.
భారత్ ఎదుగుదల ఓ భిన్నమైన ప్రతిఘటనను ఎదుర్కుంటోంది… భారత్ బలహీనంగా ఉందని కాదు… ఇకపై బలహీనంగా, తలవంచి ఉండేందుకు సిద్ధంగా లేదనే కారణంతో…
ఇప్పుడు సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించి, భారత ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో… ఈ విషయంపై మాట్లాడాల్సిన సమయం వచ్చింది.
Ads
దేశంలో అశాంతి, అరాచకం లేదా ఢిల్లీలో ప్రభుత్వ మార్పు గురించి కథనాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నవారు… భారత ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ అర్థం చేసుకోలేదు.
భారత్లో ప్రభుత్వాలు వీధి పోరాటాలతో మారవు. ప్రభుత్వాలు ఎన్నికల ద్వారానే మారుతాయి.
- అయితే… ఇదంతా కొన్ని నెలల క్రితం అమెరికా డిప్యూటీ సెక్రటరీ క్రిస్టోఫర్ లాండౌ చేసిన ఒక వ్యాఖ్యతో మొదలైందా? చైనాను వాణిజ్య ప్రత్యర్థిగా ఎదగనిచ్చినట్లుగా, అదే తప్పును భారత్ విషయంలో అమెరికా చేయదని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఆ ఒక్క వ్యాఖ్యే ఒక అసౌకర్యమైన భౌగోళిక- రాజకీయ వాస్తవాన్ని బయటపెట్టింది. భారత్ ఎదుగుదల ప్రపంచ శక్తి సమతుల్యతను పూర్తిగా మార్చబోతుందని ప్రతి ప్రధాన దేశం అర్థం చేసుకుంది.
ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతోందో చూడండి. నా అంచనా ప్రకారం… ఇవి కేవలం పరీక్షలపై జరుగుతున్న నిరసనలు మాత్రమే కావు. రాజకీయంగా అత్యంత సున్నితమైన సమయంలో భారత రాజ్యాన్ని బలహీనపరిచే పెద్ద ప్రయత్నంలో ఇవి ఒక భాగం.
పార్లమెంట్ సమావేశమైంది. ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ (FCRA) సవరణలు, డీలిమిటేషన్ వంటి రాజకీయంగా కీలకమైన చట్టాలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. పార్లమెంట్లో తమకు సంఖ్యాబలం లేదని ప్రతిపక్షానికి తెలుసు.
అయితే… పోరాటం ఇప్పుడు పార్లమెంట్ వెలుపలికి మారిందా?
నా అభిప్రాయం అదే. ఓట్లతో చట్టాలను అడ్డుకోలేకపోతే… పార్లమెంట్లో జరిగే చర్చల కంటే బయట జరిగే అశాంతినే ప్రధాన వార్తగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. భారత్ గుర్తించాల్సిన ప్రమాదకరమైన కుట్ర ఇదేనని నేను నమ్ముతున్నాను.
ఎదుగుతున్న ప్రతి దేశం… లోపల నుంచే బలహీనపరిచే ప్రయత్నాలను ఎదుర్కొంటుంది.
ట్యాంకులతో కాదు.
కథనాలతో.
సమాచార యుద్ధంతో.
వీధి ఉద్యమాలతో.
విదేశీ ప్రభావంతో.
భావజాల నెట్వర్క్లతో.
అయితే… బంగ్లాదేశ్ లేదా నేపాల్ తరహాలో భారత్లో కూడా ప్రభుత్వ మార్పు సాధ్యమని కలలు కంటున్నవారు… భారతదేశాన్ని అసలు అర్థం చేసుకోలేదు.
భారత్లో ప్రభుత్వాలు ఎన్నికల ద్వారానే ఏర్పడతాయి. ఎన్నికల ద్వారానే మారతాయి.
వీధి హింసతో కాదు.
వ్యవస్థీకృత అరాచకంతో కాదు.
విదేశీ నిధులతో నడిచే ప్రభావ వలయాలతో కాదు.
డీప్ స్టేట్ కార్యకలాపాలతో కాదు.
భారత్ను ఎవరు పాలించాలన్నది… గట్టిగా అరుస్తున్న గుంపులు నిర్ణయించవు. భారత ఓటరే నిర్ణయిస్తాడు.
అదే భారత ప్రజాస్వామ్య బలం.
బ్యాలెట్ స్థానంలో బారికేడ్లను నిలబెట్టాలని ప్రయత్నించే వారు… చివరికి ఓడిపోతారు.
ఇది మహేష్ జెఠ్మలానీ Mahesh Jethmalani ట్వీట్కు తెలుగు అనువాదం… ఆయన ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి Ram Jethmalani కుమారుడు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. రాజ్యాంగ, క్రిమినల్, వాణిజ్య చట్టాలకు సంబంధించిన అనేక కీలక కేసుల్లో వాదించారు. రాజ్యసభ సభ్యుడు. 2022లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుతో మహారాష్ట్ర నుంచి ఎన్నికయ్యారు.
Share this Article