.
Subramanyam Dogiparthi …… #పహల్గాం_ఫైల్స్ … జూలియస్ సీజర్ అనే నాటకాన్ని William Shakespeare వ్రాసారు . చాలామంది చదివే ఉంటారు . లేదా సినిమాను చూసి ఉంటారు .
విషయం ఏందంటే : కొంతమంది సెనేటర్లు సీజర్ని చంపుతారు . రోమ్ ప్రజలు కుట్రదారుల మీద తిరగపడతారు . మూక మనస్తత్వంతో కుట్రదారులని ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తుంటారు .
Ads
అప్పుడు రోమ్లో సిన్నా అనే పేరుతో ఇద్దరు ఉంటారు . ఒకరు కవి , మరొకరు కుట్రదారుడు . కుట్రదారుడు సిన్నా కోసం వెతుకుతూ ఉంటారు . మూకలో ఒకడు అడుగో సిన్నా అని అరుస్తాడు . అతన్ని చంపటానికి జనం పరుగెడతారు .
అతను నేను సిన్నా అనే కుట్రదారుడిని కాదు , సిన్నా అనే కవిని అని గగ్గోలు పెడతాడు . జనంలో నుంచి ఒకడు ఇవన్నీ మాకు తెలియవు , సిన్నా అనే పేరుంది కదా ! అది చాలు అని లేపేస్తారు .
పహల్గాం దుర్ఘటన జరిగాక కొందరు హైదరాబాదులో కరాచీ బేకరీ మీద చేసిన దాడి ఇలాంటిదే . జనం ఎంతగా భయపడి పోయారంటే ఎవరికి వారు పాక్ లేదా పాకిస్థానుకు సంబంధించిన ఏ పేరయినా తమకు తామే మార్చేసుకుంటున్నారు . ఈ మైసూరు పాక్ స్టోరీ కూడా ఇదే . వాస్తవానికి అది పాకం . పాకం కాస్త పాక్ అయిపోయింది .
మనమందరం దశాబ్దాలుగా మైసూరు పాక్ అనే అంటున్నాం . ఇంతటి అనాలోచిత మనుషులు ఉద్భవిస్తారని ఎవరికి తెలుసు !? ఫాఫం మైసూరు మహారాజా ప్యాలెసులో గతంలో పనిచేసిన ఓ మాస్టర్ చెఫ్ దీన్ని కనిపెట్టాడట… తన మునిమనమడు ఆ ఒరిజినల్ పేరు మార్చకండిరా బాబూ, పాక్ కాదు, అది పాకం అని నిన్న పత్రికల్లో మొత్తుకున్నాడు… వినేవాడెవ్వడు..?
సంతోషం ఏమిటంటే… పతంజలి రాందేవ్ బాబా ముల్తాని మిట్టి అనే సోపులు , క్రీములు అమ్ముకుంటూ ఉంటాడు . ఈ అతివాదులు ఎవరూ ఆయన మీద పడలేదు . అంతవరకు ఆనందం … (ఇది స్వీటు కూడా కాదు, మట్టి…)
సాధారణ ప్రజలకు ధైర్యాన్ని కలిగించవలసిన ప్రభుత్వాలు మౌనంగా ఉండటం బాధాకరం . కనీసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని కూడా చెప్పకపోవటం ఇంకా ఆక్షేపణీయం . మూకస్వామ్యం , జనాన్ని మందస్వామ్యం వైపు తోసేస్తున్నారు … ఈ స్వీటు వెనుక చేదు కూడా ఇదే… అవునూ, పాక్ అని ఎండయ్యే అనేకానేక పదాలున్నాయి, మరి వాటినేం చేద్దాం..?!
Share this Article