Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘ఆ అర్ధరాత్రి హరహరమహాదేవ్ అంటూ చైనా శిబిరాలపై విరుచుకు పడ్డారు…’’

February 5, 2022 by M S R

……. By…. పార్ధసారధి పోట్లూరి ……… 2020 జూన్ నెలలో గాల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికుల మరణాల సంఖ్య 38 గా క్రమేపీ ద్రువీకరించబడుతోంది..! ఈ ఘర్షణలో భారత్ కి చెందిన 20 మంది సైనికుల వీర మరణం తెలిసిందే. అయితే అప్పట్లో చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తమ సైనికులు కేవలం 4 గురు మాత్రమేచనిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది ! కానీ ఆ లెక్క తప్పు అంటూ ఇప్పుడు చైనాలోని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.

చైనాలో బాగా పాపులర్ అయిన ఛాటింగ్ అప్లికేషన్ వీబో [Wiebo] లో జరిగిన ఛాటింగ్ ని రిపోర్ట్ చేస్తూ ఆస్ట్రేలియన్ news పేపర్ క్లాక్సన్ [Klaxon] వెల్లడించిన ప్రకారం… కనీసం 38 మంది చైనా సైనికులు ఆరోజు అర్ధరాత్రి భారత్ జవాన్లు చేసిన ఎదురు దాడిలో మరణించారు. క్లాక్సన్ పత్రిక తన స్వతంత్ర దర్యాప్తులో వీబో మొబైల్ చాట్ ఆప్ లో వివిధ సోషల్ మీడియా గ్రూపుల రిసెర్చ్ లో వాళ్ళు కనుక్కొన్న [అందరూ చైనా పౌరులు ] విషయాలని ఉటంకిస్తూ బీజింగ్ కేవలం 4గురి పేర్లు బయటికి చెప్పి మిగతా వాళ్ళ మరణాలని దాచింది అంటూ చైనా సోషల్ మీడియా గ్రూపులు ఆధారాలతో సహా బయటపెట్టాయి.

2020 జూన్ నెలలోనే పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు పలు స్వతంత్ర వార్తా చానెళ్ళు తాము రహస్యంగా సేకరించిన సమాచారం ప్రకారం చైనా సైనికుల మరణాల సంఖ్య 80 కి పైగానే ఉందని, అదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య 150 కి పైగానే ఉందని తెలిపాయి. కానీ చైనా ఈ వార్తలని ఖండించింది. పైగా నలుగురు పేర్లు చెప్పి వాళ్ళు మాత్రమే మరణించినట్లు ప్రకటించింది.

Ads

galwan

క్లాక్సన్ కథనం ప్రకారం…  ఆ అర్ధరాత్రి పూట భారత సైన్యానికి చెందిన బీహార్ రెజిమెంట్ సైనికులు చైనా సైనికులున్న గుడారాల మీద అకస్మాత్తుగా దాడి చేసారు. అర్ధరాత్రి పూట హర హర మహాదేవ్ [బీహార్ రెజిమెంట్ సింహనాదం [war cry ] హర హర మహాదేవ్ ] అంటూ నినాదాలు చేస్తూ, చైనా సైనిక శిబిరాల మీద మెరుపు దాడి చేసారు. ఆ శిబిరాలకి చుట్టూ ఉన్న సెంట్రీలని నిశ్సబ్దంగా చంపిన తరువాతే శిబిరాల మీద దాడి చేసారు. దాంతో నిద్రలో ఉన్న చైనా సైనికులు భయంతో పారిపోవడానికి ప్రయత్నించ,గా దొరికిన వారిని దొరికినట్లు మెడలు విరిచి చంపారు బీహార్ రెజిమెంట్ సైనికులు.

భారత సైనికుల బలం ముందు చైనా సైనికులు నిలబడలేకపోయారు. ఒక్కో భారత సైనికుడు ఇద్దరేసి చైనీయులని రెండు చేతులు మెడల చుట్టూ వేసి లాక్కుపోయారు. చైనా సైనికులు కనీసం ఒంటినిండా సరయిన బట్టలు లేకుండా ఉండడం వలన భయంతో తమ శిబిరాల పక్కనే ఉన్న లోయలోకి దూకి పారిపోయే క్రమంలో మైనస్ 4 డిగ్రీల చల్లటి గాల్వాన్ నదిలో పడి చనిపోయారు. అదే సమయంలో గాల్వాన్ నదిలోకి పైనుండి విపరీతంగా వరద ప్రవాహం రావడంతో గాల్వాన్ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది ఆ సమయంలో… ప్రాణ భయంతో నదిలోకి దూకిన చైనా సైనికులు గడ్డ కట్టే చలిలో అర్ధరాత్రి పూట చీకటిలో ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఆ చల్లటి నీటిలో ఒక నిముషం కంటే బ్రతికే అవకాశమే లేదు.

