.
Pardha Saradhi Upadrasta … జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ప్రస్తుత అసెంబ్లీ బలం: ఇండి కూటమి: 56 మంది ఎమ్మెల్యేలు
– ఎన్డీఏ: 24 మంది ఎమ్మెల్యేలు
– ఇతరులు: 1 ఎమ్మెల్యే
మొత్తం ఎమ్మెల్యేలు: 81
రెండు రాజ్యసభ స్థానాలు ఉండగా, ఎన్నిక కావడానికి అభ్యర్థికి 28 ఓట్లు అవసరం.
ఇప్పటివరకు నామినేషన్ పత్రాలు తీసుకున్న వారి పేర్లు:
– బైజ్నాథ్ రామ్ (జేఎంఎం)
– ప్రణవ్ ఝా (కాంగ్రెస్)
– గౌరవ్ వల్లభ్ (స్వతంత్ర)
– పరిమల్ నత్వానీ (స్వతంత్ర)
– వి. విజయసాయి రెడ్డి (స్వతంత్ర)
Ads
కాగితంపై చూస్తే, రెండు స్థానాలను గెలుచుకోవడానికి ఇండి కూటమికి తగినంత సంఖ్యాబలం ఉంది. అయితే, రెండవ స్థానం విషయంలో ఇటీవల జేఎంఎం, కాంగ్రెస్ల మధ్య విభేదాలు తలెత్తడంతో, క్రాస్-ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.
బైజ్నాథ్ రామ్ ఒక స్థానాన్ని సునాయాసంగా గెలుచుకుంటారని అంచనా.
ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ విధంగా ఉన్నాయని అనుకుందాం:
– బైజ్నాథ్ రామ్ – 28 (ఎన్నికయ్యారు)
– ప్రణవ్ ఝా – 24
– గౌరవ్ వల్లభ్ – 24
– పరిమల్ నత్వానీ – 4
– వి. విజయసాయి రెడ్డి – 1
రాజ్యసభ ఎన్నికలలో, ప్రతి ఎమ్మెల్యే తమ ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులకు ఓట్లు వేస్తారు.
ఉదాహరణకు, ఒక ఎమ్మెల్యే ఈ విధంగా ఓటు వేయవచ్చు:
1వ ప్రాధాన్యత – వి. విజయసాయి రెడ్డి
2వ ప్రాధాన్యత – గౌరవ్ వల్లభ్
3వ ప్రాధాన్యత – పరిమల్ నత్వానీ …. లేదా
1వ ప్రాధాన్యత – పరిమల్ నత్వానీ
2వ ప్రాధాన్యత – గౌరవ్ వల్లభ్
3వ ప్రాధాన్యత – ప్రణవ్ ఝా
విజయసాయి రెడ్డికి అతి తక్కువ ఓట్లు ఉన్నందున, ఆయన మొదటగా నిష్క్రమిస్తారు. ఆ ఓటులో గౌరవ్ వల్లభ్ రెండవ ప్రాధాన్యతగా ఉంటే, వల్లభ్కు 25 ఓట్లు వస్తాయి. అప్పుడు నత్వానీ 4 ఓట్ల తేడాతో నిష్క్రమిస్తారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు గౌరవ్ వల్లభ్ను తమ తదుపరి ప్రాధాన్యతగా గుర్తించినట్లయితే, వల్లభ్కు 29 ఓట్లు వస్తాయి.
తుది లెక్క:
-గౌరవ్ వల్లభ్ – 29
-ప్రణవ్ ఝా – 24
ఫలితం: మొదటి ప్రాధాన్యత ఓట్లలో ప్రణవ్ ఝాతో సమానంగా ప్రారంభించినప్పటికీ, గౌరవ్ వల్లభ్ రెండవ రాజ్యసభ స్థానాన్ని గెలుచుకుంటారు.
అందుకే రెండవ స్థానం కేవలం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కతోనే కాకుండా, ప్రాధాన్యత ఓట్లు , క్రాస్-ఓటింగ్ ద్వారా కూడా నిర్ణయించబడుతుంది.
ఇదిలా ఉండగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి పేరును కూడా వెల్లడించకుండా ఒక నామినేషన్ పత్రంపై NDA ఎమ్మెల్యేల సంతకాలు సేకరించినట్లు సమాచారం.
గౌరవ్ వల్లభ్ నామినేషన్ పత్రాలపై సంతకాలు జరిగినట్లు, అలాగే కొన్ని ఖాళీ పత్రాలపై కూడా సంతకాలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో అంబానీ సన్నిహితుడిగా పేరున్న పరిమల్ నత్వానీ కూడా బరిలో ఉన్నారు.
సందట్లో సడేమియా విజయ్ సాయి రెడ్డి కూడా నామినేషన్ పత్రాలు తీసుకున్నాడు. ఎవరు ఈయన నామినేషన్ పాత్రల మీద సంతకాలు పెడతారో మరి. (అసలు ఈయన ఆ రాష్ట్రానికి వెళ్లి ఏం రాజకీయం చేస్తున్నట్టు… ఏదో మర్మం ఉండే ఉంటుంది… రాజకీయాల నుంచి వైదొలిగినట్టు గతంలో చెప్పుకున్నాడు… పరిమల్ నత్వానీ, విజయసాయిరెడ్డి ఇద్దరూ గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యులే…)
స్వతంత్ర అభ్యర్థి లేదా గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి అయితే , కనీసం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు ప్రతిపాదకులుగా ఉండాలి. బీజేపీ ఎంఎల్ఏ లు ఎవరికి ప్రతిపాదకులుగా ఉంటాయో మరి.
.
బీజేపీ ఇంకా తన పూర్తి ఎత్తుగడను బయటపెట్టలేదు. ఖాళీ నామినేషన్ పత్రాల వ్యవహారం రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు దారితీస్తోంది. అయితే వీటి వెనుక అసలు వ్యూహం ఏమిటో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాకే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అందుకే ఈ ఎన్నికలో కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు… ప్రాధాన్యత ఓట్లు, క్రాస్-వోటింగ్, చివరి నిమిషం రాజకీయ వ్యూహాలు కూడా కీలకంగా మారే అవకాశముంది.
ఈ రోజు రాజ్యసభ పోటీకి నామినేషన్ లకు చివరి తేదీ. అసలు వీరిలో ఎవరు పోటీలో ఉంటారో తెలియదు. బీజేపీ చివరి నిమిషములో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి మా మద్దతు అనే అవకాశము ఎక్కువ.
అది జరిగితే పైన జరిగినట్లు జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంది. చివరకు అంతా కలిసి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థికి జెల్ల కొట్టేలా వున్నారు. పాపం. పాపం ఇండి కూటమి లో కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది.
పారిశ్రామిక వెతలు స్వతంత్ర అభ్యర్థులుగా రాజ్యసభ టికెట్ కోసం రంగంలోకి దిగితే ఎమ్మెల్యే లకు పండగ.
.
#Jharkhand #RajyaSabha #RajyaSabhaElections #JMM #Congress #BJP #IndiaAlliance #NDA #GauravVallabh #ParimalNathwani #Politics #IndianPolitics
Share this Article