.
నిజంగానే ఏదో పెద్ద మిస్టరీ ఉంది బెంగుళూరు తొక్కిసలాట విషాదం వెనుక..! ఎందుకంటే..? చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించి, నూటాయాభై మంది గాయపడిన సంగతి తెలుసు కదా…
ప్రభుత్వం ఎడాపెడా పోలీస్ అధికార్లను బదిలీ చేసేసింది… స్టేట్ పొలిటికల్ సెక్రటెరీ సహా మరికొందరిపైనా వేటు పడింది… కర్నాటక్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు రాజీనామాలు చేశారు… ఆర్సీబీ మీద పోలీసులు కేసు పెట్టారు, ఒకరిద్దరిని అరెస్టు కూడా చేశారు… బీసీసీఐ ఎంక్వయిరీ చేస్తోంది…
Ads
జిల్లా మేజిస్ట్రేట్ విచారణ నడుస్తోంది… పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు… అన్నీ వోకే… అసలు విషయం ఏమిటంటే..? అసలు ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ కూడా కాకముందే ఆర్సీబీ విజయోత్సవాల అనుమతి కోసం ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు… అదే మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నిస్తున్నాడు… విలువైన ప్రశ్న…
అంటే ఫైనల్స్ ఎలాగూ గెలుస్తామని వాళ్లకు ముందే ఎలా తెలుసు..? అంటే, పక్కాగా మనం ముందే చెప్పుకున్నట్టుగా…. ఈసాల కప్పు నమ్దే అనేది నినాదం కాదని, పక్కా ఫిక్సింగ్ బాగోతమని తేలతెల్లం అవుతోందా..? లేక యథాలాపంగా దరఖాస్తు చేసుకున్నారా..? నిజానికి పంజాబ్ ఈసారి భలే ఫైట్ ఇచ్చింది… గెలుస్తామని అంత ధీమా ఎలా వచ్చింది ఆర్సీబీకి..!
అదీ చిన్నస్వామి స్టేడియంలో మాత్రమే కాదు, విధానసౌధ ఎదుట సన్మానాలు ప్లస్ భారీ ఊరేగింపు ఒకరోజు ముందే ప్లాన్ చేశారుట… అందుకే దీని వెనుక ఏదో కుట్రకోణం ఉందనీ, కర్నాటక పోలీసులతో కాదు, ఎన్ఐఏ తో దర్యాప్తు చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది… ఫైనల్స్ స్టార్ట్ గాకముందు నుంచే ఆర్సీబీ ఎలాగూ గెలుస్తాం అన్నట్టుగా ప్రమోషన్ వర్క్ నడిపించింది సోషల్ మీడియాలో… ఈ ఫోటో అదే…
మరో విషయమూ తాజాగా వెల్లడైంది… ఎప్పుడైతే ఆర్సీబీ విజయోత్సవాలకు దరఖాస్తు చేసుకుందో, పరిస్థితిని గమనించి, సరిగ్గా అంచనా వేసిన డీసీపీ ఎంఎన్ కరిబసవన్న గౌడ్ ఏమాత్రం ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేమని ఉన్నతాధికారులకు లేఖ రాశాడు… ఐనా ఎవరూ పట్టించుకోలేదు…
విధానసౌధ పరిసరాల్లో సరైన సీసీటీవీ కవరేజీ కూడా లేదని, ట్రాఫిక్ సెన్సిటివ్ జోన్ కాబట్టి విరుచుకుపడే ఫ్యాన్స్ను అదుపు చేయడం కష్టమనీ తను ఆ లేఖలో ప్రస్తావించాడు… (టైమ్స్ కథనం ప్రకారం)… డీపీఏఆర్ కార్యదర్శి జి.సత్యవతికి లేఖ రాయగా, విజయోత్సవాలకు కాస్త ముందు ఇదే సత్యవతి విధానసౌధ ఎదుట గుమిగూడుతున్న ఫ్యాన్స్కు స్టేడియం వెళ్లాల్సిందిగా సూచించిందట…
ముందు విధానసౌధ దగ్గర ఆ టీమ్ను సన్మానించారు… అది ఒక బ్లండర్… ఆఫ్టరాల్ ఓ ప్రైవేటు క్రికెట్ టీమ్ను, అదీ కర్నాటకకు ఏమాత్రం సంబంధం లేని టీమ్ గెలుపును రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోవడం, ఉత్సవాలకు ప్రభుత్వ పెద్దలంతా హాజరు కావడం నాన్సెన్స్… పైగా ఒకవైపు బయట తొక్కిసలాట జరుగుతుంటే, లోపల మాత్రం విజయోత్సవాలు యథాతథంగా నిర్వహించడం విజ్ఞతారాహిత్యం, బాధ్యతారాహిత్యం…
డీసీపీ రాసిన లేఖ పోలీస్ కమిషనర్ దయానంద, చీఫ్ సెక్రెటరీ శాలినీ రజనీష్కు కూడా తెలుసు… ఐనా ఉత్సవాలకు అనుమతి లభించింది… కేంద్ర మంత్రి, బీజేపీ లీడర్ శోభా కరంద్లాజె ‘‘అసలు విధానసౌధ వద్ద ఓ ప్రైవేటు సంస్థకు సన్మానాలు చేయడం ఏమిటి?’’ అని ప్రశ్నించింది…
అసలు దోషులు సీఎం, డిప్యూటీ సీఎం… కాగా పోలీసు అధికారుల మీదకు తప్పు నెట్టేసి, తమ చేతులు కడుక్కుంటున్నారు అని ఆరోపించింది… డిప్యూటీ సీఎం సారీ చెప్పగానే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా అనడిగింది… అవునూ, ఇంతకీ గెలుపుకు ముందే గెలుపు ఉత్సవాల ప్లానింగ్, అనుమతుల దరఖాస్తులు ఏం చెబుతున్నాయి..? తేల్చాల్సింది ఎవరు..?
Share this Article