.
Pardha Saradhi Upadrasta …. ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఓ కలకలం కనిపిస్తోంది… మరోసారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఈసారి ఎలాగైనా స్పెషల్ మెజారిటీతో గట్టెక్కించాలని మోదీ, అమిత్ షా గట్టి సంకల్పంతో ఉన్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో… రాష్ట్రాల్లో రాజకీయ కలకలం. బీజేపీ దూకుడు అది దేశరాజకీయాలను ఎంత బలంగా ప్రభావితం చేయగలదో చూపిస్తోంది.
రేపు ఉద్ధవ్ బాపతు శివసేనకు చెందిన 9 లోక్సభ ఎంపీలలో ఏడుగురు, 20 మందిలో 14- 16 ఎమ్మెల్యేలు షిండే సేనలోకి వెళ్లనున్నారా? జూన్ 19 న శివసేన ఆవిర్భావ దినోత్సవం. ఈ లోపుగానే ఉద్ధవ్ సేనకు ముగింపు పలికే కార్యక్రమంలో NDA.
Ads
దీంతో NDA బలం…
293 (ప్రస్తుతం) +
20 ( NCPI) +
7 (ఉద్ధవ్ సేన విలీవం)
= 320
*******
జార్ఖండ్లో మరో రాజకీయం. వస్తున్న వార్తలు నిజమైతే, జూన్ 18 జార్ఖండ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన రోజుగా మారవచ్చు! జార్ఖండ్ కాంగ్రెస్ రాజకీయాల్లోని అతి పెద్ద వైరుధ్యాల్లో, బలహీనతల్లో ఒకటి బయటపడే అవకాశం కనిపిస్తోంది.
రాజ్యసభ ఎన్నికల్లో పరిమల్ నత్వానీ గెలవాలంటే 28 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం బీజేపీ వద్ద కేవలం 24 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఆయనకు కావాల్సిన అదనపు 4 ఓట్లు కాంగ్రెస్ లేదా జేఎంఎం నుంచే రావాల్సి ఉంటుంది.
ఇప్పటికే నత్వానీకి 30 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమైతే, ప్రతిరోజూ అంబానీలపై విమర్శలు చేసే అదే కూటమి నుంచి ఆయనకు మద్దతు లభిస్తున్నట్టే అవుతుంది.
ఇక్కడే రాజకీయ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. సంవత్సరాలుగా రాహుల్ గాంధీ “ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం” (Crony Capitalism), “అంబానీ- అదానీ రాజకీయాలు” అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన సొంత కూటమికి చెందిన ఎమ్మెల్యేలే, అంబానీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న పరిమల్ నత్వానీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఒకవేళ అదే జరిగితే, ఎన్నాళ్లుగానో నడుస్తున్న “దేశాన్ని అమ్మేశారు” (Desh Bech Diya) అనే రాజకీయ కథనాలకు, ప్రచారాలకు ఇది నిజమైన పరీక్ష అవుతుంది. మాటలు ఒక వైపు… ఓట్లు మరో వైపు… జూన్ 18న జార్ఖండ్లో రాజకీయాల క్రూరమైన హాస్య చతురత మరోసారి కనిపించవచ్చు!
#JharkhandPolitics #RajyaSabhaElection #ParimalNatwani #Congress #JMM #RahulGandhi #PoliticalIrony #IndianPolitics #DeshBechDiya
Share this Article