.
ఇటీవల గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పుంఖానుపుంఖాలుగా రాస్తున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం కదా… దేశాల నడుమ గూఢచర్యంలో ఇదేమీ కొత్త కాదు, ఈమెతో మొదలూ కాదు, ఆగిపోదు…
జ్యోతి ఓ యూట్యూబర్… ఎక్కడికి వెళ్లాలన్నా, సమాచారం సేకరించాలన్నా చాలా పరిమితులు ఉంటాయి, కష్టం… కానీ మన ఏజెంట్లను కడుపులో పెట్టుకుని కాపాడే కీలకమైన హైకమిషన్ ఉద్యోగిగా ఉంటూ… దేశద్రోహిగా మారితే… శతృదేశపు ఏజెంటుగా మారితే..? అవును, ఇది అలాంటి కథే… ఇప్పుడు నెమరేసుకోవాల్సిన ద్రోహ చరితే…
Ads
15 ఏళ్ల క్రితం… ఆమె పేరు మాధురి గుప్తా… భారత విదేశాంగ శాఖలో ఒక మధ్యస్థాయి అధికారిణి. ఉర్దూ భాషలో మంచి పట్టు, సూఫీ కవిత్వంపై ఆసక్తి. పాకిస్థాన్లోని భారత హైకమిషన్లో ‘ప్రెస్ & ఇన్ఫర్మేషన్ సెక్రటరీ’గా పని చేస్తున్న సమయంలో ఈ కుట్ర, ఈ ద్రోహం చోటుచేసుకుంది…
బయట కనిపించే మధురి గుప్తా ఒక థింకర్, మంచి ఉద్యోగి… కానీ లోపల… దేశానికి ద్రోహం చేస్తున్న గూఢచారిణి!
ఎలా అనుమానం వచ్చింది?
2010లో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)కి పాకిస్థాన్లో ఉన్న హైకమిషన్లో ఎవరో ఒకరు రహస్య సమాచారం బయటకు పంపిస్తున్నారనే సమాచారం వచ్చింది… సీరియస్, హైకమిషన్ ఉద్యోగులే శతృ ఏజెంట్లా..? వెంటనే RAW (Research & Analysis Wing) చీఫ్ కే.సి. వర్మ, హోం సెక్రటరీ జీ.కే. పిళ్లైకి తెలియజేశాడు…
ఆయన గోఎహెడ్ అన్నాడు… అనుమానాలు ఆమె పైనే..,. కానీ వెంటనే అరెస్టు చేయలేదు… నిఘా పెట్టారు… తెలివిగా ఓ తప్పుడు సమాచారాన్ని ఆమెకు అందేలా చేశారు… అది వెంటనే ఐఎస్ఐకి చేరిపోయింది… అది రా అధికారులు కన్ఫరమ్ చేసుకున్నారు… దాంతో మాధురి గుప్తా కథ బహిర్గతమైపోయింది…
అరెస్ట్ ఎలా జరిగింది?
భూటాన్లో జరగబోయే SAARC సదస్సుకు మీడియా బ్రీఫింగ్కు సపోర్ట్ అవసరం అనే పేరిట ఆమెను 2010 ఏప్రిల్ 21న ఢిల్లీకి రమ్మని చెప్పారు… ఆమె West Delhi లో ఉన్న ఇంట్లో ఆ రాత్రి ఉండిపోయి, తరువాత రోజు MEA కార్యాలయానికి వెళ్లింది…
అక్కడే పోలీసుల ప్రత్యేక బృందం వచ్చి ఆమెను అరెస్ట్ చేసింది…. ఆమెపై Official Secrets Act ప్రకారం కేసు పెట్టారు…,.
ఆమె ఏమి చేసింది?
ఆమె పాకిస్థాన్ ISIకి ఇచ్చిన సమాచారం చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా: భారత ఇంటెలిజెన్స్ అధికారుల పేర్లు, వారి గుప్త వివరాలు, హైకమిషన్ సిబ్బంది బయో డేటాలు, జమ్ము కశ్మీర్ రాష్ట్ర ప్రాజెక్టుల సమాచారం, భారత్లోకి రహస్య మార్గాలు ఉన్నాయని చెప్పడం…
ఈ సమాచారంతో భారత రహస్య మిషన్లు బహిర్గతమయ్యాయి. ప్రత్యేకించి RAW స్టేషన్ చీఫ్ ఆర్కే శర్మ వివరాలు బయటపడ్డాయి. ఇది దేశ భద్రతకు పెద్ద ప్రమాదం…
మధురి ఇలా ఎందుకు చేసింది?
ఇది ప్రేమ వల (లవ్ ట్రాప్, ఇదోరకం హానీ ట్రాప్) వల్ల జరిగింది… జమ్షేద్ అనే యువకుడు, మాధురి కంటే సగం వయస్సు ఉన్నవాడు, ఆమెను ప్రేమలో పడేశాడు…. మాధురి అతనిపై బాగా మక్కువ పెంచుకుంది… అతన్ని పెళ్లి చేసుకోవాలని, ఇస్లాం స్వీకరించాలనే ఆలోచన దాకా వెళ్లిపోయింది…
జమ్షేద్, ముదస్సర్ అనే మరొక ISI ఏజెంట్ ద్వారా ఆమెతో బాగా స్నేహం పెంచుకున్నాడు… మొదట ఓ మహిళా జర్నలిస్ట్ ద్వారా పరిచయం… ఓ అరుదైన ఉర్దూ పుస్తకాన్ని ఆమెకు తెచ్చిపెట్టడం ద్వారా ఆమె నమ్మకాన్ని సంపాదించాడు…
ఆమె ఇంట్లోని కంప్యూటర్, బ్లాక్బెర్రీ ఫోన్ ద్వారా వారు ఆమెతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండేవారు… రెండు ఈమెయిల్ అకౌంట్ల ద్వారా దాదాపు 73 ఈమెయిల్స్ ఉన్నట్టు ఛార్జిషీట్లో ఆరోపణ….
తర్వాత ఏమైంది?
మాధురి గుప్తాపై 2012లో అధికారికంగా కేసు నమోదు చేశారు… మొదట 21 నెలలు తిహార్ జైలులో గడిపింది…. తరువాత బెయిల్పై బయటకు వచ్చింది…
2018లో కోర్టు ఆమెను గూఢచారిగా తేల్చింది… అప్పటి నుంచి ఆమె రాజస్థాన్లోని భివాడిలో నివసిస్తూ ట్రయల్ ఎదుర్కొంటూ ఉంది… 2021లో, అంటే 64 ఏళ్ల వయస్సులో ఆమె మరణించింది… మరణం సమయంలో ఆమె అప్పీల్ హైకోర్టులో పెండింగ్లోనే ఉంది…!!
కథలో నీతి… కొందరి మానవ బలహీనతలు ఏకంగా దేశభద్రతకే ప్రమాదం తీసుకొస్తాయి..!!
Share this Article