.
గ్లాసులో ‘మేడ్ ఇన్ ఇండియా’ మ్యాజిక్: విదేశీ స్కాచ్ను వెనక్కి నెడుతున్న భారతీయ సింగిల్ మాల్ట్స్!
ఒకప్పుడు మన దగ్గర విస్కీ అంటే.. విదేశీ బ్రాండ్, అందులోనూ ‘స్కాచ్’ కనిపిస్తే చాలు.. అది ఒక స్టేటస్ సింబల్గా భావించేవారు. విస్కీ ప్రియుల ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ విదేశీ బాటిల్స్పైనే ఉండేది. కానీ, కాలం మారింది, అభిరుచులు మారాయి. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. గ్లోబల్ బ్రాండ్స్కు దీటుగా, అంతకు మించి అనే రేంజ్లో మన ఇండియన్ సింగిల్ మాల్ట్ బ్రాండ్లు దూసుకుపోతున్నాయి.
Ads
స్కాచ్ను దాటేసిన మన ‘దేశీ’ సత్తా! కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీస్ (CIABC) గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. 2023లో విస్కీ విక్రయాల్లో ఇండియన్ సింగిల్ మాల్ట్స్ వాటా ఏకంగా 53 శాతానికి చేరింది. అంటే సుమారు 3.45 లక్షల కేసులు!
ఒకపక్క అంతర్జాతీయ బ్రాండ్లు కేవలం 11 శాతం వృద్ధితో సరిపెట్టుకుంటే, మన దేశీ బ్రాండ్లు మాత్రం 23 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. స్కాచ్ను వెనక్కి నెట్టి, విస్కీ ప్రియుల మనసును ‘ఇంద్రి’, ‘రాంపూర్’, ‘పాల్ జాన్’ వంటి బ్రాండ్లు గెలుచుకున్నాయి.
ఎందుకు ఈ మార్పు? ఈ విప్లవాత్మక మార్పుకు ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి…
-
క్వాలిటీలో రాజీ లేదు…: ఒకప్పుడు ఇండియన్ అంటే తక్కువ నాణ్యత అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ‘వరల్డ్ క్లాస్’ ప్రమాణాలతో విస్కీని తయారు చేస్తున్నారు…
-
‘మేడ్ ఇన్ ఇండియా’ సెంటిమెంట్…: భారతీయ వినియోగదారుల్లో ఆత్మగౌరవం పెరిగింది. మన దేశంలో తయారైన వస్తువులను వాడటంలో ఒక గర్వం కనిపిస్తోంది…
-
గ్లోబల్ క్రేజ్…: ‘పాల్ జాన్’ లాంటి బ్రాండ్లు మొదట విదేశీ మార్కెట్లలో (ముఖ్యంగా యూకేలో) అడుగుపెట్టి, అక్కడి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాక ఇండియాలోకి రావడం, మనవాళ్లకు ఆ బ్రాండ్పై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది…
భవిష్యత్తు: భారీ మార్కెట్, అంతకంటే భారీ వృద్ధి … భారత విస్కీ మార్కెట్ సైజ్ చూస్తుంటే భవిష్యత్తులో మనదే అగ్రస్థానం అనిపిస్తోంది. 2024లో 19.16 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్, 2030 నాటికి 48.65 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఏడాదికి 16.80% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఈ రంగం, ప్రపంచ దేశాలను విస్తుపోయేలా చేస్తోంది. గ్లోబల్ దిగ్గజం ‘జానీ వాకర్’ కంటే ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 4 విస్కీ బ్రాండ్లు మన ఇండియావే కావడం నిజంగా గర్వకారణం!
ట్రెండ్ మారింది.. ఇప్పుడు ‘ప్రీమియమైజేషన్’! మార్కెట్ ఇప్పుడు ‘ప్రీమియమైజేషన్’ వైపు అడుగులేస్తోంది. కేవలం మత్తు కోసం కాకుండా, రుచి కోసం తాగే వారు పెరిగారు. అందుకే అర్బన్ మిలీనియల్స్ ఇప్పుడు ఫ్లేవర్డ్, క్రాఫ్ట్ విస్కీల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక సేల్స్ విషయానికొస్తే.. ఇప్పుడు పబ్లు, బార్ల కంటే రిటైల్ అవుట్లెట్లు, లిక్కర్ స్టోర్లే కింగ్స్. కన్వీనియెన్స్, తక్కువ ధరలు, ఇంట్లోనే హాయిగా ఎంజాయ్ చేసే ట్రెండ్ వల్ల రిటైల్ స్టోర్ల వాల్యూ పెరిగింది.
ఒకప్పుడు విదేశీ లేబుల్ కోసం ఆరాటపడిన చేతులు, ఇప్పుడు దేశీయ సింగిల్ మాల్ట్ గ్లాసులను గర్వంగా అందుకుంటున్నాయి. నాణ్యత, అభిరుచి, దేశీయ బ్రాండ్ల పట్ల పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే.. భారత్ ఇకపై ప్రపంచ విస్కీ మ్యాప్లో ఒక శక్తివంతమైన కేంద్రంగా నిలవడం ఖాయం! మామా ఏక్ పెగ్ లా ..!! నాట్ స్కాచ్, ఓన్లీ ఇండియన్..!!
Share this Article