.
ఒకటి మనిషికి అంతుపట్టలేదు, తెలియలేదు… కాబట్టి అది లేదనుకోవాలా..? అబద్ధం అనుకోవాలా..? మనిషికి తెలియనంతమాత్రాన అది లేకుండా పోదు కదా… అర్థం కాలేదు కదా…
కాస్త సరళంగా చెప్పుకుందాం… ఉదాహరణకు ఆత్మ… అంటే, అదేమిటో నిర్వచించలేం, ఖచ్చితంగా అదేమిటో తెలియదు కూడా… మనిషి మరణించాక ఏమవుతాడు..? ఏమీ కాడు… ఓ భౌతిక దేహం ప్రాణం పోతుంది, కట్టె కాలి బూడిదవుతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది అంటుంది హేతువాదం…
Ads
కానీ మరణాన్ని మించి మరో జీవితం ఉంది… మరణం జస్ట్, ఆత్మ ఒక దేహాన్ని వదిలించుకోవడం మాత్రమే… ఆత్మ సత్యం, నిత్యం అంటుంది మన భగవద్గీత, భారతీయ ఆధ్యాత్మికత… మనమే కాదు, ప్రపంచంలో మెజారిటీ జనం నమ్ముతారు…
ఏమని..? యమకింకరుడు వస్తాడు, పాశం విసురుతాడు వంటి కథల్ని పక్కన పెడితే… మనిషి మరణించగానే… ఆత్మ దేహం నుంచి బయటికి తేలుతూ పైకి లేస్తుంది… అద్వితీయమైన ఓ వెలుతురు మార్గంలో దూసుకుపోతుంది… అని చాలామంది చెప్పారు… చెబుతున్నారు… ఎస్, చాలా పరిశోధనలు కూడా సాగుతున్నాయి…
ఆ ఆత్మ పరమాత్మలో కలిసిపోవడం ఒక భావన… కాదు, మరో దేహాన్ని వెతుక్కోవడం మరొక భావన… అసలు ఆత్మ పరమాత్మలో లీనం కావడమే ఆ ఆత్మ ప్రయాణానికి ముగింపు అనేది ఇంకో భావన… తాజాగా ఓ వార్త… అది చదవడానికి ముందు ఈ దీర్ఘ ఉపోద్ఘాతం అవసరమైంది… ఆ నిన్నటి వార్త ఏమిటంటే..?
ఈమె పేరు బ్రియానా లాఫర్టి… వయస్సు 33 ఏళ్లు… అమెరికాలోని కొలరాడో నివాసం… myoclonus dystonia అనే వ్యాధి ఉంది తనకు… అది నరాల సంబంధమైన ప్రాణాంతక వ్యాధి… ప్రాణం పోయింది… డాక్టర్లు కూడా డెడ్ అని ప్రకటించారు… సీన్ కట్ చేస్తే… 8 నిమిషాల తరువాత ఆమెలో మళ్లీ కదలిక, ఊపిరి… ప్రాణం తిరిగి వచ్చింది…
నిజం… ఇక్కడ ప్రాణం తిరిగి వచ్చింది అనే మాట అక్షరాలా నిజం… ఎందుకంటే… ఆమె మరణించాక 8 నిమిషాల తరువాత మళ్లీ బతికింది… వోకే, చాలా చదివాం కదా… పాడె మోసుకుపోయేటప్పుడు, చితి అంటించేటప్పుడు కూడా కొందరు బతికి, లేచి కూర్చున్న ఉదాహరణలు… అవునూ, మరణించాక ఏమైంది..?
ఈమె చెబుతోంది… ‘‘నన్నెవరో నువ్వు రెడీయా అనడుగుతున్నట్టు వినిపించింది, ఎక్కడికో తీసుకెళ్లడానికి వచ్చినట్టు… నాకు తెలస్తూనే ఉంది, నా బాడీ నుంచి నేను పైకి తేలుతూ లేస్తున్నాను… బరువు లేదు, నాకేం జరుగుతున్నదో నేను స్పృహలోనే ఉన్నాను… కానీ నా బాడీలో నేను లేను, అంతే…
మరణం ఓ భ్రమ మాత్రమే అని అర్థమైంది నాకు, ఎందుకంటే, నా ఆత్మ అలాగే ఉంది కదా… నా ఆత్మ పైకి లేవగానే… నొప్పి లేదు, భయం లేదు, ఆందోళన లేదు… అంతా తేలికగా, ప్రశాంతంగా ఉంది… ఆత్మ చుట్టూ చీకటి ఆవరించింది… మరణం తరువాత మరేదో ఉంది, అదే అర్థం కాలేదు… మళ్లీ ఏమైందో తెలియదు, నా దేహంలో నేను ప్రవేశించాను, లేచి కూర్చున్నాను’’… ఆమె మిర్రర్ పత్రికకు చెప్పుకున్న అనుభవమిది…
NDE అంటే Near Death Experiences … మరణావస్థ వేళ అనుభవాలు… వీటిపై చాలా పరిశోధనలు సాగుతున్నాయి… సంక్లిష్టం, అంత త్వరగా అర్థం కావు… కానీ మరణం తరువాత ఏదో ఉందనేది నిజం.,. ఆ నిజమేమిటో మనకు తెలియదు కాబట్టి లేదు అనుకుంటున్నాం… అంతేనా..?
(ప్రతీకాత్మక చిత్రం)
గత నెలలో, కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, జీవుల జీవన కాలమంతా మన దేహం ఒక రకమైన వెలుతురు కలిగి ఉంటుందని తేల్చారు… అది అల్ట్రావీక్ ఫోటాన్ ఎమిషన్ (UPE) అనీ చెప్పారు… మరణించిన తరువాత ఈ వెలుగు ఇక కనిపించదు… హిందూ మార్మిక ఆధ్యాత్మిక బోధనలు మరణం తరువాత పలు దశల్ని, ఆత్మ సిద్ధాంతాన్ని చెబుతుంటాయి… కానీ ఆధునిక మనిషి శాస్త్రబద్దంగా తేల్చుకుంటే తప్ప నమ్మడు కదా..!! (సోర్స్ :: ఎన్డీటీవీ)
Share this Article