.
మిత్రుడు #రవివానరసి పోస్టు ఒకటి డిస్టర్బింగుగా ఉంది… ముందుగా ఆ వార్త ఏమిటంటే..? తిరుచానూరు పరిధిలోని, మండ్లపూడి గ్రామం… స్వర్ణముఖి నది ఒడ్డున ఓ ప్రాచీనాలయం… అందులో దేవత వారాహి అమ్మవారు…
రాత్రికి రాత్రే ఆ గుడిని నేలమట్టం చేసేసి, కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా చేసి… అమ్మవారి విగ్రహాన్ని స్వర్ణముఖి నదిలోకి విసిరేశారు… అదీ ఉత్సవ విగ్రహం… మరి మూలవిగ్రహం..? తెలియదు… ఏపీ ప్రభుత్వమే చెప్పాలి…
Ads
లేదా సనాతన ధర్మరక్షకుడు పవన్ కల్యాణ్ చెప్పాలి… కూటమి ప్రభుత్వంలో భాగస్వామి బీజేపీ చెప్పాలి… పవన్ కల్యాణ్ ప్రచారవాహనం పేరు వారాహియే కదా… గుర్తొచ్చింది… తిరుమల లడ్డూ వివాదాలు, తొక్కిసలాటలు, సారీ చెప్పాల్సిందిగా పవన్ కల్యాణ్ ఉరుములు, మెట్లు కడగడాలు వరుసగా గుర్తొచ్చాయి…
మరి వారాహి గుడి విషయం తన దాకా పోలేదా..? అదేదో షూటింగులో ఉన్నాడట… ఎవరైనా చెప్పొచ్చుగా..! అవునూ, గుడి కూల్చివేతలో ఉన్నది స్థానిక తెలుగుదేశం వాళ్లేనట… భూకబ్జా కోసమా..? దేవుళ్ల గుళ్లనూ వదలరా..? అసలక్కడ ఏం జరిగిందో పోలీసులైనా చెప్పాలి కదా… ఏదీ లేదు…
పోనీ, అదేమైనా కొత్తగా వెలిసిన గుడా..? దాన్నెందుకు, ఎవరు కూల్చాల్సి వచ్చింది..? కూల్చేసే బాధ్యతను వాళ్లెందుకు తీసుకున్నారు..? అన్నీ ప్రశ్నలే…
కూటమి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులతో కలిసి, తిరుచానూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిషోర్ ఈ వారాహి అమ్మవారి ఆలయం ఉన్న స్థలాన్ని కబ్జా చేసి, దేవాలయాన్ని కూల్చివేసి, ఉత్సవ విగ్రహాన్ని స్వర్ణముఖి నదిలోకి పడేశారని ప్రాథమిక సమాచారం తెలుస్తోంది… నిజమేనా చంద్రబాబు గారూ..? నిజమేనా లోకేష్ బాబు గారూ..? నిజమేనా పవన్ కల్యాణ్ గారూ…?
రాజకీయ స్వార్థం కోసమో, భూ కబ్జా కోసమో దేవుడి స్థలాన్ని, ఆలయాన్ని ధ్వంసం చేయడం ఏ రకమైన సంస్కృతో తెలుగు సమాజానికి చెప్పాల్సింది ఎవరు..? పోనీ, సదరు తెలుగుదేశం నాయకుడి చర్య కరెక్టే అని సమర్థించుకొండి… అద్సరే, సాక్షికి ఇంకా తెలియలేదా..? అమరావతి వ్యాఖ్యల వివాదాలు, కేసులతో వెనక్కి తగ్గిందా..? అక్కడ వైసీపీ నాయకులు కూడా ఉంటారు కదా... ఎందుకు వాళ్ల మౌనం..?!
Share this Article