pla

ఆ రోజు అర్ధరాత్రి జరిగిన మెరుపు దాడిలో నది వైపు ఉన్న లోయలోకి కాకుండా మరో వైపు దూకి పారిపోయినవారు కొందరు. రాళ్ళ మధ్యలో జారి, లోయలోకి పడి పోయి, తీవ్రంగా గాయపడి, మరుసటి రోజు రెస్క్యూ దళాలకి దొరికి ఆస్పత్రులలో చేరారు. మెడికల్ టెస్ట్ తరువాత ఆర్మీలో కొలువుకు రాని వారి నుండి రహస్యంగా సేకరించిన సమాచారం ఇది.

పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో ధైర్య సాహసాలు [గాల్వాన్ సంఘటనలో] ప్రదర్శించారు అంటూ ఒక ఫంక్షన్లో నలుగురు సైనికులకి అవార్డులు ఇచ్చింది చైనా… అదే ఫంక్షన్లో ఒక విలేఖరి గాల్వాన్ లో చనిపోయిన వారి వివరాలు ఎందుకు రహస్యంగా ఉంచారు అని ప్రశ్నించినందుకు అతనిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఛాటింగ్ అప్లికేషన్ వీబో [Wiebo] లో సదరు విలేఖరికి 2 లక్షల 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో అతని అకౌంట్ ని చాలా నెలల వరకు బ్లాక్ చేసింది సైన్యం.

galwan

ఆస్ట్రేలియన్ డైలీ క్లాక్సన్ [Klaxon] పత్రిక రిపోర్ట్ ప్రకారం లోయలో గల్లంతు అయిన వారి వివరాలు ఇంతవరకు వారి బంధువులకి తెలియచేయలేదు చైనా… కానీ వాళ్ళ శవాలు దొరకలేదని కానీ ఎక్కడో అక్కడ బ్రతికి ఉండి ఉండవచ్చు అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నది ఇంతవరకు. కనీసం ప్రతీ 15 రోజులకి ఒకసారి తమ సైనికులని ఒక పధ్ధతి ప్రకారం రొటేషన్ చేస్తున్నది సరిహద్దుల్లో. అలా రొటేషన్ పద్ధతిలో కొత్తగా వచ్చే వాళ్ళు భయంతో వస్తున్నారని, వాళ్లకి ఆల్రెడీ గాల్వాన్ లో భారత సైనికులు ఎలా చిత్రవధ చేసారో బ్రతికి బయట పడ్డవారు కధలు కధలుగా చెప్పడంతో తమ షిఫ్ట్ ఎప్పుడు అయిపోతుందా ఎంత తొందరగా అక్కడి నుండి బయటపడదామా అనే ధ్యాసలోనే ఉంటున్నారు అని క్లాక్సన్ పత్రిక తెలిపింది…

సో, అప్పట్లోనే CIA రిపోర్ట్ ప్రకారం 300 మందికి పైగానే చనిపోయారు అంటూ పెంటగాన్ కి తెలియచేసింది నిజమన్నమాట! ఇప్పుడు కొత్తగా క్లాక్సన్ పత్రిక రిపోర్ట్ కూడా దొరికిన ఆధారాల మేరకే 38 మంది అని చెప్తున్నది. కానీ సోషల్ మీడియాలో అంతవరకే ఆధారాలు చూపిస్తున్నారు. ఎందుకంటే, ఆయా గ్రూపులలో మిగతా చనిపోయిన వారి బంధువులు ఉండకపోవడం ఒక కారణం. అయితే అనవసరంగా ప్రభుత్వంతో గొడవపడి జైలు జీవితం గడపడం ఇష్టం లేని వారు బయటపడట్లేదు ! ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా తమ పౌరులు సోషల్ మీడియాలో ఏం మాట్లాడుకుంటున్నారో పసిగట్టి, అలాంటి వారిని అరెస్ట్ చేస్తుంది చైనా మొదటి నుండి… కాబట్టి అసలు నిజాలు ఎప్పటికీ బయటికి వచ్చే అవకాశమే లేదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions