Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘సజీవంగా పట్టుకుని, ఆ తరువాత కాల్చి చంపేశారు… :: మావోయిస్టులు

May 26, 2025 by M S R

.

మరణించిన మావోయిస్టుల భౌతిక దేహాలను ఇవ్వకుండా సతాయించడం ఖచ్చితంగా అమానవీయం… దుర్మార్గం… ఆల్రెడీ మరణించారు కదా, ఇంకా ఆ ప్రతీకార వాంఛ ఏమిటి.?

సరే, ఆ చర్చ ఎలా ఉన్నా… అనారోగ్యంతో ఉండి, చికిత్స తీసుకుంటున్న మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, సుప్రీం కమాండర్ నంబాల కేశవరావును పట్టుకుని, అడవుల్లోకి తీసుకుపోయి కాల్చిపడేశారనే సందేహాలు వినవచ్చాయి కదా…

Ads

అది కాదని, అది ఎన్‌కౌంటరేనని మావోయిస్టు పార్టీయే క్లారిటీ ఇస్తోంది… మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఓ లేఖ ఒకటి మీడియాకు అందినట్టు వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో వార్త కనిపిస్తోంది…

‘‘నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను సజీవంగా పట్టుకుని కాల్చి చంపారు, మా నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం… లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్… 6 నెలలుగా మాడ్‌ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు…

కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు ఇటీవల లొంగిపోయారు… వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ చేశారు… ఓ యూనిఫైడ్ కమాండో సభ్యుడు కూడా ద్రోహిగా మారాడు… రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది…

ఎన్‌కౌంటర్ ముందు రోజు నుంచి… 20 వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి… 10 గంటల్లో ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి… 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్భంధించాయి… పోరాడాం… కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు… ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు…

బలగాలకు, డీఆర్జీ సభ్యులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందుతోంది… మా మీట్‌కు ఆకలిదప్పులు… అంతకుముందు 60 మంది ఉండేది బీఆర్ దాదా (కేశవరావు) టీమ్… తరువాత ఈజీ మొబిలిటీ కోసం కొంత తగ్గించగా, కొందరు లొంగిపోయారు… దాంతో ఎన్‌కౌంటర్ వేళ 35 మంది మాత్రమే ఉన్నారు…

కాల్పులు, యుద్ధం జరుగుతున్నప్పుడు విడిగా తనను ఎస్కేప్ చేయించడానికి సిద్ధపడి, అడిగితే, నేను రెండుమూడేళ్లకన్నా ఎక్కువగా లీడ్ చేయలేను, ఏమైనా జరగనీ, కలిసే పోరాడదాం అన్నాడు… మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి, కొన్నిరోజులుగా ఎలాంటి కాల్పులు జరపలేదు… కానీ చర్చలకు, శాంతి స్థాపనకు ప్రభుత్వమే ముందుకు రాలేదు’’

ఇదీ వికల్ప్ పేరిట ఉన్న ఆ లేఖ సారాంశం… ఎస్, ముందు నుంచీ అనుకుంటున్నదే… తను పార్టీ ప్రధాన కార్యదర్శి, యుద్ధతంత్రంలో సిద్ధహస్తుడు, సంపూర్ణంగా టెక్ తెలిసినవాడు… జాగ్రత్తగా ఆచరించేవాడు… ఆ స్థాయి లీడర్ అంటే మూడంచెల రక్షణ ఉంటుంది… కనీసం 30, 40 మంది లీడర్‌ను కాపాడటానికి తమ ప్రాణాలు అడ్డువేస్తారు… ఐనా సరే, దొరికిపోయాడు అంటే…?

ఎవరో పిన్‌పాయింటుగా లొకేషన్ చూపించి ఉండాలి… బలగాలను లీడ్ చేసి ఉండాలి… కానీ తన టీమ్‌లో కొందరు లొంగిపోయారు అంటే, వెంటనే భద్రత సందేహాలతో లొకేషన్  చేంజ్ చేయడం జరిగి ఉండాలి, జరిగిందో లేదో తెలియదు… ఆల్టర్నేట్ స్థావరం ఆచూకీ కూడా లొంగిపోయిన నక్సలైట్లకు తెలిసి బలగాలు అక్కడికి చేరుకోవడానికి సహకరించి ఉండాలి…

ఈలెక్కన అగ్రనేతలకు ఇన్నాళ్లూ సురక్షిత స్థావరాలుగా కాపాడుతూ వచ్చిన చాలా సేఫ్ అడ్డాలు ఇప్పుడు ప్రమాదమే ఇక..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions