.
Rochish Mon …. ఎస్. జానకి – ఒక గాయని రూపంలో అద్భుతత్వం —- భారతదేశ సినిమా గానంలో ఒక గాయని రూపంలో అద్భుతత్వం మూర్తిమత్వం దాల్చింది! ఆ మూర్తిమత్వం ఎస్. జానకి!!
మన దేశ సినిమా గానంలో జానకి అంత ప్రతిభావంతమైన గాయని ఇవాళ్టి వరకూ రాలేదు! గొప్ప గాత్రం, గొప్ప విద్వత్ ఉన్న, గొప్ప గానం చేసిన గాయనీమణులు మన దేశ సినిమాలో ఉన్నారు. వైవిధ్యం, ప్రతిభ, expression, balance, సంగతులు వెయ్యడంలో నైపుణ్యం, కచ్చితత్వం, స్వరసమం ఇన్నింటి మేళవింపుతో జానకి జానకే.
Ads
ఎస్. జానకి గొప్పతనం తమిళ్ష్, కన్నడం, మలయాళం భాషల పాటల్లో నమోదైనంతగా తెలుగులో అవకపోవడం బాధాకరం. ఇళైయరాజా ఎస్. జానకి ఔన్నత్య పరిణామాల్ని, పరిమాణాల్ని వెలికి తీసుకురావడం నిజం.
ఇళైయరాజాకు ముందే ఎమ్.ఎస్. విశ్వనాన్(థ), కె.వీ.మహాదేవన్, జీ.కె. వెంకటేశ్, రాజన్-నాగేంద్ర, విజయభాస్కర్, దేవరాజన్, బాబురాజన్, వీ. దక్షిణామూర్తి వంటి సంగీత దర్శకులు జానకి చేత మహోన్నతంగా పాడించారు. జానకి వల్ల మాత్రమే సాధ్యమయ్యే సంగీతాన్ని వాళ్లు సాధించారు.

‘హేమవతి’ కన్నడం సినిమాలో ఎల్. వైద్దియనాద(థ)న్ చేసిన పాట “శివశివ ఎన్నద నాళిగ ఏకే…” ఒక్క జానకి మాత్రమే పాడగలిగినన పాట. తన గాన జీవితంలో తాను పాడిన పాటల్లో కష్టమైన పాట అదే అని స్వయంగా జానకి చెప్పారు.
“నీ లీల పాడెద దేవా…” పాట గానం గురించి మనకు తెలిసిందే. ఈ “నీ లీల పాడెద దేవా…” పాట కన్నా కష్టమైన పాట ఆ “శివశివ ఎన్నద నాళిగె ఏకే…” పాట. ఒక పంక్తి ఒక రాగంలోనూ తదుపరి పంక్తి మరో రాగంలోనూ ఉంటుంది ఆ పాటలో. పాట చివరలో వైఅలిన్ వాదన కోసం నిర్ణయించబడ్డ స్వరాలను జానకి పాడేశారు. సంగీత దర్శకుడి ఊహకు మించిన విషయం అది. ఈ ఒక్క పాట చాలు జానకి ఎంత గొప్ప గాయనీమణో తెలుసుకోవడానికి.
తమిళ్ష్లో కె.వీ. మహాదేవన్, ఎమ్. ఎస్. విశ్వనాదన్, ఇళైయరాజా, రహ్మాన్ వంటి సంగీత దర్శకులు జానకితో అద్భుతాలను సాధించారు. “జానకి అమ్మ పాడుతుంటే పాట నుంచి ఆత్మ వస్తూంటుంది” అని రహ్మాన్ అన్నారు.
‘స్వరసమం’, సంతులనం (balance), expression, mood, modulation, flexibility, range adoption, variety, language consciousness వంటి అంశాలు (features) జానకి గానంలో, గాత్రంలో ప్రత్యేకతలు. వీటిల్లో స్వరసమం, సంతులనం (balance), expression, mood, modulation విశేషాంశాలు. ఈ అంశాల పరంగా కొన్ని జానకి పాటలు:
సప్తపది సినిమాలోని “నెమలికి నేర్పిన నడకలివి…”
“గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండుండేవి…”
“నీలి మేఘాలలో గాలి కెరటాలలో…”
(ఈ పాటను ఘంటసాల కూడా పాడారు. ఘంటసాల గానం స్వరసమం, సంతులనం (balance), expression, mood, modulation లేకుండా ఉంటుంది)

“నరవరా ఓ కురువరా…”
(Soprano గానం ఈ పాట)
“ఈ దుర్యోధన దుశ్శాసన …”
(ఈ పాట అంత శక్తివంతమైన గానం మరో గాయని వల్ల సాధ్యపడదు)
“వెన్నెల్లో గోదారి అందం…”
“నీ కనుదోయి నిద్దురనై…”
(గజల్ స్థాయి గానం ఈ పాట)
“గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన…”
(ఈ పాటలో చిన్న పిల్లాడి గొంతుతో పాడడం గొప్ప విషయం)
“కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు…”
ఇంకా తమిళ్ష్ సినిమాల్లో ఇళైయరాజా సంగీతంలో ఆశ్చర్యకరంగా పాశ్చాత్య సంగీత ధోరణిలో పాడారు. కన్నడం, మలయాళం భాషల్లో జానకి మహోన్నతమైన గానం చేశారు.

విద్వత్ పరంగా గాయని వాణి జయరాం చాల గొప్ప. ఆ వాణి జయరాం కన్నా గాయనిగా జానకి ఎంత గొప్పో తెలియాలంటే ‘ఎరడు కనసు’ కన్నడం సినిమాలో “పూజిసరల్లి హుగళె…” పాడిన పాట వినాలి. ఈ పాటను తెలుగులో “పూజలు చేయ పూలు తెచ్చాను…” పాటగా వాణి జయరాం పాడారు. జానకి గానంలోని ఉదాత్తత, స్వరసమం, mood, expression వాణి జయరాంలో ఉండవు.
1976లో వచ్చిన ‘మాంగల్య భాగ్య’ కన్నడం సినిమాలో “ఆసెయ భావ ఒలవిన జీవ…” అంటూ జానకి పాడగా “మల్లెలు పూసె వెన్నెల కాసె…” అంటూ బాలు ఇంటింటి రామాయణం సినిమాలో పాడారు. స్వరసమం, balance, profundity, నిండుతనం, expression- sublimity పరంగా జానకి గానం స్థాయికి బాలు గానం అమరలేదు.

తెలుగులో సుశీల పాడిన “జోరుమీదున్నావు తుమ్మెద…” పాటను తమిళ్ష్లో జానకి పాడారు. నిర్ద్వంద్వంగా జానకి సుశీల కన్నా అన్ని విధాలుగానూ మేలు ఈ పాట గానంలో.
జానకి మలయాళ సినిమా గానం ఒక శకం. ముఖ్యంగా జానకి మలయాళం ఉచ్చారణ చాల గొప్పగా ఉంటుంది. అదేమిటో, అదెందుకో జానకి మలయాళం పాటను అత్యున్నతంగా పాడేశారు.
జానకి పాడిన ఓ 10 మలయాళం పాటలు వింటే మరో స్థాయి జానకి మన మెదళ్లను, మనసులను స్పృశిస్తారు. మలయాళీయులు జానకిని ఎంతో గొప్పగా పరిగణిస్తారు! గాయని చిత్ర తాను జానకి నుంచి స్ఫూర్తి పొందానని గట్టిగా చెప్పారు.
ఈ వరకే చిత్ర వంటి గాయనీమణికే జానకి స్ఫూర్తి, ఆదర్శం. దక్షిణ భారతంలో ఇంత వరకూ వచ్చిన గాయనీమణుల్లో ఇకపై రానున్న గాయనీమణులకు జానకి మాత్రమే ఆదర్శం కానున్నారు. జానకి వంటి గాయని మళ్లీ మన దేశం సినిమాలో పుట్టక పోవచ్చు!
రోచిష్మాన్
9444012279

Share this Article