీరీ పండిట్ల వార్తే… శారదా కారిడార్..!!

April 2, 2022 by M S R

కశ్మీర్ ఫైల్స్..! అంటే చరిత్రపుటల్లో దాగి ఉన్న నరమేధాలు, పైశాచిక ఊచకోతలు, మతోన్మాదాలే కాదు… వర్తమాన పరిణామాలు కూడా..! ఇండియాను మతం పేరిట రెండు ముక్కల్ని చేయాలని అనుకున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎవడో ఓ అర్ధ నిపుణుడికి (సగం) బాధ్యత ఇచ్చింది… మ్యాప్ మందు పెట్టుకుని అడ్డంగా తోచిన గీతలు గీసి, ఇది పాకిస్థాన్, ఇది ఇండియా అన్నాడు… శాస్త్రీయ విభజన అయితే కదా… ఈలోపు ఇటువాళ్లుఅటు, అటువాళ్లుఇటు… లక్షలాదిగా వలస…

లక్షల మంది మరణించారు… మతం పేరిట తెగనరుక్కున్నారు ఇటూఅటూ… పాలక స్థానాల్లో జరిగే చెత్తా నిర్ణయాల దుష్ఫలితాలు చరిత్రలో ఎన్నో రికార్డయ్యాయి… ఇదీ ఒకటి… అదలా ఉంచేస్తే… సిక్కులు పవిత్ర యాత్రాస్థలిగా భావించే కర్తార్‌పూర్ పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయింది… కశ్మీరీ పండిట్లు అంతే యాత్రాస్థలిగా పరిగణించే శారదా పీఠం దుర్గతి మరోలా తయారైంది… పాకిస్థాన్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంది… ఇప్పుడా పీఠం పాక్ అధీకృత ప్రాంతంలోనే ఉంది… పేరుకు ఆజాద్ కశ్మీర్…

మధ్యలో ఓ వాస్తవాధీనరేఖ… ఆ రేఖకు పది కిలోమీటర్ల దూరంలో ఈ సరస్వతి గుడి… ప్రతి కశ్మీరీ పండిట్‌కు మూడు పవిత్రయాత్రాస్థలాలు… ఒకటి ఈ శారదా పీఠం, రెండు అమరనాథ్, మూడు అనంతనాగ్ దగ్గర మార్తాండ సూర్య దేవాలయం… ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ శారదా పీఠాన్ని హిందువులు శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణిస్తారు… సతీదేవి కుడిభుజం కిందపడ్డ ఈ స్థలం ఓ శక్తిపీఠమే కాదు, జ్ఞానపీఠం కూడా… యూనివర్శిటీ… అప్పట్లో 5 వేల మంది దాకా చదువుకునేవాళ్లు… నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ | త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యాదానంచ దేహి మే || అని కశ్మీరీ పండిట్లు శారదా దేవిని కశ్మీర్ పురవాసినిగా రోజూ ప్రార్థిస్తుంటారు… ఇదీ ఈ పీఠం ప్రాధాన్యం…

Ads

sharada

కానీ ఏమైంది..? కశ్మీరీ పండిట్లను మతం పేరిట నరమేధంతో మన దేశం నుంచే బయటికి తరిమేశారు కదా… అనేక గుళ్లు కూలిపోయాయి కదా… ఇక పాకిస్థాన్ అదుపాజ్ఞల్లో ఉన్న గుడి సంగతేమిటో విడిగా చెప్పాలా..? అప్పటికే శిథిలావస్థలో ఉన్న గుడి, పట్టించుకునేవాళ్లు లేక, వచ్చిపోయేవాళ్లు లేక మరింత శిథిలమైపోయింది… భారతీయులకు ప్రవేశం లేదు… చాన్నాళ్లు కొట్లాడాక వీసాలు ఇచ్చేది పాకిస్థాన్… కానీ గుడి దగ్గరకు పోనిచ్చేవాళ్లు కాదు…

sharada

కర్తార్‌పూర్ కారిడార్ పేరిట పంజాబ్ సిక్కులు తమ యాత్రాస్థలికి వెళ్లడానికి ఓ అవకాశం ఏర్పడింది… సేమ్, అలాగే శారదా కారిడార్ కావాలనే డిమాండ్ పెరిగింది… ఏళ్ల తరబడీ పాకిస్థాన్ తేలికగా తీసుకుంది… కారణాలు ఏమైనా గానీ… పాకిస్థాన్ అంగీకరించింది… ఎల్వోసీ దగ్గర తంగ్‌దార్ సెక్టార్‌లోని తెత్వాల్ గ్రామంలో కారిడార్ ఏర్పాటు పనులకు మొన్నటి నెలలో భూమిపూజ నిర్వహించింది శారదా యాత్ర టెంపుల్ కమిటీ… మరి పీఠం పునరుద్ధరణ, భక్తులకు కనీస సౌకర్యాల ఏర్పాటు, దర్శనీయ సౌలభ్యం మాటేమిటి అంటారా..? ఎక్కడో ఓచోట తొలి అడుగు పడనివ్వండి..! కశ్మీర్ న్యూ ఫైల్స్ ఇవి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions