.
అనేక కథనాలు వస్తుంటాయి… ఒక నవ వధువు కోటి ఆశలతో వెళ్తుంటే కాలిపోయింది… మరొకరు ట్రాఫిక్ జామ్లో చిక్కి, లేటై, ఫ్లయిట్ మిస్సయి బతికిపోయారు… అదే విమానంలో అంతకుముందు ప్రయాణించిన ఓ వ్యక్తి చాలా లోపాల్ని కనిపెట్టి ట్వీట్ చేశాడు… అసలు ఈ బోయింగ్ విమానాలన్నీ ఇంతే…
టాటాల యాజమాన్యం కిందకు వచ్చినా ఎయిర్ ఇండియా దశ మారలేదు… అవునూ, అది ప్రమాదమేనా..? ఏమో మేడే సంకేతాలు అందిన వెంటనే కనెక్టివిటీ కోల్పోయి, మెడికల్ హాస్టల్ భవనం మీద పడి పేలిపోయింది… ఏదైనా కుట్ర ఉందేమో…
Ads
ఓ సీఐఏ మాజీ ఆఫీసర్ కొన్నాళ్లుగా ట్వీటుతున్నాడు, భారతదేశం మీద మరో ఉగ్రచర్యకు అఫ్ఘనిస్తాన్లో ప్రణాళిక రచించబడుతోంది అని..! స్ట్రెయిట్ యుద్ధంలో గెలవలేక ధూర్త పాకిస్థాన్ ఏదో చేసి ఉంటుంది అని మరో విశ్లేషణ, సందేహం… గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా… ఒక్కడు మినహా మిగతా 141 మందిని బలిగొన్న విమాన ప్రమాదం మీద ఎన్నెన్నో కథనాలు… ఇలాంటివి కూడా…
మీడియా బోలెడు ఫోటోలు, ఫాలోఅప్స్, వీడియోలు, హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీలతోపాటు కుట్ర కథనాలను కూడా ప్రసారం చేస్తోంది… కొన్ని హేతుబద్దం, కొన్ని ఫేక్, కొన్ని అబ్సర్డ్… కానీ అవన్నీ చదువుతుంటే… ఒక్క చోట మాత్రం మౌజ్ ఆగిపోయింది…
ఇదుగో ఆస్ట్రో శర్మిష్ట అనే కార్పొరేట్ జ్యోతిష్కురాలి జోస్యం దగ్గర… 2025లో ఏవియేషన్ బాగానే ఉంటుంది… కానీ కొన్ని హెడ్లైన్స్ మనకు షాక్ ఇస్తాయి… అంటూనే టాటా రాఫెల్ ఫ్యూజులేజ్ తయారీని హైదరాబాదులో టేకప్ చేస్తుందనీ, ఇస్రో ఖగోళశాస్త్రంలో, ఉపగ్రహజ్ఞానంలో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుందనీ చెప్పింది…
హైదరాబాద్ రాఫెల్ ఫ్యూజులేజ్ జోస్యం నిజమైంది… 2025లో ఓ ఫ్లయిట్ క్రాష్ జోస్యంపై తను కట్టుబడి ఉన్నాననీ పునరుద్ఘాటించింది… ఇప్పుడు ఈ జోస్యాలు ఫుల్లు వైరల్ అయిపోయాయి… ఆమె ఒకటీరెండు ట్వీట్లు గమనిస్తే మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ కనిపించింది…
2025 లో పాకిస్థాన్కు గడ్డుకాలమనీ, ఆర్మీ నిస్సహాయ స్థితిలో ఉంటుందనీ, ప్రకృతి వైపరీత్యాలు, అంతర్యుద్ధం ఉంటుందనీ 2024 సెప్టెంబరులో జోస్యం చెప్పింది… అంతేకాదు, తాజా విమాన ప్రమాదంపై సంతాపం చెబుతూనే, ఇంకా గడ్డుకాలం ముందుందనీ, దానికి ఫలానా గ్రహస్థితి కారణమనీ చెబుతోంది…
ఫస్ట్ పీవోకేలో కొంత పార్ట్ స్వాధీనం చేసుకుంటామనీ, 2027లో మళ్లీ పాకిస్థాన్తో తీవ్ర ఘర్షణలు తప్పవనీ, ఆ తరువాతే పీవోకే స్వాధీనం జరుగుతుందనీ చెప్పింది… సరే, ఆమె చెప్పినవన్నీ జరుగుతున్నాయా అనేది పెద్ద డిబేట్… ఎవరి నమ్మకం వాళ్లది… కావచ్చు, ఆమె జోస్యాల్లో సక్సెస్ రేట్ అధికంగా ఉండవచ్చు…
ఇంతకీ ఎవరీ శర్మిష్ట… సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోయింగ్ ఉన్నట్టు కనిపిస్తూనే ఉంది… జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలూ ప్రిడిక్ట్ చేస్తున్నది… ఈ జోస్యాలకు ఆమె ఫాలో అయ్యే జ్యోతిష పద్ధతి ఏమిటో తెలియదు గానీ… ఈ విమాన ప్రమాదం జోస్యంతో ఒక్కసారిగా దేశమంతా ఆమె వైపు చూస్తోంది ఇప్పుడు…
అసలే డిమాండ్ ఉన్న జ్యోతిష్కురాలు… ఇక ఇప్పుడు చెప్పనక్కర్లేదు… ఆమె వెబ్సైటుకు వెళ్తే… ఆమె సేవలు, కన్సల్టేషన్, ఫీజుల వివరాలతోపాటు సినిమా సెలబ్రిటీ తరహా ఫోజులు, డ్రెస్సులు కనిపిస్తాయి… ఓ ఇంట్రస్టింగ్ జ్యోతిష్కురాలు… ఆమె వ్యక్తిగత వివరాలు పెద్దగా దొరకవు నెట్లో..! అవునూ, మన వేణుస్వామి గానీ, మన తెలుగు పంచాంగకర్తలు గానీ ఎవరైనా ఈ విమాన ప్రమాదాన్ని ఏమైనా ఊహించారా..?
Share this Article