.
Priyadarshini Krishna.....
ఎప్పుడైనా 100 రూపాయల నోట్ల మీద ఓ కట్టడం గమనించారా..? అసలు ఏమిటది..? అది ‘రాణి కి వావ్’… ఆ 100 కరెన్సీ నోటు మీద ఉన్న దాని ప్రత్యేకత ఏంటి?
100 నోటుపై “రాణి కి వావ్” ను మోతీఫ్ గా ప్రచురించారు కదా… ఇంతకీ అది ఏంటి? అది ఎక్కడ ఉంది? దాని చరిత్రేంటి?
Ads
గుజరాత్లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక భూగర్భ ఏడు అంతస్తుల బావి రాణి కి వావ్. ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కింది. 11 వ శతాబ్దంలో ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థ జైసింగ్ నిర్మించారు.
ఇది ఆనాటి కాలంలోనే భారతీయుల ఆర్కిటెక్చర్ టెక్నాలజీకి తార్కాణంగా నిలిచింది…. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడం కోసం నిర్మించిన ఈ మెట్లబావి ఓ అద్భుతం.!
తొమ్మిది వందల ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది. దాదాపు ఏడు శతాబ్దాలపాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తు శాఖ వారు గుర్తించి అది పాడవకుండా తవ్వకాలు చేపట్టి …. మట్టికొట్టుకుపోయిన కట్టడాన్ని పునరుజ్జీవనంలోకి తెచ్చారు.!
నిర్మాణం ఓ అద్బుతం
ఈ బావి పొడవు 209 అడుగులు, వెడల్పు 65 అడుగులు , లోతు 88 అడుగులు… చూడడానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. రాణి కీ వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు…
ఈ శిల్పాలలో విష్ణువు దశావతారాలు కనిపిస్తాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని, ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి…
దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశవిదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఎంతో అందమైన శిల్పకళా నైపుణ్యం అణువణువునా నిండివున్న ఆ బావిని ఒక్కరోజులో చూసి ఆనందించడం నా వల్ల కాలేదు…
Share this Article