Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దివాలా దిశ… చివరకు ఆర్మీ డ్రిల్స్‌కు కూడా కత్తెర్లు… ఫాఫం పాకిస్థాన్…

July 6, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ….. బస్! ఖేల్ ఖతం! దుకాణ్ బంద్! ఈ సంవత్సరం చివరి వరకు పాకిస్థాన్ సైన్యం రోజువారీ సైనిక డ్రిల్స్ తో పాటు పెట్రోల్, డీజిల్ తో నడిచే ఎలాంటి సైనిక యుద్ధ టాంకులు కూడా డ్రిల్స్ లో పాల్గొనడానికి వీల్లేదు! ఒక T-80 యుద్ధ టాంక్ ఒక కిలోమీటర్ దూరం వెళ్ళడానికి రెండు లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది.

ఇక రోజు వారీ డ్రిల్ కోసం F-16 ఫైటర్ జెట్ కి అయితే ఒక సార్టీకి 6 వేల డాలర్ల ఖర్చు అవుతుంది. కానీ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి అంటే వారానికి రెండుసార్లు కనీసం ఒక స్క్వాడ్రన్ అన్నా ఫైటర్ జెట్లు సార్టీకి వెళ్ళాలి అంటే తక్కువలో తక్కువ 70 వేల నుండి 80 వేల డాలర్లు ఖర్చు అవుతుంది .

పాకిస్థాన్ దగ్గర డాలర్ రిజర్వ్ తగ్గిపోతున్న వేళ అత్యవసరంగా కావాల్సిన వాటికే సెంట్రల్ బాంక్ డాలర్లు ఇస్తున్నది! దిగుమతి చేసుకునే ట్రేడర్స్ కి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వాళ్ళు వివిధ రకాల వస్తువుల దిగుమతి కోసం విదేశాలకు ఆర్డర్ పెట్టారు. తీరా అవి కరాచీ పోర్టుకు చేరుకున్నాక సెంట్రల్ బాంక్ డాలర్లు లేవని చేతులు ఎత్తేసింది. దాంతో ట్రేడర్స్ గగ్గోలు పెడుతున్నారు. కంటైనర్ల కి డబ్బులు కట్టి విడిపించుకోకపోతే రోజుకి వెయ్యి డాలర్లు పెనాల్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది ! పెనాల్టీ కూడా డాలర్ల రూపంలోనే చెల్లించాలి! ఇక కరాచీ పోర్టులో షిప్ ఆగినందుకు పార్కింగ్ చార్జీలు చెల్లించాలి. కానీ కంటైనర్లు కిందకి దిగకుండా ఉన్నాయి కాబట్టి ఆ చార్జీలు కూడా ఇంపోర్టర్స్ చెల్లించాల్సి ఉంటుంది.

Ads

ఇక ఇంపోర్టర్స్ మేము ఆర్డర్ ఇచ్చేముందు సెంట్రల్ బాంక్ అడ్డుచెప్పలేదు కానీ తీరా కరాచీ పోర్టుకు వచ్చాక డాలర్లు విడుదల చేయట్లేదు అని వాపోతున్నారు. అయితే ఇంపోర్టర్స్ కనుక డాలర్లు చెల్లించలేకపోతే గ్యారంటీగా ఉన్న పాకిస్థాన్ సెంట్రల్ బాంక్ వాటిని చెల్లించాల్సిందే! So! ముందు ముందు కరాచీ పోర్టుని బ్లాక్ లిస్టులో పెడతారు ఎగుమతి దారులు!

ఆరు నెలల క్రితమే ఆర్మీ మెస్ లకి ఇస్తున్న గోధుమ పిండి మీద రేషన్ విధించడంతో రోజుకి రెండుసార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు సైనికులకి. ఇంతకుముందు మెస్ లకి దూరంగా విధులు నిర్వహిస్తున్న సైనికులకి ట్రక్కులలో భోజనాలు సప్లయ్ చేసేవారు కానీ గత 6 నెలల నుండి సైనికులు నడుచుకుంటూ మెస్ లకి వచ్చి తిని వెళ్ళాలి అని ఆంక్షలు విధించారు! దీని వల్ల ట్రక్కులకి వాడే డీజిల్ ఆదా అవుతుంది!

So! Pok ని స్వాధీనం చేసుకోవడానికి మాంచి సమయం అన్నమాట! ఏమో! మోదీ ఏదీ ముందు చెప్పరు కదా? బాలాకోట్ మీద దాడి చేయడానికి అనుమతి కోరిన 16 నిమిషాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మోదీ అప్పట్లో! ఏమో! ఇప్పటికే అంతా సిద్దం చేసి శీతాకాలం రాకముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది!

ఇక Pok ప్రజల నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే గత వారం రోజుల్లో గ్రీస్ సముద్ర జలాలలో మునిగిపోయిన పడవలలో ఉన్న వాళ్ళు ఎక్కువగా Pok వాళ్ళే… రెండు పడవ ప్రమాదాలలో మొత్తం 600 మంది పాకిస్థాన్ పౌరులు ఉండగా వీళ్ళలో ఎక్కువ మంది అక్రమంగా గ్రీస్ దేశంలోకి ప్రవేశించడానికి pok నుండి వచ్చి చనిపోయారు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions